తెలుగు నేలకు గర్వకారణంగా నిలిచిన టీం ఇండియా యంగ్ అండ్ డైనమిక్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సంక్రాంతి వేళ కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడు తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్ళాడు. ఇక మెట్ల మార్గంలోని మోకాళ్ళ పర్వతం వద్ద అతడు తన మోకాళ్లపై మెట్లు ఎక్కాడు.
ఈ వీడియోను అతడు తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసాడు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వైకుంఠ ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకుని అతడు తిరుమల వచ్చినట్టు సమాచారం. ఇటీవలి కాలంలో సత్తా చాటుతున్న నితీష్ అటు బ్యాటింగ్ తో పటు ఇటు బౌలింగ్ లోను రాణిస్తున్నాడు ఫలితంగా జట్టు విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్నాడు.
తెలుగు నేల నుంచి అజారుద్దీన్, అంబటి రాయుడు, తిలక్ వర్మ వెళ్ళందరితో పాటు టీమిండియా జట్టులో చోటు దక్కించుకున్న నితీష్ వారి కంటే కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. భవిష్యత్తులో భారత జట్టుకు అతడు ఓ ఆశా కిరణం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అల్ రౌండర్ గా నితీష్ జట్టులో తన స్థానాన్ని దాదాపుగా సుస్థిరం చేసుకున్నట్టేనని చెప్పాలి.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…