ఉపేంద్ర యుఐ కోసం అయిదు రోజులు ఆగి విడుదలవుతున్న సినిమా మ్యాక్స్. ఈగతో మనకు విలన్ గా పరిచయమై బాహుబలి, సైరా నరసింహారెడ్డి లాంటి టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ చేసిన కిచ్చ సుదీప్ ఇందులో హీరోగా నటించాడు. కన్నడ, తమిళ వెర్షన్లు ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చినప్పటికే తెలుగు డబ్బింగ్ కొంత ఆలస్యంగా ఎల్లుండి డిసెంబర్ 27 రిలీజవుతోంది. ట్రైలర్ చూశాక యాక్షన్ లవర్స్ కోరుకునే కంటెంట్ లాగే అనిపించింది. సునీల్, వరలక్ష్మి శరత్ కుమార్ లాంటి మనకూ పరిచయమున్న అరిస్టులు ఉండటంతో ఇక్కడి జనాల్లోనూ కాసింత ఆసక్తి రేగింది. ఇంతకీ ఖైదీ కనెక్షన్ ఏంటో చూద్దాం.
కార్తీకి, లోకేష్ కనగరాజ్ కు అతి పెద్ద బ్రేక్ గా నిలిచిన ఖైదీ కేవలం ఒక రాత్రిలో జరిగే సంఘటనల ఆధారంగా తీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మ్యాక్స్ లో కూడా ఇదే ఫార్ములా ఉంటుంది. కాకపోతే స్టోరీ లైన్, ట్రీట్ మెంట్ వేరు. సస్పెండ్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్ ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య కలిగిన వైరం కారణంగా తన స్టేషన్ ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటాడు. ఈ క్రమంలో మాఫియా ఎంట్రీ, మినిస్టర్ కొడుకుల హత్య , షూటవుట్లు, పరస్పర దాడులు, తుపాకులు,బుల్లెట్లు ఇలా బోలెడు వ్యవహారాలు చోటు చేసుకుంటాయి. అసలు మ్యాక్స్ మిషన్ ఏంటనేది తెరమీద చూస్తేనే కిక్కని ఎర్లీ రిపోర్ట్స్.
కన్నడ రివ్యూలు మ్యాక్స్ కు సానుకూలంగా ఉన్నాయి. మన దగ్గర ఎలాంటి తీర్పు వస్తుందో రెండు రోజులు ఆగితే కానీ క్లారిటీ రాదు. విరూపాక్ష ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం ప్రధాన ఆకర్షణగా చెబుతున్న మ్యాక్స్ కోసం సుదీప్ చాలా ప్రమోషన్లు చేశాడు. గత చిత్రం విక్రాంత్ రోనా ఇతర భాషల్లోనూ డీసెంట్ గా ఆడిన నేపథ్యంలో మ్యాక్స్ కు అంతకు మించిన ఫలితాన్ని ఆశిస్తున్నాడు. ఎలాగూ క్రిస్మస్ పండక్కు సరైన కమర్షియల్ సినిమా లేదని ఫీలవుతున్న మూవీ లవర్స్ కొరత ఇదేమైనా తీరుస్తుందేమో చూడాలి. దీంతో పాటు 27 వస్తున్న డ్రింకర్ సాయి పూర్తిగా యూత్ ని లక్ష్యంగా పెట్టుకుని ప్రమోట్ చేసుకుంటోంది.
This post was last modified on December 25, 2024 2:59 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీలో టొవినో థామస్ ఒక ముఖ్యమైన పాత్ర…
https://www.youtube.com/watch?v=stdHpPR8djw అభిమానులు స్వీటీ అని పిలుచుకునే అనుష్క మలయాళం డెబ్యూ కథనర్ తో జరగబోతోంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు.…
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు (రచయితగా మల్లీశ్వరి,…
సాధారణంగా తన పార్టీ ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులు ఆయా పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి. వారి పనితీరు మెచ్చుకుంటాయి. మరింత మెరుగు పరుచుకోవాలని…
షాకింగ్ విషాద ఉదంతం చోటు చేసుకుంది. కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతంలో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు తెలంగాణ…
ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన ప్రభావాన్ని ఎవరూ మర్చిపోలేరు. మొదటి…