టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు అనంతరం అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించారు. డ్రెస్సింగ్ రూమ్లో సహచర ఆటగాళ్లతో భావోద్వేగ క్షణాలను పంచుకున్న అశ్విన్, తన కెరీర్ ముగింపు గురించి చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సందర్భంగా అశ్విన్ తన కెరీర్లో తాను సాధించిన విజయాలను, టీమిండియాకు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.
బీసీసీఐ కూడా అశ్విన్ను ప్రశంసిస్తూ, ఆయన రిటైర్మెంట్ ప్రకటించినట్లు అధికారికంగా ప్రకటించింది. 38 ఏళ్ల అశ్విన్ 2010లో వన్డే క్రికెట్తో తన అంతర్జాతీయ ప్రయాణం ప్రారంభించారు. 2011లో వెస్టిండీస్పై టెస్ట్ అరంగేట్రం చేసిన ఆయన, తన ఆరంభం నుంచి గొప్ప ప్రదర్శనతో జట్టుకు మద్దతుగా నిలిచారు. 105 టెస్టుల్లో అశ్విన్ 3,474 పరుగులు చేయడంతో పాటు 536 వికెట్లు తీశారు.
టెస్టుల్లో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు సాధించిన అశ్విన్, ఒకే టెస్టులో 10 వికెట్లు తీసిన ఘనతను 8 సార్లు తన ఖాతాలో వేసుకున్నారు. వన్డే ఫార్మాట్లో 116 మ్యాచ్లు ఆడిన అశ్విన్ 707 పరుగులు చేయగా, 156 వికెట్లు తీశారు. టీ20లో 65 మ్యాచ్లు ఆడి 72 వికెట్లను సాధించారు. అశ్విన్ తన కెరీర్లో అన్ని ఫార్మాట్లలోనూ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేయడంతో పాటు జట్టులో ఆల్రౌండర్గా తనదైన ముద్ర వేశారు.
అశ్విన్ రిటైర్మెంట్ గురించి మాజీ ఆటగాళ్లు, అభిమానులు హృదయపూర్వకంగా స్పందిస్తున్నారు. భారత క్రికెట్ను మరింత ఉన్నతంగా తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషిని ఎప్పటికీ మరిచిపోలేమని కోహ్లీతో పాటు మరికొంతమంది ఆటగాళ్లు అభిప్రాయపడ్డారు. ఇకపై అశ్విన్ కొత్త పాత్రలో, క్రికెట్లోకి వచ్చే కొత్తతరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా అశ్విన్ క్రికెట్ కామెంటరీపై ఆసక్తి చూపిస్తున్నట్లు టాక్.
This post was last modified on December 18, 2024 1:46 pm
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…