ఇండియాలో ఎక్కడైనా అమ్మాయిపై అత్యాచారం జరిగి ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోతే జనాల్లో ఆగ్రహం పెల్లుబుకుతుంది. సోషల్ మీడియాలో కొన్ని రోజులు వీరావేశంతో స్పందిస్తారు అందరూ. కానీ ఆ తర్వాత అంతా మరిచిపోతారు. ప్రభుత్వాలు కూడా ఆ వేడి ఉన్నంత వరకు ఏదో చేసేస్తున్నట్లు కలరింగ్ ఇస్తాయి. ఆ తర్వాత కేసును నీరుగార్చేస్తుంటాయి.
నిర్భయ, దిశ లాంటి కొందరి విషయంలో మాత్రమే సత్వర చర్యలు చోటు చేసుకున్నాయి. చాలా కేసులు చరిత్రలో కలిసిపోయాయి. నిందితులు ఏ ఇబ్బందీ లేకుండా స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో సుగాలి ప్రీతి అనే పేద అమ్మాయిని రేప్ చేసి ఆమె చావుకు కారణమైన వాళ్లను ఇప్పటిదాకా శిక్షించలేదు. ఈ దారుణం జరిగి మూడేళ్లు దాటిపోయింది. ఈ ఉదంతంపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ఇప్పటి జగన్ సర్కారూ స్పందించట్లేదు. బాధితురాలి తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నా వారికి న్యాయం జరగడం లేదు.
బాధితురాలి కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ కార్యకర్తలు కొన్ని నెలల పాటు గట్టిగానే పోరాడారు. గత ఏడాది కర్నూలులో పర్యటించి ఆ అమ్మాయికి కోసం ఆందోళనలోనూ పాల్గొన్నాడు పవన్. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు అప్పట్లో జగన్ సర్కారు ప్రకటన చేసింది. కానీ ఇప్పటిదాకా కేసును సీబీఐ టేకప్ చేయలేదు. కేసులో ఏ పురోగతీ లేదు. ఐతే తన కూతురికి న్యాయం జరగాలని అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రీతి తల్లి తన పోరాటాన్ని తాజాగా ఢిల్లీకి తీసుకెళ్లింది. అక్కడ జంతర్మంతర్లో ధర్నా కోసం వెళ్లిన ఆమె.. ప్రఖ్యాత న్యాయవాది సీమ కౌశ్యాను కలిశారు.
నిర్భయ కేసులో బాధితురాలి తరఫున ఏళ్ల తరబడి పోరాడి, ఫీజు కూడా తీసుకోకుండా కేసును వాదించి, గెలిచి.. చివరికి నిందితులకు ఉరి శిక్ష అమలయ్యేలా చేసిన ధీశాలి సీమా. ఆమెను ప్రీతి తల్లి కలిసి తన కూతురికి జరిగిన అన్యాయం గురించి గోడు వెల్లబోసుకుంది. దీంతో కలిదిలిపోయిన సీమా.. ప్రీతి రేప్, మర్డర్ కేసును టేకప్ చేసింది. ఈ కేసును సవాలుగా తీసుకుని నిందితులైన కట్టమంచి స్కూల్ యాజమానులైన జనార్దన్ రెడ్డి,హర్షవర్ధన్ రెడ్డి,దివాకర్ రెడ్డిలకు శిక్ష పడేలా చూస్తానని ఆమె హామీ ఇచ్చినట్లు బాధిత కుటుంబం వెల్లడించింది.
This post was last modified on October 17, 2020 6:28 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…