Trends

మృగాడికి జీవిత ఖైదు…హంతకురాలికి మరణ దండన

భారత న్యాయ వ్యవస్థలో సోమవారానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పాలి. సోమవారం ఒకే రోజు రెండు కీలక కేసుల్లో దేశ కోర్టుల నుంచి సంచలన తీర్పులు వెలువడ్డాయి. వీటిలో యావత్తు దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన కోల్ కతా ఆర్డీ ఖర్ ఆసుపత్రి వైద్యురాలిపై జరిగిన హత్యాచార కేసు కాగా… మరొకటి కేరళలో ప్రేమించిన యువకుడిని వంచించి అతడిపై విష ప్రయోగానికి పాల్పడి అతడిని దారుణంగా అంతమొందించిన ప్రియురాలి కేసు మరొకటి. ఈ రెండు కేసుల్లో కోల్ కతా మృగాడికి అక్కడి కోర్టు… జీవిత ఖైదు విధించగా… కేరళ హంతకురాలికి మరణ దండనను విధిస్తూ కేరళ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

కోల్ కతా ఆర్జీ ఖర్ ఆసుపత్రిలో హౌస్ సర్జన్ గా పనిచేస్తున్న బాధితురాలిపై కన్నేసిన సంజయ్ రాయ్ అనే నిందితుడు… ఒకానొక రోజు ఆమెపై ఆసుపత్రిలోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ మృగాడు ఆ తర్వాత ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన యావత్తు దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనకు నిరసనగా… కోల్ కతాతో పాటు దేశవ్యాప్తంగా వైద్యులు, ఆసుపత్రుల సిబ్బంది, సామాన్య జనం రోజుల తరబడి నిరసనలకు దిగారు. ఈ కేసులో ఆసుపత్రి యాజమాన్యం సహకరించని దారుణ విషయాలు వెలుగు చూశాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ పనితీరుపై భారీ విమర్శలు చెలరేగాయి. చివరకు రంగంలోకి దిగిన సీబీఐ కేసును ఓ కొలిక్కి తీసుకువచ్చింది. నిందితుడిని అరెస్ట్ చేసింది.

ఈ కేసు విచారణను చేపట్టిన స్థానిక కోర్టు… నిందితుడికి వ్యతిరేకంగా అన్ని ఆధారాలను పరిశీలించి.. అతడు నేరానికి పాల్పడినట్లుగా తేల్చింది. ఈ మేరకు శనివారం తీర్పుచెప్పిన కోర్టు.. సోమవారం శిక్షను ఖరారు చేయనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో తప్పు చేసిన తన కుమారుడికి ఉరి శిక్ష పడాలంటూ నిందితుడి తల్లిదండ్రులు కోర్టును కోరారు. నిందితుడికి ఉరే సరైనశిక్ష అంటూ కోల్ కతా యువతతో పాటు యావత్తు దేశ యువత నినదించింది. అయితే కోర్టు మాత్రం నిందితుడికి యావజ్జీవ ఖైదుతో సరిపెట్టింది. అంతేకాకుండా రూ.50 వేల జరిమానాను విధించింది. నిందితుడు చనిపోయేదాకా జైలు శిక్ష అనుభవించాల్సిందేనని కోర్టు తన తీర్పులో పేర్కొంది.

ఇక రెండో కేసు విషయానికి వస్తే… కేరళకు చెందిన గ్రీష్మ… కన్యాకుమారిలో విద్యనభ్యసిస్తున్న క్రమలంో శరణ్ రాజ్ అనే సహ విద్యార్థితో ప్రేమలో పడింది. ఇద్దరూ ఏడాదికి పైగా కలిసి మెలిసి తిరిగారు. అయితే ఆ తర్వాత తన కుటుంబం ఎంపిక చేసిన యువకుడిని వివాహం చేసుకునేందుకు సిద్ధపడిన గ్రీష్మ.. శరణ్ ను అంతమొందించేందుకు నిర్ణయించుకుంది. తల్లి, మరో దగ్గరి బంధువుతో కలిసి ఓ పథకం ప్రకారం.. శరణ్ ను తన ఇంటికి రప్పించి…విషం కలిపిన ద్రావణాన్ని (స్లో పాయిజన్)ను ఇచ్చింది. దానిని సేవించిన శరణ్…ఆ తర్వాత కొంత కాలానికి అనారోగ్యం బారిన పడి అతి తక్కువ సమయలోనే వరుసగా అవయవాలు విఫలమై చివరకు ప్రాణాలు విడిచాడు.

ఈ ఘటనపై బాధితుడి కుటుంబ న్యాయ పోరాటం చేయగా… సమగ్ర దర్యాప్తునకు కోర్టులు ఆదేశాలు జారీ చేశాయి. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. గ్రీష్మ పథకం ప్రకారమే శరణ్ ను మట్టుబెట్టిందని పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో గ్రీష్మను అరెస్ట్ చేయగా… చాలా కాలం పాటు జైలులో ఉన్న ఆమె ఆ తర్వాత హైకోర్టు నుంచి బెయిల్ తీసుకుని బయటకు వచ్చింది. ఈ కేసు విచారణలో గ్రీష్మకు వ్యతిరేకంగా పోలీసులు బలమైన సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచారు. ఈ ఆధారాలను పరిశీలించిన కోర్టు… గ్రీష్మను దోషిగా తేల్చింది. ప్రేమించిన యువకుడిని నమ్మించి ప్రాణాలు తీసిన ఆమెకు ఉరి శిక్షను విధించింది. అంతేకాకుండా 15 ఏళ్ల పాటు జైలు శిక్షను విధించింది. ఈ నేరంలో గ్రీష్మకు సహకరించిన ఆమె సమీప బంధువుకు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

This post was last modified on January 20, 2025 8:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

53 minutes ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

1 hour ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

2 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

2 hours ago

నో డౌట్‌: కేసీఆర్‌తోనే క‌విత ఢీ!

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న‌య క‌విత.. నిన్న…

3 hours ago

త‌మిళ‌నాట మైకులు బంద్‌… ఎవ‌రి సత్తా ఎంత‌?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌లకే అన్ని పార్టీలు..…

5 hours ago