Trends

ఐదు నిమిషాల ముందు రైలు టికెట్

రిజర్వేషన్ ఉన్న రైళ్లలో ఛార్ట్ ప్రిపేరైపోయాక టికెట్లు బుక్ చేయడం సాధ్యం కాదన్న సంగతి తెలిసిందే. ఐతే ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో రైలు బయల్దేరడానికి ఐదు నిమిషాల ముందు కూడా టికెట్లు బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అక్టోబరు 10, శనివారం నుంచి కొత్తగా పలు రైళ్లు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో రైలు స్టేషను నుంచి బయలుదేరే ఐదు నిమిషాల ముందు కూడా రైల్వే సీట్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.

కరోనా సంక్షోభం నేపథ్యంలో కొన్ని నెలల పాటు రైళ్లన్నీ ఆగిపోయాయి. ఐతే అన్‌లాక్‌లో భాగంగా దశల వారీగా రైళ్లను పెంచుతోంది రైల్వే శాఖ. శనివారం నుంచి పెద్ద ఎత్తున రైళ్లను పునరుద్ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైలు బయలుదేరే సమయానికి అరగంట ముందు రెండో రిజర్వేషన్ ఛార్టు తయారు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది.

మామూలుగా రైలు బయలుదేరడానికి కనీసం నాలుగు గంటల ముందు ఛార్టు తయారు చేస్తారు. ఆ ఛార్టు తయారయ్యాక రైలులో సీట్లు ఖాళీగా ఉంటే రెండవ ఛార్టు తయారు చేసే వరకు పీఆర్ఎస్ కౌంటర్ల ద్వారా, ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు చెప్పారు. ఇలా రైలు బయల్దేరడానికి ఐదు నిమిషాల ముందు వరకు కూడా టికెట్ బుక్ చేసుకునే సౌలభ్యం ఉంది.

ఇదిలా ఉండగా దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అక్టోబరు 15 నుంచి నవంబరు 30 వరకు 39 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. వీటిలో తెలుగు రాష్ట్రాల మధ్య కూడా కొన్ని రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఐతే కరోనాకు ముందున్న రైళ్లన్నింటినీ పునరుద్ధరించడానికి మాత్రం మరి కొన్ని నెలలు సమయం పట్టే అవకాశముంది.

This post was last modified on October 10, 2020 5:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హమ్మయ్యా… పెద్ద బరువు తీరినట్టేనా

తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…

18 minutes ago

శ్రీరాములు రినోవేషన్… ఎగ్జిబిటర్ల సమాధానమా

హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…

21 minutes ago

ఏపీ అంటే… అడ్వాన్స్ డ్ ప్రదేశ్!

నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…

36 minutes ago

ఇలాగైతే కష్టమంటున్న కేసీఆర్

తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…

1 hour ago

‘కరూర్’ మృతుడి తల్లి పాదాలు తాకిన విజయ్

తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…

2 hours ago

రామ్ టార్గెట్ ఆరు నెలలు

ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…

3 hours ago