Trends

విమానంలోనే వర్క్ ఫ్రం ఎయిర్

విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. విమాన ప్రయాణంలో విరామం లేకుండా ఇంటర్నెట్ సేవలను అందించే సౌకర్యం ప్రవేశపెట్టనుంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల్లో ఎయిర్ ఇండియా వైఫై సేవలను ప్రారంభించబోతుండగా, ఈ సేవలు అందిస్తున్న భారతీయ విమానయాన సంస్థగా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. ఈ సేవలతో ప్రయాణికులు గగనతలంలో కూడా తమ డిజిటల్ అవసరాలను తీర్చుకోవడానికి వీలుంటుంది.

వైఫై సేవల వల్ల ప్రయాణికులు విమానంలోనే వర్క్ ఫ్రం ఎయిర్ ట్రెండ్ ను కొనసాగించవచ్చు. 10 వేల అడుగుల ఎత్తులో కూడా ఇంటర్నెట్‌తో కనెక్ట్‌ అవ్వడం ఈ సదుపాయం ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ సేవలు శాటిలైట్ కనెక్టివిటీ ఆధారంగా పనిచేస్తుండగా, విమానం ప్రయాణించే మార్గం, ప్రభుత్వ ఆమోదం వంటి అంశాలు సేవల అందుబాటుకు ప్రభావం చూపుతాయి. మొదటగా ఈ సేవలను న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వంటి గమ్యస్థానాలకు వెళ్ళే ఎయిర్‌బస్ ఏ350, ఏ321 నియో, బోయింగ్ 787-9 విమానాల్లో ప్రవేశపెడతారు.

విదేశీ ప్రయాణాల అనంతరం దేశీయ రూట్లలో కూడా ఈ సేవలు దశలవారీగా అందుబాటులోకి తీసుకురావాలని ఎయిర్ ఇండియా యోచిస్తోంది. ఈ ఆవిష్కరణతో ప్రయాణికులకు తక్కువ సమయంలో ఎక్కువ పనులు పూర్తి చేసుకునే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా, బిజినెస్ ట్రిప్‌లలో ఉన్నవారు, కుటుంబంతో సంబంధాలు కొనసాగించేవారు, లేదా సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉండే వాళ్లకు ఈ సదుపాయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

వైఫై సేవలు ప్రవేశపెట్టడం ఎయిర్ ఇండియా విస్తరణలో ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. ఈ చర్య విమానయాన రంగంలో పోటీని పెంచడమే కాకుండా, ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. త్వరలోనే ఈ సేవలు మరింత విస్తృతంగా అందుబాటులోకి రావడం ద్వారా భారతీయ విమానయాన రంగం సాంకేతికంగా మరో మెట్టు ఎక్కనుంది.

This post was last modified on January 2, 2025 11:11 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

7 minutes ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

9 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago