Trends

ఎవడైనా కానీ కూతురి జోలికొస్తే తగ్గేదే లే!!

రివెంజ్ డ్రామా కేవలం సినిమాలకే పరిమితమనుకుంటాం కానీ నిజ జీవితంలోనూ జరుగుతూ ఉంటాయి. దానికి ఈ సంఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. కువైట్ నుంచి వచ్చిన ఆంజనేయ ప్రసాద్ అనే ఎన్ఆర్ఐ ఇండియాలో చదువుకుంటున్న తన కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని హత్య చేసి తిరిగి విదేశానికి వెళ్లిపోవడమే కాక నేరాన్ని ఒప్పుకుంటూ వీడియో రిలీజ్ చేయడం సంచలనం రేపుతోంది. చనిపోయిన నిందితుడి పేరు ఆంజనేయులు. వయసు 59 సంవత్సరాలు. పన్నెండేళ్ల కూతురిని చదువు కోసం ఇండియాలోనే ఉంచిన ప్రసాద్ ఆ బాధ్యతను భార్య చెల్లెలికి అప్పగించారు. ఆవిడ మామే ఈ దారుణానికి ఒడిగట్టింది.

ఇదంతా చూస్తే ఎప్పుడో 1992లో వచ్చిన సర్పయాగం గుర్తుకు వస్తుంది. కాలేజీలో చదువుతున్న కూతురి మీద కొందరు యువకులు అఘాయిత్యం చేస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. దీంతో కోర్టులో న్యాయం దొరక్క డాక్టరైన తండ్రి కిరాయి హంతకులను అద్దెకు తీసుకుని వాళ్ళను ఒక్కొక్కరిగా చంపేస్తాడు. ఇది ఒంగోలులో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా పరుచూరి బ్రదర్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించింది. శోభన్ బాబు నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. కట్ చేస్తే ఇప్పుడీ ఆంజనేయ ప్రసాద్ సరిగ్గా సర్పయాగం సినిమానే గుర్తు చేశాడు.

అతను చేసింది తప్పే అయినా నెటిజెన్లు మాత్రం ముమ్మాటికీ రైటేనని ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇంత ఓపెన్ గా నేరం ఒప్పుకున్నాడు కాబట్టి కువైట్ నుంచి తిరిగి ఇక్కడికి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. మనవరాలి వయసున్న మనిషి టీనేజ్ వయసు లేని పసిపాప మీద ఇలాంటి దారుణానికి ఒడిగట్టే ప్రయత్నం చేయడం ముమ్మాటికీ తీవ్ర శిక్షార్హం. అదేదో పోలీసుల వైపు నుంచి త్వరగా జరిగి ఉంటే ఆ తండ్రి కువైట్ నుంచి వచ్చి హత్య చేయాల్సి వచ్చేది కాదని బంధువుల వెర్షన్. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్టేట్ వైడ్ సెన్సేషన్ గా మారింది. దెబ్బకతన్ని హీరోగా చూస్తున్న వాళ్ళున్నారు.

This post was last modified on December 12, 2024 5:05 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

55 minutes ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

1 hour ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

3 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

3 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

4 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

5 hours ago