Trends

ఊహించని వికెట్ : స్టేడియం నుండి వెళ్లిపోయిన కోహ్లీ ఫ్యాన్స్

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రంజీ మ్యాచ్ కు ఫ్యాన్స్ ఏ స్థాయిలో తరలి వచ్చారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్రీ ఎంట్రీ కావడంతో కేవలం విరాట్ కోహ్లీ కోసమే వేలాది మంది గ్రౌండ్ లో ప్రత్యక్షమైన విధానం ఆశ్చర్యాన్ని కలిగించింది. మ్యాచ్ మొదలవ్వడానికి ముందు స్టేడియం ముందు కీలో మీటర్ల మేర క్యూ లైన్స్ దర్శనమిచ్చాయి. కాస్త తొక్కిసలాట కూడా జరిగింది. దీంతో కొంతమంది ఫ్యాన్స్ గాయపడ్డారు.

ఇక విరాట్ కోహ్లీ 12 ఏళ్ల విరామం తర్వాత రంజీ ట్రోఫీలో ఆడేందుకు మైదానంలో అడుగుపెట్టడంతో పక్కా పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇస్తాడాని అందరూ అనుకున్నారు. చాలా కాలంగా విరాట్ ఫామ్ లోకి రావడానికి సతమతమవుతున్నాడు. అతని ఆట తీరులో పట్టు తగ్గిందనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇక అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్ జట్టుతో ఢిల్లీ తలపడుతుండగా, కోహ్లీ ప్రత్యేకంగా తన ఫామ్‌ను పునరుద్ధరించుకునేందుకు ఈ మ్యాచ్‌లో పాల్గొన్నాడు.

కానీ అభిమానుల అంచనాలను నిలబెట్టలేకపోయాడు. క్రీజులోకి వచ్చిన కోహ్లీ తక్కువ స్కోరుకే ఔటవడంతో అభిమానులు నిరాశ చెందారు. 15 బంతులు మాత్రమే ఆడిన కోహ్లీ, కేవలం 6 పరుగులకే బౌల్డ్ అయ్యాడు. రైల్వేస్ బౌలర్ సాంగ్వాన్ వేసిన అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ కావడం, స్టేడియంలో ఉన్న అభిమానులను ఆశ్చర్యపరిచింది. కోహ్లీ బ్యాటింగ్ కోసం ఎదురుచూసినవారికి ఇది నిరాశ కలిగించింది.

దీంతో ఒక్కసారిగా భారీ స్థాయిలో ఫ్యాన్స్ స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోయారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎగబడి తొక్కిసలాట ప్రమాదంను దాటి మరి వచ్చిన ఫ్యాన్స్ కు కోహ్లీ ఏమాత్రం కిక్కివ్వల్లేదు. అందుకే త్వరగానే స్టేడియం నుంచి బయటకు క్యూ కట్టారు.

ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రైల్వేస్ జట్టు 241 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఢిల్లీ బ్యాటింగ్ ప్రారంభించగా, 97 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. కోహ్లీపై భారీ ఆశలు పెట్టుకున్న ఢిల్లీ జట్టు, అతని వికెట్ త్వరగా పడిపోవడంతో కష్టాల్లో పడింది.

This post was last modified on January 31, 2025 11:58 am

Share

Recent Posts

గోరు ముద్దలు కాదు విషపు ముద్దలు తినిపించారు

వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…

2 hours ago

టాక్సిక్ జీవోలు… దాటాల్సిన సవాళ్లు

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…

2 hours ago

వారణాసి తరువాత మహేష్ ఒప్పుకుంటే అనిల్ తోపే

వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…

4 hours ago

మహిళా ఎస్సైని కొట్టిన ఎమ్మెల్యే కూతురు

కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…

5 hours ago

గీతూ మోహన్ దాస్… పెద్ద కథే గురూ

టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…

6 hours ago

ఇరుముడిని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందా

ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…

6 hours ago