ఆస్తులు మాత్రమే కావాలి. వాటిని సంపాదించి పెట్టిన తల్లిదండ్రుల్ని మాత్రం లైట్ తీసుకునే బిడ్డల సంఖ్య తక్కువేం కాదు. అలాంటి వారికి దిమ్మ తిరిగిపోయే షాకిచ్చింది దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు. గిప్ట్ డీడ్ కింద ఆస్తులు రాసి ఇచ్చిన తర్వాత తల్లిదండ్రుల సంరక్షణను విస్మరించి.. వారి బాగోగులు చూడని బిడ్డల నుంచి ఆ ఆస్తుల్నితిరిగి పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
తల్లిదండ్రులు, వృద్ధుల నిర్వహణ(పోషణ), సంక్షేమ చట్టానికి ఆ పవర్ ఉంటుందని స్పష్టం చేశారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీటీ రవికుమార్.. జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం. మధ్యప్రదేశ్ లోని చిత్తార్ పూర్ కు చెందిన పెద్ద వయస్కులైన తల్లిదండ్రులు తమ కొడుక్కి ఆస్తిలో కొంత భాగాన్ని గిఫ్టు డీడ్ రూపంలో బదిలీ చేశారు. ఆస్తి తీసుకున్న కొడుకు వారి బాగోగులు చూసుకోడు కానీ.. మిగిలిన ఆస్తిని తనకు ఇవ్వాలంటూ దాడులకు దిగాడు.
దీంతో అతడి తల్లి మొదట సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ను ఆశ్రయించారు. న్యాయం పొందారు. కొడుక్కి రాసిచ్చిన గిఫ్టు డీడ్ ను రద్దు చేసి ఆస్తిపై వృద్ధ దంపతుల హక్కులను పునరుద్దరించారు. దీనిపై కొడుకు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సింగిల్ బెంచ్ వృధ్య దంపతులకు న్యాయం చేసినా.. డివిజన్ బెంచ్ మాత్రం గిఫ్టు డీడ్ రద్దు సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వృద్ధ దంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం.. చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం పెద్ద వయస్కుల బాగోగుల్ని పట్టించుకోని పిల్లలకు ఇచ్చిన గిఫ్టు డీడ్ దానంతట అదే రద్దు అవుతుందని స్పష్టం చేసింది. అంతేకాదు.. కొడుక్కి ఇచచిన ఆస్తిని వారి పేరుతో పునరుద్దరించటమే కాదు.. వచ్చే నెలాఖరు నాటికి ఆస్తి బదలాయింపు జరగాలని ఆదేశించింది. తల్లిదండ్రుల ఆస్తి మాత్రమే కావాలి.. వారి బాగోగులు చూసుకోలేమన్న వారికి తన తీర్పుతో సరైన రీతిలో బుద్ధి చెప్పిందన్న అభిప్రాయం వ్యక్తవుతోంది.
This post was last modified on January 5, 2025 10:42 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…