Trends

విమానంలోనే వర్క్ ఫ్రం ఎయిర్

విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. విమాన ప్రయాణంలో విరామం లేకుండా ఇంటర్నెట్ సేవలను అందించే సౌకర్యం ప్రవేశపెట్టనుంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల్లో ఎయిర్ ఇండియా వైఫై సేవలను ప్రారంభించబోతుండగా, ఈ సేవలు అందిస్తున్న భారతీయ విమానయాన సంస్థగా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. ఈ సేవలతో ప్రయాణికులు గగనతలంలో కూడా తమ డిజిటల్ అవసరాలను తీర్చుకోవడానికి వీలుంటుంది.

వైఫై సేవల వల్ల ప్రయాణికులు విమానంలోనే వర్క్ ఫ్రం ఎయిర్ ట్రెండ్ ను కొనసాగించవచ్చు. 10 వేల అడుగుల ఎత్తులో కూడా ఇంటర్నెట్‌తో కనెక్ట్‌ అవ్వడం ఈ సదుపాయం ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ సేవలు శాటిలైట్ కనెక్టివిటీ ఆధారంగా పనిచేస్తుండగా, విమానం ప్రయాణించే మార్గం, ప్రభుత్వ ఆమోదం వంటి అంశాలు సేవల అందుబాటుకు ప్రభావం చూపుతాయి. మొదటగా ఈ సేవలను న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వంటి గమ్యస్థానాలకు వెళ్ళే ఎయిర్‌బస్ ఏ350, ఏ321 నియో, బోయింగ్ 787-9 విమానాల్లో ప్రవేశపెడతారు.

విదేశీ ప్రయాణాల అనంతరం దేశీయ రూట్లలో కూడా ఈ సేవలు దశలవారీగా అందుబాటులోకి తీసుకురావాలని ఎయిర్ ఇండియా యోచిస్తోంది. ఈ ఆవిష్కరణతో ప్రయాణికులకు తక్కువ సమయంలో ఎక్కువ పనులు పూర్తి చేసుకునే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా, బిజినెస్ ట్రిప్‌లలో ఉన్నవారు, కుటుంబంతో సంబంధాలు కొనసాగించేవారు, లేదా సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉండే వాళ్లకు ఈ సదుపాయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

వైఫై సేవలు ప్రవేశపెట్టడం ఎయిర్ ఇండియా విస్తరణలో ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. ఈ చర్య విమానయాన రంగంలో పోటీని పెంచడమే కాకుండా, ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. త్వరలోనే ఈ సేవలు మరింత విస్తృతంగా అందుబాటులోకి రావడం ద్వారా భారతీయ విమానయాన రంగం సాంకేతికంగా మరో మెట్టు ఎక్కనుంది.

This post was last modified on January 2, 2025 11:11 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

4 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

8 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

8 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

10 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

10 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

11 hours ago