ఉద్యోగం అంటే సాధారణంగా డిగ్రీలు, అనుభవం, స్కిల్స్ ఇలా అనేక అర్హతలు అవసరమవుతాయి. అయితే, బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ సంస్థ ఇచ్చిన ఉద్యోగ ప్రకటన మాత్రం ఊహించని విధంగా ఉంది. మెంటరింగ్, కన్సల్టింగ్ ప్లాట్ఫారమ్ టాప్మేట్ సంస్థ ‘చీఫ్ డేటింగ్ ఆఫీసర్’ (CDO) హోదాకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ప్రేమ, డేటింగ్ ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, ఆధునిక డేటింగ్ ట్రెండ్స్పై అవగాహన ఉన్నవారిని మాత్రమే ఈ ఉద్యోగానికి ఆహ్వానిస్తున్నారు.
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే ఓ ప్రత్యేకమైన అర్హతలు అవసరం. కనీసం ఒకసారి బ్రేకప్ అనుభవం ఉండాలి. రెండు ‘సిట్యుయేషన్షిప్స్’ (సాధారణ డేటింగ్ కంటే ముందుండే సంబంధాలు) లో ఉన్న అనుభవం ఉండాలి. మూడు డేట్స్ చేసిన అనుభవం ఉండాలి. డేటింగ్ యాప్స్ ఎలా పనిచేస్తాయో తెలిసి ఉండాలి. కనీసం రెండు లేదా మూడు డేటింగ్ యాప్స్లో అనుభవం ఉండాలి. గోస్టింగ్, బ్రెడ్క్రంబింగ్ లాంటి కొత్త డేటింగ్ ట్రెండ్స్ గురించి తెలుసుకోవడంతో పాటు, కొత్త ట్రెండ్లను క్రియేట్ చేయగల శక్తి ఉండాలి.
టాప్మేట్ సంస్థ మూడోపాయింట్లో ఆసక్తికరమైన విషయం స్పష్టం చేసింది. “డేటింగ్ సలహా ఇచ్చే వ్యక్తి మీ స్నేహితుల్లో ఉంటే, మీకోసం ఇది బెస్ట్ ఉద్యోగం. డేటింగ్ సంస్కృతిని అర్థం చేసుకోవడమే కాకుండా, కొత్త టెర్మ్స్ను రూపొందించగల మేచ్ మేకర్స్ను మేం వెతుకుతున్నాం” అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పోస్టుకు భారీ స్పందన వచ్చింది. కొందరు జోక్గా చూసినా, మరికొందరు ఆసక్తిగా నిజంగానే అప్లై చేయాలని భావిస్తున్నారు.
ఇటీవల కాలంలో డేటింగ్ యాప్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ తరహా ఉద్యోగాలు భవిష్యత్తులో మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ప్రేమ, సంబంధాల గురించి లోతుగా అర్థం చేసుకుని, కొత్త ట్రెండ్స్ను సృష్టించే టాలెంట్ ఉంటే, ఇది మీకో అవకాశం కావొచ్చు! మరి, ఈ ఉద్యోగానికి నిజంగా ఎవరైనా అప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నారా?
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…