జమ్మూకశ్మీర్ లోని ఉత్తర ప్రాంతంలో సోమవారం జరిగిన ఉగ్రదాడి భారత్ ఆర్మీకి తీరని నష్టాన్ని కలిగించింది. భద్రతా బలగాలు ఉగ్రవాదుల కదలికలను గుర్తించి ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాను పంగల కార్తీక్ (29) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, మంగళవారం ఆయన చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలంలోని రాగి మానుపెంట గ్రామానికి చెందిన కార్తీక్ 2017లో ఆర్మీలో చేరి దేశ సేవలో భాగమయ్యారు. భద్రతా చర్యల్లో పాల్గొన్న కార్తీక్ తన ధైర్యంతో దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. కార్తీక్ మరణవార్త తెలియగానే రాగి మానుపెంట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామస్థులు అతనిని గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
ఇటీవల దీపావళి పండుగకు కార్తీక్ ఇంటికి వచ్చి తన కుటుంబంతో సరదాగా గడిపారు. తిరిగి మే నెలలో వస్తానని కుటుంబ సభ్యులకు మాటిచ్చి డ్యూటీకి వెళ్లిన కార్తీక్ వారి జీవితాల్లో తీరని శూన్యాన్ని మిగిల్చారు. గ్రామస్థులందరూ అతని వీరమరణానికి నివాళులర్పిస్తూ, దేశం కోసం చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ సేవలు భారతదేశానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని గ్రామస్థులు భావిస్తున్నారు. ఉగ్రదాడులు కొనసాగుతున్న నేపథ్యంలో సైనికుల త్యాగానికి సంబంధించిన ఆవేదన భారతీయులందరికీ కంటతడి పెట్టించే పరిస్థితి తీసుకొచ్చింది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…