Trends

మారటోరియం వాడుకోలేదా.. ఐతే క్యాష్ బ్యాక్

లాక్ డౌన్ టైంలో ఉపాధి లేక, ఆదాయం కోల్పోయి అవస్థలు పడుతున్న ఈఎంఐ జీవులకు ఊరటనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మారటోరియం అవకాశాన్ని ఇచ్చినట్లే ఇచ్చి అందులో పెట్టిన మెలిక తీవ్ర నిరాశకు గురి చేసింది. మారటోరియం తీసుకుని వాయిదే వేసుకున్న ఈఎంఐల మొత్తాన్ని అసలులో కలిపి దానికి మళ్లీ వడ్డీ వేయడం వల్ల చివర్లో ఈఎంఐలు మరిన్ని యాడ్ అవుతాయన్న సమాచారం ఎవరికీ రుచించలేదు. కానీ విధి లేక కొందరు మారటోరియం తీసుకున్నారు. కొందరు ఎలాగోలా కష్టపడి ఈఎంఐలు కట్టారు.

ఐతే దీనిపై దాఖలపై పిటిషన్లపై విచారణ జరిపిన కేంద్ర ప్రభుత్వం ఈ మెలికను తప్పుబట్టింది. వడ్డీ మీద మళ్లీ వడ్డీ వేసి ఈఎంఐలు పెంచడాన్ని తప్పుబట్టింది. దీనిపై కొన్ని నెలలుగా విచారణ సాగుతోంది. ఐతే చివరికి రూ.2 కోట్ల లోపు రుణాలకు ఈ వడ్డీ మాఫీ చేయడానికి కేంద్రం అంగీకరించడం తెలిసిన సంగతే.

ఐతే లాక్ డౌన్ టైంలో ఎలాగోలా కష్టపడి ఈఎంఐలు కట్టిన వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తింది. మారటోరియం తీసుకున్న వాళ్లకు మాత్రమే ప్రయోజనం కల్పిస్తే వీరికి అన్యాయం జరిగినట్లే అవుతుంది. ఐతే వారికి కూడా ఉపశమనాన్నందించేలా కేంద్రం ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మారటోరియం కట్టని వాళ్లకు వడ్డీ మాఫీతో ఎంత ఉపశమనం ఇస్తున్నారో అదే స్థాయిలో ఈఎంఐలు కట్టిన వాళ్లకు క్యాష్ బ్యాక్ ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఆ క్యాష్ బ్యాక్ ఎంత వస్తే అంత మొత్తం ఈఎంఐలు కట్టిన రుణ గ్రహీతల ప్రిన్సిపల్ అమౌంట్లో తగ్గిస్తారట.

ఐతే ఈ లెక్కలు కట్టడం కొంచెం కష్టంతో కూడుకున్న పనే. బ్యాంకులు ఇందుకోసం ఒక సాఫ్ట్ వేర్ అందుబాటులోకి తేవాల్సి ఉంటుందట. ఇది సంక్లిష్టమైన ప్రక్రియ అని, ఇదంతా పూర్తవడానికి చాలా సమయం పడుతుందని.. వచ్చే ఏడాది కానీ ఈ క్యాష్ బ్యాక్ రుణ గ్రహీతల లోన్ అకౌంట్లలోకి రావడం కష్టమని అంటున్నారు.

This post was last modified on October 5, 2020 8:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాంగ్ టైంలో రిలీజ్… దెబ్బ కొడుతోందా?

తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…

2 hours ago

ఏది ఎక్కడ అడగాలో తెలియదా గురూ…!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…

4 hours ago

ఇండియా vs పాక్ : టికెట్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే…

ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…

4 hours ago

పూజా హెగ్డే… ఇది తగునా?

పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…

5 hours ago

బాబు బాటలోనే లోకేశ్!…’అరకు’కు మహార్దశ పక్కా!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…

6 hours ago

క్రేజీ సీక్వెల్‌కు బడ్జెట్ సమస్యలు…

తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…

6 hours ago