భారత ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల సంఘం పనితీరుపై ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. తాజాగా మహారాష్ట్ర, జార్ఖండ్ సహా.. పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప్ప ఎన్ని కలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఒకే రోజు(శనివారం)లో పూర్తయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కోట్ చేస్తూ.. మస్క్ నివ్వెర పోయారు. అదే సమయంలో ప్రశంసించారు కూడా.
రెండు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపును ఒకే రోజులో పూర్తి చేయడం గ్రేట్ అని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ సమయంలోనే అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రస్తావించారు. ఇప్పటికీ అమెరికాలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. కాలిఫోర్నియాలో ఇప్పటికీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతూనే ఉందన్నారు. అమెరికాతో పోల్చుకుంటే.. భారత్ గ్రేట్ అని వ్యాఖ్యానించారు.
“భారత్లో 6.4 కోట్ల మంది వేసిన ఓట్లను ఒక్క రోజులోనే లెక్కించేశారు. కాలిఫోర్నియాలో ఇప్పటికీ లెక్కింపు జరుగుతూనే ఉంది“ అని ఎక్స్లో మస్క్ రాసుకొచ్చారు. దీనికి భారత ఎన్నికల ఓట్ల లెక్కింపుపై వచ్చిన ఓ ఆర్టికల్ను(640 మిలియన్ల ఓట్లను భారత్ ఒక్క రోజులో ఎలా లెక్కించింది) కూడా జత చేశారు. ఈ పోస్టుకు మరో క్యాప్షన్ కూడా జోడించారు. ఈ పోస్ట్కి “అయితే భారతదేశంలో, మోసం చేయడం వారి ఎన్నికల ప్రధాన లక్ష్యం కాదు” అని శీర్షిక పెట్టారు.
మరోపోస్టుకు కూడా మస్క్ స్పందించారు. “భారత్ 640 మిలియన్ల ఓట్లను ఒకే ఒక్క రోజులో లెక్కిస్తే.. కాలిఫోర్నియాలో 1.5 కోట్ల ఓట్లను గత 18 రోజులుగా లెక్కిస్తూనే ఉన్నారు“ అని కామెంట్ చేశారు. ఇప్పటికి రెండు వారాలు పూర్తయినా 3 లక్షల ఓట్లను ఇంకా లెక్కించాల్సి ఉంది. ఇక్కడ బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఓట్లు వేశారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…