Trends

భారీ కుంభకోణంలో చిక్కుకున్న భారత యువ క్రికెటర్లు!

టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలు ఓ భారీ కుంభకోణంలో ఇరుక్కుపోయినట్టు గుజరాత్ సీఐడీ నిర్ధారించింది. గుజరాత్‌లో సంచలనం రేపిన రూ. 450 కోట్ల పోంజీ స్కాంలో ఈ నలుగురు క్రికెటర్లు పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడైంది. బీజెడ్ ఫైనాన్షియల్ సర్వీస్ అనే సంస్థ ప్రజలను అధిక వడ్డీ ఆశ చూపి మోసం చేసింది.

ఈ కేసులో బీజెడ్ గ్రూప్ సీఈవో భూపేంద్ర సింగ్ ఝులాను సీఐడీ అరెస్ట్ చేయగా, ఈ స్కామ్‌లో క్రికెటర్ల పాత్రపై విచారణ జరుగుతోంది. గిల్, సుదర్శన్, తెవాటియా, మోహిత్‌లు ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ జట్టుకు చెందిన ప్లేయర్లపై స్కాంలో పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణలు రావడం అభిమానులకు షాక్ ఇచ్చింది.

అహ్మదాబాద్ మిర్రర్ కథనం ప్రకారం, గిల్ బీజెడ్ ఫైనాన్షియల్ సర్వీస్‌లో రూ. 1.95 కోట్లు పెట్టుబడి పెట్టగా, మిగతా ప్లేయర్లు రూ. 10 లక్షల నుంచి రూ. కోటి వరకు ఇన్వెస్ట్ చేసినట్టు సమాచారం. సీఐడీ వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు సిద్ధమవుతోంది. గిల్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడుతున్నాడు. సిరీస్ ముగిసిన తర్వాత భారత్‌కు రానున్న గిల్‌పై విచారణ జరగనుంది. మిగతా ప్లేయర్లను కూడా సీఐడీ త్వరలో విచారణకు పిలవనుంది.

ఈ వ్యవహారం సామాన్య ప్రజలను మాత్రమే కాదు, క్రికెట్ అభిమానులను కూడా కలచివేసింది. ప్రముఖ క్రికెటర్లు ఇలాంటి స్కాంలో ఇరుక్కుపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసు విచారణ పూర్తి అయ్యేవరకు సీఐడీ ఇంకా పలు విషయాలను బయటపెట్టనుందని తెలుస్తోంది.

This post was last modified on January 2, 2025 4:18 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రెండు షాట్ల కోసం మహేష్ ఆరు నెలల కష్టం

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…

3 minutes ago

ఫ్యామిలీ మ్యాన్ హీరో చుట్టూ టైటిల్ వివాదం

రామ్ గోపాల్ వర్మ సత్యతో స్టార్ ఆర్టిస్టుగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ తెలుగులోనూ హ్యాపీ, ప్రేమకథ, కొమరం పులి…

26 minutes ago

చిరు సినిమాలో దురంధర్ పాప?

సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో భారీ విజయాన్నందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. దీని కంటే ముందు ఆయన మొదలుపెట్టిన…

49 minutes ago

లడ్డూ విషయం పక్క దారి పట్టేసిందా

తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరింత కాక రేపుతోంది. గత 2024 సెప్టెంబరు నుంచి ఇప్పటి…

1 hour ago

వారణాసి విశేషాలతో అభిమానుల్లో హుషారు

గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు దర్శనం లేక డీలాపడిన అభిమానులకు ఊరట కలిగించేలా వారణాసి ఇంటర్వ్యూలు విడుదలయ్యాయి. మహేష్…

2 hours ago

ఐమాక్స్ కోసం రాజమౌళి ధర్నా

ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఐతే భారీ చిత్రాల వీక్షణలో అద్భుతమైన అనుభూతిని…

2 hours ago