టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవల సర్కారు వారి పాట పేరిట ఓ సినిమా వచ్చింది. ఇందులో బ్యాంకుల్లో జరుగుతున్న లెక్కలేనన్నిఅక్రమాలు, ఈఎంఐల పేరిట జనంపై జరుగుతున్న వేధింపులు… సంపన్నులు ఎగవేస్తున్న రుణాలు, ఆ రుణాలను మిడిల్ క్లాస్ ఈఎంఐల ద్వారానే వసూలు చేస్తున్న వైనాన్ని ఆసక్తిగా చూపారు. జనం నుంచి ఈ సినిమాకు మంచి అప్లాజ్ దక్కింది. బ్యాంకుల్లో మనకు తెలియకుండా ఇంత జరుగుతోందా? అంటూ ఈ సినిమాను చూసినవారంతా నోరెళ్లబెట్టారు.
ఈ సినిమా మొత్తానికి ఓ సీన్ హైలెట్ గా నిలుస్తుంది.రిటైర్ అయినా కూడా ఇంటి రుణానికి సంబంధించిన వాయిదాలు చెల్లించేందుకు ఓ పెద్దాయన సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఉంటాడు. క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లిస్తూ ఉంటారు. అయితే తన సతీమణి అనారోగ్యంతో ఓ నెల వాయిదాను ఆయన చెల్లించరు. దీంతో ఆయన ఇంటికి వచ్చిన రికవరీ ఏజెంట్లు ఆయనను అభాసుపాలు చేసే యత్నం చేస్తారు. ఈ టైంలోనే హీరో వస్తాడు. వారి ఆట కట్టిస్తాడు.అదంతా సినిమా. నిజ జీవితంలో అలా కుదరదు కదా.
నిజమే.. సినిమాల్లో మాదిరిగా నిజ జీవితంలో అలాంటి అవమానాలకు అడ్డే ఉండదు, ఫలితంగా ఆతహత్యలు జరుగుతూ ఉంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇప్పుడు కృష్ణా జిల్లా గుడివాడలో చోటుచేసుకుంది. ఫైనాన్స్ సంస్థల నిర్వాకానికి ఓ ఆటో డ్రైవర్ తన కుటుంబాన్ని దిక్కులేని దానిని చేసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాధితుడు తనను వేధించిన ఫైనాన్స్ సంస్థ పేరు, ఇతరత్రా వివరాలు వెల్లడించి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏపీలో ఇప్పుడు కలకలం రేపుతోంది.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే… గుడివాడకు చెందిన రావి సత్తిబాబు ఆటో డ్రైవర్. తన అవసరాల నిమిత్తం విస్తార్ ఫైనాన్స్ అనే సంస్థ నుంచి రూ.7.8 లక్షల రుణాన్ని తీసుకున్నారు. ఇప్పటిదాకా క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లిస్తూనే ఉన్నాడు. అయితే గత నెలలో ఆయన సతీమణి అనారోగ్యంతో ఈఎంఐ చెల్లించలేకపోయాడు. దీంతో విస్లార్ ఏజెంట్లు అతడి ఇంటికి వచ్చి పరువు తీసేలా వ్యవహరించారు. ఈ అవమాన భారాన్ని తట్టుకోలేక సత్తిబాబు ఆత్మహత్య చేసుకున్నాడు.
This post was last modified on January 31, 2025 12:29 pm
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…