విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. విమాన ప్రయాణంలో విరామం లేకుండా ఇంటర్నెట్ సేవలను అందించే సౌకర్యం ప్రవేశపెట్టనుంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల్లో ఎయిర్ ఇండియా వైఫై సేవలను ప్రారంభించబోతుండగా, ఈ సేవలు అందిస్తున్న భారతీయ విమానయాన సంస్థగా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. ఈ సేవలతో ప్రయాణికులు గగనతలంలో కూడా తమ డిజిటల్ అవసరాలను తీర్చుకోవడానికి వీలుంటుంది.
వైఫై సేవల వల్ల ప్రయాణికులు విమానంలోనే వర్క్ ఫ్రం ఎయిర్ ట్రెండ్ ను కొనసాగించవచ్చు. 10 వేల అడుగుల ఎత్తులో కూడా ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వడం ఈ సదుపాయం ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ సేవలు శాటిలైట్ కనెక్టివిటీ ఆధారంగా పనిచేస్తుండగా, విమానం ప్రయాణించే మార్గం, ప్రభుత్వ ఆమోదం వంటి అంశాలు సేవల అందుబాటుకు ప్రభావం చూపుతాయి. మొదటగా ఈ సేవలను న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వంటి గమ్యస్థానాలకు వెళ్ళే ఎయిర్బస్ ఏ350, ఏ321 నియో, బోయింగ్ 787-9 విమానాల్లో ప్రవేశపెడతారు.
విదేశీ ప్రయాణాల అనంతరం దేశీయ రూట్లలో కూడా ఈ సేవలు దశలవారీగా అందుబాటులోకి తీసుకురావాలని ఎయిర్ ఇండియా యోచిస్తోంది. ఈ ఆవిష్కరణతో ప్రయాణికులకు తక్కువ సమయంలో ఎక్కువ పనులు పూర్తి చేసుకునే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా, బిజినెస్ ట్రిప్లలో ఉన్నవారు, కుటుంబంతో సంబంధాలు కొనసాగించేవారు, లేదా సోషల్ మీడియాలో ఆక్టివ్గా ఉండే వాళ్లకు ఈ సదుపాయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
వైఫై సేవలు ప్రవేశపెట్టడం ఎయిర్ ఇండియా విస్తరణలో ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. ఈ చర్య విమానయాన రంగంలో పోటీని పెంచడమే కాకుండా, ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. త్వరలోనే ఈ సేవలు మరింత విస్తృతంగా అందుబాటులోకి రావడం ద్వారా భారతీయ విమానయాన రంగం సాంకేతికంగా మరో మెట్టు ఎక్కనుంది.
This post was last modified on January 2, 2025 11:11 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…