కరోనా వ్యాప్తి భయంతో ఆంధ్రప్రదేశ్ నుంచి రాకపోకల్ని ఆపేస్తూ తమిళనాడు బోర్డర్లో ఆ రాష్ట్ర వాసులు గోడ నిర్మించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల కిందటే కొన్ని చోట్ల అంతర్ రాష్ట్ర సరిహద్దుల్ని తమిళనాడు మూసేసింది.
ఐతే చిత్తూరు జిల్లా నుంచి వేలూరు సీఎంసీ ఆసుపత్రికి అత్యవసర సేవల కోసం రోగులు రావడం పరిపాటి. దీంతో చిత్తూరు-వేలూరు మార్గంలో రోడ్డును తెరిచే ఉంచుతున్నారు. ఐతే ఏపీ నుంచి కరోనాను జనాలు తమ ప్రాంతానికి మోసుకొస్తున్నారన్న భయంతో ఆ మార్గాన్ని మూసి వేస్తూ తాత్కాలికంగా సిమెంటు దిమ్మెలతో గోడ కట్టేశారు.
దీనిపై చిత్తూరు జిల్లా వాసులపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సీఎంసీలో సగం కేసులు చిత్తూరు జిల్లా వాసులవే ఉంటాయి. నామమాత్రపు రుసుముతో పెద్ద పెద్ద జబ్బులకు కూడా చికిత్స అందిస్తుందా ఆసుపత్రి.
దాన్ని నమ్ముకున్న వాళ్లందరూ ఇలా గోడ కట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొందరు చిత్తూరు వాసులు ఆ గోడను కూలగొట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీనిపై ఏపీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా వ్యవహారంపై జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
ఆయన వేలూరు జిల్లా కలెక్టర్ షణ్ముఖ సుందరంతో మాట్లాడారు. గోడను తొలగించకపోతే చిత్తూరు జిల్లా సహ రాయలసీమ వాసులు చాలా ఇబ్బంది పడతారని, అత్యవసర కేసుల్ని దృష్టిలో ఉంచుకుని ఆ గోడను తొలగించాలని కోరారు.
దీంతో వేలూరు కలెక్టర పెద్ద మనసుతో స్పందించారు. వెంటనే అధికారుల్ని పంపించి ఆ గోడను కూలగొట్టించారు. దీంతో రాకపోకలు సాగుతున్నాయి. ఐతే అక్కడే చెక్ పోస్టు ఏర్పాటు చేసి ఆసుపత్రిలో అత్యవసర సేవల కోసం వెళ్లే వాళ్లను మాత్రమే చూసి అనుమతిస్తున్నారు ప్రభుత్వ సిబ్బంది.
This post was last modified on April 28, 2020 5:57 pm
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…