Trends

8 మంది ప్రాణాలు తీసిన నూడుల్స్

ఇది మాటలకందని విషాదం. నూడుల్స్ తినడం వల్ల ఒకే కుటుంబంలోని ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక వ్యక్తి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. కాకపోతే ఈ విషాదం చోటు చేసుకుంది చైనాలో. ఆ దేశం నూడుల్స్‌కు ప్రసిద్ధి అన్న సంగతి తెలిసిందే. నూడుల్స్ వచ్చిందే అక్కడి నుంచి. నూడుల్స్ విషయంలో చైనీయులు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఈశాన్య చైనాలోని హీలాంగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లోని ఓ కుటుంబం సొంతంగా నూడుల్స్‌ తయారు చేసుకుని తినగా.. అది విషాహారంగా మారి ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి.

వాళ్లు తిన్న నూడుల్స్‌ను పరీక్షించగా.. అందులో బాంగ్‌క్రెకిక్ యాసిడ్ అనే విషతుల్యమైన రసాయనం ఉన్నట్లు తేలింది. ఈ రసాయనం ఎంత వేడిలో ఉడికించినా కూడా దాని ఉనికిని కోల్పోదు. ఇది ఎక్కువ మోతాదులో కడుపులోకి వెళ్తే ఏ మందుతోనూ రోగిని ట్రీట్ చేయలేమన్నది వైద్య నిపుణుల మాట. కార్న్ ఫ్లోర్ నుంచి తయారు చేసే సువాటంగ్‌జి అనే తరహా నూడుల్స్‌తో వాళ్లు ఈ వంటకం చేశారట. ఫ్లోర్ ప్రాడెక్ట్స్‌ ఎక్కువ కాలం నిల్వ ఉంచడం వల్ల ఫంగస్ ఏర్పడి అది విషంగా మారుతుందని వైద్యులంటున్నారు.

ఏడాది పాటు ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచిన నూడుల్స్ తీసి వండటం వల్ల అది విషాహారంగా మారి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. సదరు కుటుంబం విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చన్న కోణంలో విచారణ జరిపిన పోలీసులు అలాంటిదేమీ లేదని తేల్చారు. 12 మంది సభ్యులున్న ఈ కుటుంబం ఇటీవల ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం నూడుల్స్ తయారు చేసుకుంది. తొమ్మిది మంది నూడుల్స్ తినగా.. ముగ్గురికి టేస్ట్ నచ్చక తినకుండా పక్కన పెట్టేయడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు.

This post was last modified on October 15, 2020 6:33 pm

Share
Show comments
Published by
satya
Tags: ChinaNoodels

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

4 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

5 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

8 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

8 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

9 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

9 hours ago