విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. విమాన ప్రయాణంలో విరామం లేకుండా ఇంటర్నెట్ సేవలను అందించే సౌకర్యం ప్రవేశపెట్టనుంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల్లో ఎయిర్ ఇండియా వైఫై సేవలను ప్రారంభించబోతుండగా, ఈ సేవలు అందిస్తున్న భారతీయ విమానయాన సంస్థగా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. ఈ సేవలతో ప్రయాణికులు గగనతలంలో కూడా తమ డిజిటల్ అవసరాలను తీర్చుకోవడానికి వీలుంటుంది.
వైఫై సేవల వల్ల ప్రయాణికులు విమానంలోనే వర్క్ ఫ్రం ఎయిర్ ట్రెండ్ ను కొనసాగించవచ్చు. 10 వేల అడుగుల ఎత్తులో కూడా ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వడం ఈ సదుపాయం ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ సేవలు శాటిలైట్ కనెక్టివిటీ ఆధారంగా పనిచేస్తుండగా, విమానం ప్రయాణించే మార్గం, ప్రభుత్వ ఆమోదం వంటి అంశాలు సేవల అందుబాటుకు ప్రభావం చూపుతాయి. మొదటగా ఈ సేవలను న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వంటి గమ్యస్థానాలకు వెళ్ళే ఎయిర్బస్ ఏ350, ఏ321 నియో, బోయింగ్ 787-9 విమానాల్లో ప్రవేశపెడతారు.
విదేశీ ప్రయాణాల అనంతరం దేశీయ రూట్లలో కూడా ఈ సేవలు దశలవారీగా అందుబాటులోకి తీసుకురావాలని ఎయిర్ ఇండియా యోచిస్తోంది. ఈ ఆవిష్కరణతో ప్రయాణికులకు తక్కువ సమయంలో ఎక్కువ పనులు పూర్తి చేసుకునే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా, బిజినెస్ ట్రిప్లలో ఉన్నవారు, కుటుంబంతో సంబంధాలు కొనసాగించేవారు, లేదా సోషల్ మీడియాలో ఆక్టివ్గా ఉండే వాళ్లకు ఈ సదుపాయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
వైఫై సేవలు ప్రవేశపెట్టడం ఎయిర్ ఇండియా విస్తరణలో ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. ఈ చర్య విమానయాన రంగంలో పోటీని పెంచడమే కాకుండా, ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. త్వరలోనే ఈ సేవలు మరింత విస్తృతంగా అందుబాటులోకి రావడం ద్వారా భారతీయ విమానయాన రంగం సాంకేతికంగా మరో మెట్టు ఎక్కనుంది.
This post was last modified on January 2, 2025 11:11 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…