Trends

ఊహించని వికెట్ : స్టేడియం నుండి వెళ్లిపోయిన కోహ్లీ ఫ్యాన్స్

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రంజీ మ్యాచ్ కు ఫ్యాన్స్ ఏ స్థాయిలో తరలి వచ్చారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్రీ ఎంట్రీ కావడంతో కేవలం విరాట్ కోహ్లీ కోసమే వేలాది మంది గ్రౌండ్ లో ప్రత్యక్షమైన విధానం ఆశ్చర్యాన్ని కలిగించింది. మ్యాచ్ మొదలవ్వడానికి ముందు స్టేడియం ముందు కీలో మీటర్ల మేర క్యూ లైన్స్ దర్శనమిచ్చాయి. కాస్త తొక్కిసలాట కూడా జరిగింది. దీంతో కొంతమంది ఫ్యాన్స్ గాయపడ్డారు.

ఇక విరాట్ కోహ్లీ 12 ఏళ్ల విరామం తర్వాత రంజీ ట్రోఫీలో ఆడేందుకు మైదానంలో అడుగుపెట్టడంతో పక్కా పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇస్తాడాని అందరూ అనుకున్నారు. చాలా కాలంగా విరాట్ ఫామ్ లోకి రావడానికి సతమతమవుతున్నాడు. అతని ఆట తీరులో పట్టు తగ్గిందనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇక అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్ జట్టుతో ఢిల్లీ తలపడుతుండగా, కోహ్లీ ప్రత్యేకంగా తన ఫామ్‌ను పునరుద్ధరించుకునేందుకు ఈ మ్యాచ్‌లో పాల్గొన్నాడు.

కానీ అభిమానుల అంచనాలను నిలబెట్టలేకపోయాడు. క్రీజులోకి వచ్చిన కోహ్లీ తక్కువ స్కోరుకే ఔటవడంతో అభిమానులు నిరాశ చెందారు. 15 బంతులు మాత్రమే ఆడిన కోహ్లీ, కేవలం 6 పరుగులకే బౌల్డ్ అయ్యాడు. రైల్వేస్ బౌలర్ సాంగ్వాన్ వేసిన అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ కావడం, స్టేడియంలో ఉన్న అభిమానులను ఆశ్చర్యపరిచింది. కోహ్లీ బ్యాటింగ్ కోసం ఎదురుచూసినవారికి ఇది నిరాశ కలిగించింది.

దీంతో ఒక్కసారిగా భారీ స్థాయిలో ఫ్యాన్స్ స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోయారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎగబడి తొక్కిసలాట ప్రమాదంను దాటి మరి వచ్చిన ఫ్యాన్స్ కు కోహ్లీ ఏమాత్రం కిక్కివ్వల్లేదు. అందుకే త్వరగానే స్టేడియం నుంచి బయటకు క్యూ కట్టారు.

ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రైల్వేస్ జట్టు 241 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఢిల్లీ బ్యాటింగ్ ప్రారంభించగా, 97 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. కోహ్లీపై భారీ ఆశలు పెట్టుకున్న ఢిల్లీ జట్టు, అతని వికెట్ త్వరగా పడిపోవడంతో కష్టాల్లో పడింది.

This post was last modified on January 31, 2025 11:58 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

7 minutes ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

3 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

4 hours ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

4 hours ago

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

5 hours ago

కేంద్రంతో క‌లుస్తాం.. మోడీతో కాదు: రేవంత్ అంత‌రంగం

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. నువ్వు నాతో…

5 hours ago