Trends

భారీ కుంభకోణంలో చిక్కుకున్న భారత యువ క్రికెటర్లు!

టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలు ఓ భారీ కుంభకోణంలో ఇరుక్కుపోయినట్టు గుజరాత్ సీఐడీ నిర్ధారించింది. గుజరాత్‌లో సంచలనం రేపిన రూ. 450 కోట్ల పోంజీ స్కాంలో ఈ నలుగురు క్రికెటర్లు పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడైంది. బీజెడ్ ఫైనాన్షియల్ సర్వీస్ అనే సంస్థ ప్రజలను అధిక వడ్డీ ఆశ చూపి మోసం చేసింది.

ఈ కేసులో బీజెడ్ గ్రూప్ సీఈవో భూపేంద్ర సింగ్ ఝులాను సీఐడీ అరెస్ట్ చేయగా, ఈ స్కామ్‌లో క్రికెటర్ల పాత్రపై విచారణ జరుగుతోంది. గిల్, సుదర్శన్, తెవాటియా, మోహిత్‌లు ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ జట్టుకు చెందిన ప్లేయర్లపై స్కాంలో పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణలు రావడం అభిమానులకు షాక్ ఇచ్చింది.

అహ్మదాబాద్ మిర్రర్ కథనం ప్రకారం, గిల్ బీజెడ్ ఫైనాన్షియల్ సర్వీస్‌లో రూ. 1.95 కోట్లు పెట్టుబడి పెట్టగా, మిగతా ప్లేయర్లు రూ. 10 లక్షల నుంచి రూ. కోటి వరకు ఇన్వెస్ట్ చేసినట్టు సమాచారం. సీఐడీ వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు సిద్ధమవుతోంది. గిల్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడుతున్నాడు. సిరీస్ ముగిసిన తర్వాత భారత్‌కు రానున్న గిల్‌పై విచారణ జరగనుంది. మిగతా ప్లేయర్లను కూడా సీఐడీ త్వరలో విచారణకు పిలవనుంది.

ఈ వ్యవహారం సామాన్య ప్రజలను మాత్రమే కాదు, క్రికెట్ అభిమానులను కూడా కలచివేసింది. ప్రముఖ క్రికెటర్లు ఇలాంటి స్కాంలో ఇరుక్కుపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసు విచారణ పూర్తి అయ్యేవరకు సీఐడీ ఇంకా పలు విషయాలను బయటపెట్టనుందని తెలుస్తోంది.

This post was last modified on January 2, 2025 4:18 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చాట్ జీపీటీ-డీప్ సీక్‌ల‌కు దూరం: కేంద్రం ఆదేశాలు!

ప్ర‌స్తుతం ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ప్ర‌పంచం పుంజుకుంటోంది. ప్ర‌ధానంగా ఐటీ సంస్థ‌ల నుంచి ప్ర‌భుత్వ కార్యాల‌యాల వ‌ర‌కు కూడా ఏఐ ఆధారిత…

9 minutes ago

వద్దనుకున్న దర్శకుడితో నాని సినిమా ?

ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…

28 minutes ago

వివేకా మ‌ర్ద‌ర్: డీఎస్పీ స‌హా అధికారుల‌పై కేసులు!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసు లో తాజాగా…

1 hour ago

జాంబిరెడ్డి – 2 : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాదా?

గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…

1 hour ago

ఏందిది మ‌ల్లన్నా.. స్వ‌ప‌క్షంలో విప‌క్షమా?

మాట‌ల మాంత్రికుడు.. సోష‌ల్ మీడియాలో దుమ్మురేపి.. ప్ర‌స్తుతం ప్ర‌జాప్ర‌తినిధిగా శాస‌న‌ మండ‌లిలో ఉన్న తీన్మార్ మ‌ల్ల‌న్న త‌న వాయిస్ ద్వారా…

1 hour ago

ఆమె లేకుండా మంగళవారం – 2?

‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…

2 hours ago