రివెంజ్ డ్రామా కేవలం సినిమాలకే పరిమితమనుకుంటాం కానీ నిజ జీవితంలోనూ జరుగుతూ ఉంటాయి. దానికి ఈ సంఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. కువైట్ నుంచి వచ్చిన ఆంజనేయ ప్రసాద్ అనే ఎన్ఆర్ఐ ఇండియాలో చదువుకుంటున్న తన కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని హత్య చేసి తిరిగి విదేశానికి వెళ్లిపోవడమే కాక నేరాన్ని ఒప్పుకుంటూ వీడియో రిలీజ్ చేయడం సంచలనం రేపుతోంది. చనిపోయిన నిందితుడి పేరు ఆంజనేయులు. వయసు 59 సంవత్సరాలు. పన్నెండేళ్ల కూతురిని చదువు కోసం ఇండియాలోనే ఉంచిన ప్రసాద్ ఆ బాధ్యతను భార్య చెల్లెలికి అప్పగించారు. ఆవిడ మామే ఈ దారుణానికి ఒడిగట్టింది.
ఇదంతా చూస్తే ఎప్పుడో 1992లో వచ్చిన సర్పయాగం గుర్తుకు వస్తుంది. కాలేజీలో చదువుతున్న కూతురి మీద కొందరు యువకులు అఘాయిత్యం చేస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. దీంతో కోర్టులో న్యాయం దొరక్క డాక్టరైన తండ్రి కిరాయి హంతకులను అద్దెకు తీసుకుని వాళ్ళను ఒక్కొక్కరిగా చంపేస్తాడు. ఇది ఒంగోలులో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా పరుచూరి బ్రదర్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించింది. శోభన్ బాబు నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. కట్ చేస్తే ఇప్పుడీ ఆంజనేయ ప్రసాద్ సరిగ్గా సర్పయాగం సినిమానే గుర్తు చేశాడు.
అతను చేసింది తప్పే అయినా నెటిజెన్లు మాత్రం ముమ్మాటికీ రైటేనని ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇంత ఓపెన్ గా నేరం ఒప్పుకున్నాడు కాబట్టి కువైట్ నుంచి తిరిగి ఇక్కడికి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. మనవరాలి వయసున్న మనిషి టీనేజ్ వయసు లేని పసిపాప మీద ఇలాంటి దారుణానికి ఒడిగట్టే ప్రయత్నం చేయడం ముమ్మాటికీ తీవ్ర శిక్షార్హం. అదేదో పోలీసుల వైపు నుంచి త్వరగా జరిగి ఉంటే ఆ తండ్రి కువైట్ నుంచి వచ్చి హత్య చేయాల్సి వచ్చేది కాదని బంధువుల వెర్షన్. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్టేట్ వైడ్ సెన్సేషన్ గా మారింది. దెబ్బకతన్ని హీరోగా చూస్తున్న వాళ్ళున్నారు.
This post was last modified on December 12, 2024 5:05 pm
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…