భారత యువ గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం దొమ్మరాజు గుకేశ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి రూ. 11.34 కోట్ల భారీ క్యాష్ ప్రైజ్ దక్కించుకున్నాడు. దాంతోపాటు, 3 మ్యాచ్లు గెలిచినందుకు రూ. 5.04 కోట్ల నగదు బహుమతి లభించింది. దీంతో, భారత ప్రభుత్వానికి రూ. 4.67 కోట్ల ట్యాక్స్ చెల్లించబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ధోనీ ఐపీఎల్-2025 లో దక్కించుకున్నదానికన్నా గుకేశ్ ఎక్కువ ట్యాక్స్ కడుతున్నారని సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి.
2025 ఐపీఎల్ వేలంలో అన్ క్టాప్డ్ ప్లేయర్గా ధోనీని సీఎస్కే రూ. 4 కోట్లకు రిటెయిన్ చేసుకుంది. ఐదేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న ఇండియన్ ప్లేయర్ ను అన్ క్యాప్డ్ గా పరిగణించాలన్నది ఐపీఎల్ నిబంధన. ఈ నేపథ్యంలోనే ధోనీకి చెన్నై యాజమాన్యం చెల్లించిన దానికంటే గుకేశ్ చెల్లించే పన్ను ఎక్కువ అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.
అతి చిన్న వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచిన వ్యక్తిగా గుకేశ్ చరిత్రపుటలకెక్కాడు.అయితే, డబ్బుల కోసం తాను చెస్ ఆడటం లేదని, చెస్ అంటే తనకు పిచ్చి అని గుకేశ్ చెబుతున్నాడు. అయితే, తాను చెస్లోకి వచ్చిన కొత్తలో కుటుంబం ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పడిందని, ఈ ప్రైజ్మనీతో సౌకర్యవంతంగా జీవిస్తామని అన్నారు.
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…