తెలుగు నేలకు గర్వకారణంగా నిలిచిన టీం ఇండియా యంగ్ అండ్ డైనమిక్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సంక్రాంతి వేళ కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడు తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్ళాడు. ఇక మెట్ల మార్గంలోని మోకాళ్ళ పర్వతం వద్ద అతడు తన మోకాళ్లపై మెట్లు ఎక్కాడు.
ఈ వీడియోను అతడు తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసాడు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వైకుంఠ ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకుని అతడు తిరుమల వచ్చినట్టు సమాచారం. ఇటీవలి కాలంలో సత్తా చాటుతున్న నితీష్ అటు బ్యాటింగ్ తో పటు ఇటు బౌలింగ్ లోను రాణిస్తున్నాడు ఫలితంగా జట్టు విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్నాడు.
తెలుగు నేల నుంచి అజారుద్దీన్, అంబటి రాయుడు, తిలక్ వర్మ వెళ్ళందరితో పాటు టీమిండియా జట్టులో చోటు దక్కించుకున్న నితీష్ వారి కంటే కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. భవిష్యత్తులో భారత జట్టుకు అతడు ఓ ఆశా కిరణం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అల్ రౌండర్ గా నితీష్ జట్టులో తన స్థానాన్ని దాదాపుగా సుస్థిరం చేసుకున్నట్టేనని చెప్పాలి.
This post was last modified on January 14, 2025 9:24 am
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…