తెలుగు నేలకు గర్వకారణంగా నిలిచిన టీం ఇండియా యంగ్ అండ్ డైనమిక్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సంక్రాంతి వేళ కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడు తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్ళాడు. ఇక మెట్ల మార్గంలోని మోకాళ్ళ పర్వతం వద్ద అతడు తన మోకాళ్లపై మెట్లు ఎక్కాడు.
ఈ వీడియోను అతడు తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసాడు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వైకుంఠ ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకుని అతడు తిరుమల వచ్చినట్టు సమాచారం. ఇటీవలి కాలంలో సత్తా చాటుతున్న నితీష్ అటు బ్యాటింగ్ తో పటు ఇటు బౌలింగ్ లోను రాణిస్తున్నాడు ఫలితంగా జట్టు విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్నాడు.
తెలుగు నేల నుంచి అజారుద్దీన్, అంబటి రాయుడు, తిలక్ వర్మ వెళ్ళందరితో పాటు టీమిండియా జట్టులో చోటు దక్కించుకున్న నితీష్ వారి కంటే కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. భవిష్యత్తులో భారత జట్టుకు అతడు ఓ ఆశా కిరణం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అల్ రౌండర్ గా నితీష్ జట్టులో తన స్థానాన్ని దాదాపుగా సుస్థిరం చేసుకున్నట్టేనని చెప్పాలి.
This post was last modified on January 14, 2025 9:24 am
ఒక కథ ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం.. ఎవరికో అనుకున్న కథ ఇంకెవరికో సెట్ కావడం…
బీజేపీ సీనియర్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే, వివాదాలకు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.…
కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని…
భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో…
‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి…