Trends

భారీ కుంభకోణంలో చిక్కుకున్న భారత యువ క్రికెటర్లు!

టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలు ఓ భారీ కుంభకోణంలో ఇరుక్కుపోయినట్టు గుజరాత్ సీఐడీ నిర్ధారించింది. గుజరాత్‌లో సంచలనం రేపిన రూ. 450 కోట్ల పోంజీ స్కాంలో ఈ నలుగురు క్రికెటర్లు పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడైంది. బీజెడ్ ఫైనాన్షియల్ సర్వీస్ అనే సంస్థ ప్రజలను అధిక వడ్డీ ఆశ చూపి మోసం చేసింది.

ఈ కేసులో బీజెడ్ గ్రూప్ సీఈవో భూపేంద్ర సింగ్ ఝులాను సీఐడీ అరెస్ట్ చేయగా, ఈ స్కామ్‌లో క్రికెటర్ల పాత్రపై విచారణ జరుగుతోంది. గిల్, సుదర్శన్, తెవాటియా, మోహిత్‌లు ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ జట్టుకు చెందిన ప్లేయర్లపై స్కాంలో పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణలు రావడం అభిమానులకు షాక్ ఇచ్చింది.

అహ్మదాబాద్ మిర్రర్ కథనం ప్రకారం, గిల్ బీజెడ్ ఫైనాన్షియల్ సర్వీస్‌లో రూ. 1.95 కోట్లు పెట్టుబడి పెట్టగా, మిగతా ప్లేయర్లు రూ. 10 లక్షల నుంచి రూ. కోటి వరకు ఇన్వెస్ట్ చేసినట్టు సమాచారం. సీఐడీ వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు సిద్ధమవుతోంది. గిల్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడుతున్నాడు. సిరీస్ ముగిసిన తర్వాత భారత్‌కు రానున్న గిల్‌పై విచారణ జరగనుంది. మిగతా ప్లేయర్లను కూడా సీఐడీ త్వరలో విచారణకు పిలవనుంది.

ఈ వ్యవహారం సామాన్య ప్రజలను మాత్రమే కాదు, క్రికెట్ అభిమానులను కూడా కలచివేసింది. ప్రముఖ క్రికెటర్లు ఇలాంటి స్కాంలో ఇరుక్కుపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసు విచారణ పూర్తి అయ్యేవరకు సీఐడీ ఇంకా పలు విషయాలను బయటపెట్టనుందని తెలుస్తోంది.

This post was last modified on January 2, 2025 4:18 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

8 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

10 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

11 hours ago