Trends

ఆంధ్రా అమ్మాయి కోసం నిర్భయ న్యాయవాది

ఇండియాలో ఎక్కడైనా అమ్మాయిపై అత్యాచారం జరిగి ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోతే జనాల్లో ఆగ్రహం పెల్లుబుకుతుంది. సోషల్ మీడియాలో కొన్ని రోజులు వీరావేశంతో స్పందిస్తారు అందరూ. కానీ ఆ తర్వాత అంతా మరిచిపోతారు. ప్రభుత్వాలు కూడా ఆ వేడి ఉన్నంత వరకు ఏదో చేసేస్తున్నట్లు కలరింగ్ ఇస్తాయి. ఆ తర్వాత కేసును నీరుగార్చేస్తుంటాయి.

నిర్భయ, దిశ లాంటి కొందరి విషయంలో మాత్రమే సత్వర చర్యలు చోటు చేసుకున్నాయి. చాలా కేసులు చరిత్రలో కలిసిపోయాయి. నిందితులు ఏ ఇబ్బందీ లేకుండా స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కర్నూలులో సుగాలి ప్రీతి అనే పేద అమ్మాయిని రేప్ చేసి ఆమె చావుకు కార‌ణ‌మైన వాళ్ల‌ను ఇప్ప‌టిదాకా శిక్షించ‌లేదు. ఈ దారుణం జరిగి మూడేళ్లు దాటిపోయింది. ఈ ఉదంతంపై అప్ప‌టి తెలుగుదేశం ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేదు. ఇప్ప‌టి జ‌గ‌న్ స‌ర్కారూ స్పందించ‌ట్లేదు. బాధితురాలి త‌ల్లిదండ్రులు అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నా వారికి న్యాయం జ‌ర‌గ‌డం లేదు.

బాధితురాలి కోసం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆ పార్టీ కార్యకర్తలు కొన్ని నెలల పాటు గట్టిగానే పోరాడారు. గత ఏడాది కర్నూలులో పర్యటించి ఆ అమ్మాయికి కోసం ఆందోళనలోనూ పాల్గొన్నాడు పవన్. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు అప్పట్లో జగన్ సర్కారు ప్రకటన చేసింది. కానీ ఇప్పటిదాకా కేసును సీబీఐ టేకప్ చేయలేదు. కేసులో ఏ పురోగతీ లేదు. ఐతే తన కూతురికి న్యాయం జరగాలని అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రీతి తల్లి తన పోరాటాన్ని తాజాగా ఢిల్లీకి తీసుకెళ్లింది. అక్కడ జంతర్‌మంతర్‌లో ధర్నా కోసం వెళ్లిన ఆమె.. ప్రఖ్యాత న్యాయవాది సీమ కౌశ్యాను కలిశారు.

నిర్భయ కేసులో బాధితురాలి తరఫున ఏళ్ల తరబడి పోరాడి, ఫీజు కూడా తీసుకోకుండా కేసును వాదించి, గెలిచి.. చివరికి నిందితులకు ఉరి శిక్ష అమలయ్యేలా చేసిన ధీశాలి సీమా. ఆమెను ప్రీతి తల్లి కలిసి తన కూతురికి జరిగిన అన్యాయం గురించి గోడు వెల్లబోసుకుంది. దీంతో కలిదిలిపోయిన సీమా.. ప్రీతి రేప్, మర్డర్ కేసును టేకప్ చేసింది. ఈ కేసును సవాలుగా తీసుకుని నిందితులైన కట్టమంచి స్కూల్ యాజమానులైన జనార్దన్ రెడ్డి,హర్షవర్ధన్ రెడ్డి,దివాకర్ రెడ్డిలకు శిక్ష పడేలా చూస్తానని ఆమె హామీ ఇచ్చినట్లు బాధిత కుటుంబం వెల్లడించింది.

This post was last modified on October 17, 2020 6:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

1 hour ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

2 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

3 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

4 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

5 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

6 hours ago