జమ్మూకశ్మీర్ లోని ఉత్తర ప్రాంతంలో సోమవారం జరిగిన ఉగ్రదాడి భారత్ ఆర్మీకి తీరని నష్టాన్ని కలిగించింది. భద్రతా బలగాలు ఉగ్రవాదుల కదలికలను గుర్తించి ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాను పంగల కార్తీక్ (29) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, మంగళవారం ఆయన చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలంలోని రాగి మానుపెంట గ్రామానికి చెందిన కార్తీక్ 2017లో ఆర్మీలో చేరి దేశ సేవలో భాగమయ్యారు. భద్రతా చర్యల్లో పాల్గొన్న కార్తీక్ తన ధైర్యంతో దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. కార్తీక్ మరణవార్త తెలియగానే రాగి మానుపెంట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామస్థులు అతనిని గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
ఇటీవల దీపావళి పండుగకు కార్తీక్ ఇంటికి వచ్చి తన కుటుంబంతో సరదాగా గడిపారు. తిరిగి మే నెలలో వస్తానని కుటుంబ సభ్యులకు మాటిచ్చి డ్యూటీకి వెళ్లిన కార్తీక్ వారి జీవితాల్లో తీరని శూన్యాన్ని మిగిల్చారు. గ్రామస్థులందరూ అతని వీరమరణానికి నివాళులర్పిస్తూ, దేశం కోసం చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ సేవలు భారతదేశానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని గ్రామస్థులు భావిస్తున్నారు. ఉగ్రదాడులు కొనసాగుతున్న నేపథ్యంలో సైనికుల త్యాగానికి సంబంధించిన ఆవేదన భారతీయులందరికీ కంటతడి పెట్టించే పరిస్థితి తీసుకొచ్చింది.
This post was last modified on January 21, 2025 12:48 pm
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…