Trends

8 మంది ప్రాణాలు తీసిన నూడుల్స్

ఇది మాటలకందని విషాదం. నూడుల్స్ తినడం వల్ల ఒకే కుటుంబంలోని ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక వ్యక్తి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. కాకపోతే ఈ విషాదం చోటు చేసుకుంది చైనాలో. ఆ దేశం నూడుల్స్‌కు ప్రసిద్ధి అన్న సంగతి తెలిసిందే. నూడుల్స్ వచ్చిందే అక్కడి నుంచి. నూడుల్స్ విషయంలో చైనీయులు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఈశాన్య చైనాలోని హీలాంగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లోని ఓ కుటుంబం సొంతంగా నూడుల్స్‌ తయారు చేసుకుని తినగా.. అది విషాహారంగా మారి ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి.

వాళ్లు తిన్న నూడుల్స్‌ను పరీక్షించగా.. అందులో బాంగ్‌క్రెకిక్ యాసిడ్ అనే విషతుల్యమైన రసాయనం ఉన్నట్లు తేలింది. ఈ రసాయనం ఎంత వేడిలో ఉడికించినా కూడా దాని ఉనికిని కోల్పోదు. ఇది ఎక్కువ మోతాదులో కడుపులోకి వెళ్తే ఏ మందుతోనూ రోగిని ట్రీట్ చేయలేమన్నది వైద్య నిపుణుల మాట. కార్న్ ఫ్లోర్ నుంచి తయారు చేసే సువాటంగ్‌జి అనే తరహా నూడుల్స్‌తో వాళ్లు ఈ వంటకం చేశారట. ఫ్లోర్ ప్రాడెక్ట్స్‌ ఎక్కువ కాలం నిల్వ ఉంచడం వల్ల ఫంగస్ ఏర్పడి అది విషంగా మారుతుందని వైద్యులంటున్నారు.

ఏడాది పాటు ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచిన నూడుల్స్ తీసి వండటం వల్ల అది విషాహారంగా మారి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. సదరు కుటుంబం విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చన్న కోణంలో విచారణ జరిపిన పోలీసులు అలాంటిదేమీ లేదని తేల్చారు. 12 మంది సభ్యులున్న ఈ కుటుంబం ఇటీవల ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం నూడుల్స్ తయారు చేసుకుంది. తొమ్మిది మంది నూడుల్స్ తినగా.. ముగ్గురికి టేస్ట్ నచ్చక తినకుండా పక్కన పెట్టేయడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు.

Satya

Recent Posts

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

25 minutes ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

45 minutes ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

2 hours ago

చిరు లీక్ చేశాడు… నందిని కన్ఫమ్ చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను అనుకోకుండా రివీల్…

3 hours ago

జగన్.. బాలయ్య సాయం కోరిన వేళ..!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…

3 hours ago

డీఎస్సీపై గగ్గోలు… నీట్‌పై మౌనం..?

"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…

4 hours ago