ఇటీవలే చెస్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ దొమ్మరాజు ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇతని నేపథ్యం గురించి జనంలో ఆసక్తి కలగడానికి కారణం పేరే. గుకేష్ పుట్టింది తెలుగు కుటుంబమే అయినా బాల్యం, చదువు మొత్తం చెన్నైలోనే జరిగాయి. ఫ్యామిలీ మూలాలు తిరుపతి జిల్లా సత్యవీడులో ఉండటం వల్ల గుకేష్ కు బహు భాషలు వచ్చు. తండ్రి వృత్తిరిత్యా డాక్టర్. టోర్నమెంట్స్ కోసం కొడుకు పలు ప్రదేశాలు తిరగాల్సి రావడంతో తనకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఉద్యోగం మానేయడం గుకేష్ ని ప్రపంచ విజేతగా నిలబెట్టింది. అయితే తనకు సినిమాల మీద అవగాహన ఉందండోయ్.
తెలుగులో తన ఫెవరెట్ మూవీ గీత గోవిందం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ బ్లాక్ బస్టర్ ఇంకా టీనేజ్ లో కూడా అడుగుపెట్టని వయసులో ఉన్న గుకేష్ ని అప్పట్లోనే ఆకట్టుకుంది. తమిళంలో సూర్య సన్ అఫ్ కృష్ణన్ (వారణం ఆయిరం), హిందీలో జిందగీ నా మిలే గి దోబారా బాగా ఇష్టమట. హాలీవుడ్ మీద పెద్దగా ఇష్టం లేదు కానీ అబౌట్ టైం అనే ఇంగ్లీష్ చిత్రం నచ్చిందని అన్నాడు. ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ముచ్చట్లు బయట పెట్టాడు. రెండు పదుల వయసు కూడా దాటని గుకేష్ కి కేవలం చెస్ లోనే కాక సినిమాల మీద కూడా ఆసక్తి ఉండటం విశేషమే.
ఇదంతా బాగానే ఉంది కానీ గుకేష్ బయోపిక్ ని తెరకెక్కించే ఆలోచన ఎవరికో ఒకరికి వచ్చినా ఆశ్చర్యం లేదు. కాకపోతే ఇంకా కెరీర్ ప్రారంభంలో ఉన్నాడు కాబట్టి జీవితంలో సినిమాకు సరిపడా డ్రామా ఉందో లేదో చూసుకోవాలి. తమిళనాడు ప్రభుత్వం గుకేష్ కు 5 కోట్ల అవార్డు అందించింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ట్విట్టర్ వేదికగా అందించిన శుభాకాంక్షలకు గుకేష్ స్పందిస్తూ అందరికీ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పాడు. త్వరలో హైదరాబాద్ కు రాబోతున్నట్టు సమాచారం. ఇక్కడా ఘనంగా ఒక సన్మాన కార్యక్రమం చేసే ప్లాన్ ఉందట.
This post was last modified on December 18, 2024 7:39 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…