ఇటీవలే చెస్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ దొమ్మరాజు ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇతని నేపథ్యం గురించి జనంలో ఆసక్తి కలగడానికి కారణం పేరే. గుకేష్ పుట్టింది తెలుగు కుటుంబమే అయినా బాల్యం, చదువు మొత్తం చెన్నైలోనే జరిగాయి. ఫ్యామిలీ మూలాలు తిరుపతి జిల్లా సత్యవీడులో ఉండటం వల్ల గుకేష్ కు బహు భాషలు వచ్చు. తండ్రి వృత్తిరిత్యా డాక్టర్. టోర్నమెంట్స్ కోసం కొడుకు పలు ప్రదేశాలు తిరగాల్సి రావడంతో తనకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఉద్యోగం మానేయడం గుకేష్ ని ప్రపంచ విజేతగా నిలబెట్టింది. అయితే తనకు సినిమాల మీద అవగాహన ఉందండోయ్.
తెలుగులో తన ఫెవరెట్ మూవీ గీత గోవిందం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ బ్లాక్ బస్టర్ ఇంకా టీనేజ్ లో కూడా అడుగుపెట్టని వయసులో ఉన్న గుకేష్ ని అప్పట్లోనే ఆకట్టుకుంది. తమిళంలో సూర్య సన్ అఫ్ కృష్ణన్ (వారణం ఆయిరం), హిందీలో జిందగీ నా మిలే గి దోబారా బాగా ఇష్టమట. హాలీవుడ్ మీద పెద్దగా ఇష్టం లేదు కానీ అబౌట్ టైం అనే ఇంగ్లీష్ చిత్రం నచ్చిందని అన్నాడు. ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ముచ్చట్లు బయట పెట్టాడు. రెండు పదుల వయసు కూడా దాటని గుకేష్ కి కేవలం చెస్ లోనే కాక సినిమాల మీద కూడా ఆసక్తి ఉండటం విశేషమే.
ఇదంతా బాగానే ఉంది కానీ గుకేష్ బయోపిక్ ని తెరకెక్కించే ఆలోచన ఎవరికో ఒకరికి వచ్చినా ఆశ్చర్యం లేదు. కాకపోతే ఇంకా కెరీర్ ప్రారంభంలో ఉన్నాడు కాబట్టి జీవితంలో సినిమాకు సరిపడా డ్రామా ఉందో లేదో చూసుకోవాలి. తమిళనాడు ప్రభుత్వం గుకేష్ కు 5 కోట్ల అవార్డు అందించింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ట్విట్టర్ వేదికగా అందించిన శుభాకాంక్షలకు గుకేష్ స్పందిస్తూ అందరికీ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పాడు. త్వరలో హైదరాబాద్ కు రాబోతున్నట్టు సమాచారం. ఇక్కడా ఘనంగా ఒక సన్మాన కార్యక్రమం చేసే ప్లాన్ ఉందట.
This post was last modified on December 18, 2024 7:39 pm
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…