జమ్మూకశ్మీర్ లోని ఉత్తర ప్రాంతంలో సోమవారం జరిగిన ఉగ్రదాడి భారత్ ఆర్మీకి తీరని నష్టాన్ని కలిగించింది. భద్రతా బలగాలు ఉగ్రవాదుల కదలికలను గుర్తించి ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాను పంగల కార్తీక్ (29) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, మంగళవారం ఆయన చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలంలోని రాగి మానుపెంట గ్రామానికి చెందిన కార్తీక్ 2017లో ఆర్మీలో చేరి దేశ సేవలో భాగమయ్యారు. భద్రతా చర్యల్లో పాల్గొన్న కార్తీక్ తన ధైర్యంతో దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. కార్తీక్ మరణవార్త తెలియగానే రాగి మానుపెంట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామస్థులు అతనిని గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
ఇటీవల దీపావళి పండుగకు కార్తీక్ ఇంటికి వచ్చి తన కుటుంబంతో సరదాగా గడిపారు. తిరిగి మే నెలలో వస్తానని కుటుంబ సభ్యులకు మాటిచ్చి డ్యూటీకి వెళ్లిన కార్తీక్ వారి జీవితాల్లో తీరని శూన్యాన్ని మిగిల్చారు. గ్రామస్థులందరూ అతని వీరమరణానికి నివాళులర్పిస్తూ, దేశం కోసం చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ సేవలు భారతదేశానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని గ్రామస్థులు భావిస్తున్నారు. ఉగ్రదాడులు కొనసాగుతున్న నేపథ్యంలో సైనికుల త్యాగానికి సంబంధించిన ఆవేదన భారతీయులందరికీ కంటతడి పెట్టించే పరిస్థితి తీసుకొచ్చింది.
This post was last modified on January 21, 2025 12:48 pm
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…