జమ్మూకశ్మీర్ లోని ఉత్తర ప్రాంతంలో సోమవారం జరిగిన ఉగ్రదాడి భారత్ ఆర్మీకి తీరని నష్టాన్ని కలిగించింది. భద్రతా బలగాలు ఉగ్రవాదుల కదలికలను గుర్తించి ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాను పంగల కార్తీక్ (29) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, మంగళవారం ఆయన చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలంలోని రాగి మానుపెంట గ్రామానికి చెందిన కార్తీక్ 2017లో ఆర్మీలో చేరి దేశ సేవలో భాగమయ్యారు. భద్రతా చర్యల్లో పాల్గొన్న కార్తీక్ తన ధైర్యంతో దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. కార్తీక్ మరణవార్త తెలియగానే రాగి మానుపెంట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామస్థులు అతనిని గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
ఇటీవల దీపావళి పండుగకు కార్తీక్ ఇంటికి వచ్చి తన కుటుంబంతో సరదాగా గడిపారు. తిరిగి మే నెలలో వస్తానని కుటుంబ సభ్యులకు మాటిచ్చి డ్యూటీకి వెళ్లిన కార్తీక్ వారి జీవితాల్లో తీరని శూన్యాన్ని మిగిల్చారు. గ్రామస్థులందరూ అతని వీరమరణానికి నివాళులర్పిస్తూ, దేశం కోసం చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ సేవలు భారతదేశానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని గ్రామస్థులు భావిస్తున్నారు. ఉగ్రదాడులు కొనసాగుతున్న నేపథ్యంలో సైనికుల త్యాగానికి సంబంధించిన ఆవేదన భారతీయులందరికీ కంటతడి పెట్టించే పరిస్థితి తీసుకొచ్చింది.
This post was last modified on January 21, 2025 12:48 pm
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…