ఇటీవలే చెస్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ దొమ్మరాజు ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇతని నేపథ్యం గురించి జనంలో ఆసక్తి కలగడానికి కారణం పేరే. గుకేష్ పుట్టింది తెలుగు కుటుంబమే అయినా బాల్యం, చదువు మొత్తం చెన్నైలోనే జరిగాయి. ఫ్యామిలీ మూలాలు తిరుపతి జిల్లా సత్యవీడులో ఉండటం వల్ల గుకేష్ కు బహు భాషలు వచ్చు. తండ్రి వృత్తిరిత్యా డాక్టర్. టోర్నమెంట్స్ కోసం కొడుకు పలు ప్రదేశాలు తిరగాల్సి రావడంతో తనకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఉద్యోగం మానేయడం గుకేష్ ని ప్రపంచ విజేతగా నిలబెట్టింది. అయితే తనకు సినిమాల మీద అవగాహన ఉందండోయ్.
తెలుగులో తన ఫెవరెట్ మూవీ గీత గోవిందం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ బ్లాక్ బస్టర్ ఇంకా టీనేజ్ లో కూడా అడుగుపెట్టని వయసులో ఉన్న గుకేష్ ని అప్పట్లోనే ఆకట్టుకుంది. తమిళంలో సూర్య సన్ అఫ్ కృష్ణన్ (వారణం ఆయిరం), హిందీలో జిందగీ నా మిలే గి దోబారా బాగా ఇష్టమట. హాలీవుడ్ మీద పెద్దగా ఇష్టం లేదు కానీ అబౌట్ టైం అనే ఇంగ్లీష్ చిత్రం నచ్చిందని అన్నాడు. ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ముచ్చట్లు బయట పెట్టాడు. రెండు పదుల వయసు కూడా దాటని గుకేష్ కి కేవలం చెస్ లోనే కాక సినిమాల మీద కూడా ఆసక్తి ఉండటం విశేషమే.
ఇదంతా బాగానే ఉంది కానీ గుకేష్ బయోపిక్ ని తెరకెక్కించే ఆలోచన ఎవరికో ఒకరికి వచ్చినా ఆశ్చర్యం లేదు. కాకపోతే ఇంకా కెరీర్ ప్రారంభంలో ఉన్నాడు కాబట్టి జీవితంలో సినిమాకు సరిపడా డ్రామా ఉందో లేదో చూసుకోవాలి. తమిళనాడు ప్రభుత్వం గుకేష్ కు 5 కోట్ల అవార్డు అందించింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ట్విట్టర్ వేదికగా అందించిన శుభాకాంక్షలకు గుకేష్ స్పందిస్తూ అందరికీ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పాడు. త్వరలో హైదరాబాద్ కు రాబోతున్నట్టు సమాచారం. ఇక్కడా ఘనంగా ఒక సన్మాన కార్యక్రమం చేసే ప్లాన్ ఉందట.
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…
టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో సిటీ హాల్ బయట ఒక అమెరికన్ భారత జాతీయ జెండాను చించివేయడం ఇప్పుడు తీవ్ర దుమారం…