భారత యువ గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం దొమ్మరాజు గుకేశ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి రూ. 11.34 కోట్ల భారీ క్యాష్ ప్రైజ్ దక్కించుకున్నాడు. దాంతోపాటు, 3 మ్యాచ్లు గెలిచినందుకు రూ. 5.04 కోట్ల నగదు బహుమతి లభించింది. దీంతో, భారత ప్రభుత్వానికి రూ. 4.67 కోట్ల ట్యాక్స్ చెల్లించబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ధోనీ ఐపీఎల్-2025 లో దక్కించుకున్నదానికన్నా గుకేశ్ ఎక్కువ ట్యాక్స్ కడుతున్నారని సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి.
2025 ఐపీఎల్ వేలంలో అన్ క్టాప్డ్ ప్లేయర్గా ధోనీని సీఎస్కే రూ. 4 కోట్లకు రిటెయిన్ చేసుకుంది. ఐదేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న ఇండియన్ ప్లేయర్ ను అన్ క్యాప్డ్ గా పరిగణించాలన్నది ఐపీఎల్ నిబంధన. ఈ నేపథ్యంలోనే ధోనీకి చెన్నై యాజమాన్యం చెల్లించిన దానికంటే గుకేశ్ చెల్లించే పన్ను ఎక్కువ అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.
అతి చిన్న వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచిన వ్యక్తిగా గుకేశ్ చరిత్రపుటలకెక్కాడు.అయితే, డబ్బుల కోసం తాను చెస్ ఆడటం లేదని, చెస్ అంటే తనకు పిచ్చి అని గుకేశ్ చెబుతున్నాడు. అయితే, తాను చెస్లోకి వచ్చిన కొత్తలో కుటుంబం ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పడిందని, ఈ ప్రైజ్మనీతో సౌకర్యవంతంగా జీవిస్తామని అన్నారు.
This post was last modified on December 16, 2024 7:16 pm
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది.…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…
అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…
దర్శకుడిగా తొలి చిత్రం ‘పెళ్ళిచూపులు’తో తరుణ్ భాస్కర్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండో సినిమా ‘ఈ నగరానికి…
రాజమౌళి సినిమా అంటే ఒకప్పట్లా భారతీయ ప్రేక్షకులు మాత్రమే కాదు.. గ్లోబల్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. తన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…