ఓవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. గెలుపునకు దగ్గరయ్యేందుకు తనకున్న అన్ని ప్రయత్నాల్ని చేస్తున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికన్లకే అగ్ర తాంబూలం అంటూ.. సెంటిమెంట్ ను రగల్చటం ద్వారా అధికారాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్న ఆయన.. తాజాగా ఉపాధి ఆధారిత హెచ్ 1 బీ వీసాల జారీ అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం హెచ్ 1బీ వీసాల జారీపై ప్రభావం చూపటమే కాదు.. డాలర్ డ్రీమ్స్ మీద ఆశలు పెట్టుకున్న వారి కలల్ని భగ్నం చేస్తుందన్న మాట వినిపిస్తోంది.
దేశంలోకి చట్టబద్ధమైన వలసల్ని అరికట్టటం.. స్థానికీకరణ.. అమెరికా ఉద్యోగాల్ని రక్షించే లక్ష్యంతోనే తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ట్రంప్ సర్కారు విడుదల చేసిన మధ్యంతర ఉత్తర్వులతో ఉపాధి కోసం వచ్చే వారి మీద ప్రభావం పడనుంది.
యుఎస్ పౌరసత్వం.. ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కు సంబంధించి చర్యలు తీసుకున్నట్లుగా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్ 1 బీ వీసాకు సంబంధించి గడిచిన ఇరవైఏళ్లలో చేసిన అతి ముఖ్యమైన సంస్కరణలో తాజా ఉత్తర్వు ఉంటుందని చెబుతున్నారు. ఈ నిర్ణయంతో వీసాల కోసం దరఖాస్తు చేసే మూడొంతుల మందిలో ఒక వంతు వారిని ప్రభావితం చేసే వీలుందంటున్నారు.
ఇంతకీ తాజా ఉత్తర్వుల్లోని కీలకమైన అంశాలు ఏమున్నాయన్నది చూస్తే.. మొదటిది.. స్పెషాల్టీ నిర్వచనాన్ని తగ్గించటం.. అమెరికన్ల స్థానంలో ఇతర ఐటీ నిపుణులు అవసరమని నిరూపించేందుకు మరిన్ని డాక్యుమెంట్లు అవసరమవుతాయి. అంతేకాదు.. ఐటీ నిపుణుల నియామకం కోసం ఆధారపడే థర్డ్ పార్టీల మీద మరింత డేగ కన్ను వేస్తారు.
తాజా ఉత్తర్వుల ప్రకారం హెచ్ 1బీ వీసా ఉద్యోగాలను కనీస వేతన స్థాయిల్ని కూడా మార్చే వీలుంది. ఇది.. భారతీయ టెక్ నిపుణులు.. టెక్ సంస్థల్ని భారీగా ప్రభావితం చేస్తుందంటున్నారు. తాజా ఉత్తర్వుల మీద పలు సంస్థలు కోర్టును ఆశ్రయించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
This post was last modified on October 7, 2020 2:27 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…