Trends

ఊహించని వికెట్ : స్టేడియం నుండి వెళ్లిపోయిన కోహ్లీ ఫ్యాన్స్

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రంజీ మ్యాచ్ కు ఫ్యాన్స్ ఏ స్థాయిలో తరలి వచ్చారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్రీ ఎంట్రీ కావడంతో కేవలం విరాట్ కోహ్లీ కోసమే వేలాది మంది గ్రౌండ్ లో ప్రత్యక్షమైన విధానం ఆశ్చర్యాన్ని కలిగించింది. మ్యాచ్ మొదలవ్వడానికి ముందు స్టేడియం ముందు కీలో మీటర్ల మేర క్యూ లైన్స్ దర్శనమిచ్చాయి. కాస్త తొక్కిసలాట కూడా జరిగింది. దీంతో కొంతమంది ఫ్యాన్స్ గాయపడ్డారు.

ఇక విరాట్ కోహ్లీ 12 ఏళ్ల విరామం తర్వాత రంజీ ట్రోఫీలో ఆడేందుకు మైదానంలో అడుగుపెట్టడంతో పక్కా పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇస్తాడాని అందరూ అనుకున్నారు. చాలా కాలంగా విరాట్ ఫామ్ లోకి రావడానికి సతమతమవుతున్నాడు. అతని ఆట తీరులో పట్టు తగ్గిందనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇక అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్ జట్టుతో ఢిల్లీ తలపడుతుండగా, కోహ్లీ ప్రత్యేకంగా తన ఫామ్‌ను పునరుద్ధరించుకునేందుకు ఈ మ్యాచ్‌లో పాల్గొన్నాడు.

కానీ అభిమానుల అంచనాలను నిలబెట్టలేకపోయాడు. క్రీజులోకి వచ్చిన కోహ్లీ తక్కువ స్కోరుకే ఔటవడంతో అభిమానులు నిరాశ చెందారు. 15 బంతులు మాత్రమే ఆడిన కోహ్లీ, కేవలం 6 పరుగులకే బౌల్డ్ అయ్యాడు. రైల్వేస్ బౌలర్ సాంగ్వాన్ వేసిన అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ కావడం, స్టేడియంలో ఉన్న అభిమానులను ఆశ్చర్యపరిచింది. కోహ్లీ బ్యాటింగ్ కోసం ఎదురుచూసినవారికి ఇది నిరాశ కలిగించింది.

దీంతో ఒక్కసారిగా భారీ స్థాయిలో ఫ్యాన్స్ స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోయారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎగబడి తొక్కిసలాట ప్రమాదంను దాటి మరి వచ్చిన ఫ్యాన్స్ కు కోహ్లీ ఏమాత్రం కిక్కివ్వల్లేదు. అందుకే త్వరగానే స్టేడియం నుంచి బయటకు క్యూ కట్టారు.

ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రైల్వేస్ జట్టు 241 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఢిల్లీ బ్యాటింగ్ ప్రారంభించగా, 97 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. కోహ్లీపై భారీ ఆశలు పెట్టుకున్న ఢిల్లీ జట్టు, అతని వికెట్ త్వరగా పడిపోవడంతో కష్టాల్లో పడింది.

This post was last modified on January 31, 2025 11:58 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అంబటి కోసం కదిలొచ్చిన కాపు నేతలు!

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ…

1 hour ago

జగన్‌ను కడిగేసిన అర్నాబ్ గోస్వామి

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…

3 hours ago

టీడీపీ ఎమ్మెల్యేపై రోజా బాడీ షేమింగ్ కామెంట్స్

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే…

3 hours ago

ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం… కేటీఆర్ అనుమానాలు

నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…

3 hours ago

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

4 hours ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

5 hours ago