+ “పండక్కి సెలవులు పెట్టారు. ఇప్పుడు ఎక్కడున్నారు. సరే.. ఎక్కడున్నా తక్షణమే వచ్చేయండి!“
+ “మీ సెలవులు రద్దు చేస్తున్నాం. వెంటనే పెట్టేబేడా సర్దుకుని ప్లేనెక్యేయండి!“
+ “మీ దేశంలో గడిపించి ఇక, చాలు వెంటనే బయలుదేరి రండి“
+ “ఈ నెల 20లోగా మీరిక్కడుండాలి. అంతే! మరో మాటే వద్దు! గెట్ స్టార్ట్“
— ఇవీ ఇప్పుడు అమెరికాలో పనిచేస్తున్న విదేశీయులను ఉద్దేశించి వారి వారి కంపెనీల యాజమాన్యలు పెడుతున్న ఈమెయిళ్లు. సందేశాలు. వెంటనే తిరిగి వచ్చేయాలని ఆయా యాజమాన్యాలు కోరుతున్నాయి.
దీంతో భారత్ సహా ఇతర దేశాలకు వచ్చిన వారు వెంటనే ఫ్లైట్ బాట పట్టుకుని పరుగులు పెడుతున్నారు. ఎప్పుడెప్పుడు అగ్రరాజ్యంలో అడుగు పెడతామా? అని ఎదురుచూస్తున్నారు.
ఏంటి కారణం?
ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టనున్నారు. ఆయన పగ్గాలు చేపట్టిన వెంటనే తీసుకునే తొలి నిర్ణయం విదేశీ ఉద్యోగులు, వీసాలపైనే ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎన్నికల సమయంలోనూ స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు లభించేలా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ హామీ నెరవేరాలంటే.. ఆయన వీసాలను పరిమితం చేయాల్సి ఉంటుందని ట్రంప్ మద్దతు దారులు చెబుతున్నారు. డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం హెచ్-1బీ వీసాలపై విదేశాల నుంచి అగ్రరాజ్యానికి వచ్చి ఉద్యోగాలు చేసుకునే వారిపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉంది. లేదా అసలు వీసాలను కూడా రద్దు చేసే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివిధ కారణాలతో తమ తమ దేశాలకు వెళ్లిపోయిన హెచ్-1బీ వీసాదారులు ఈ నెల 20 తర్వాత.. ఇబ్బందులు పడే అవకాశంఉందని కంపెనీలు భావిస్తున్నారు. ఈ క్రమంలో తమ వారిని తిరిగి వెంటనే అమెరికాకు వచ్చే యాలని ఆదేశాలు, సూచనలు చేస్తున్నాయి.
ఈ నెల 20 నాటికి అమెరికాలో ఉంటే.. ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పోరాడేందుకు అవకాశం ఉంటుందని.. లేదా 20 తర్వాత.. ఇప్పుడున్న వీసాతోనే అమెరికాలోకి అడుగు పెడతామంటే కుదరకపోవచ్చని కంపెనీలు చెబుతున్నాయి.
అందుకే రారండో రండో రండని.. తమ వారికి ఈమెయిళ్లు, సందేశాలు పంపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యవహారం కలకలం రేపుతుండడం గమనార్హం.
This post was last modified on January 13, 2025 9:21 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…