లాక్ డౌన్ టైంలో ఉపాధి లేక, ఆదాయం కోల్పోయి అవస్థలు పడుతున్న ఈఎంఐ జీవులకు ఊరటనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మారటోరియం అవకాశాన్ని ఇచ్చినట్లే ఇచ్చి అందులో పెట్టిన మెలిక తీవ్ర నిరాశకు గురి చేసింది. మారటోరియం తీసుకుని వాయిదే వేసుకున్న ఈఎంఐల మొత్తాన్ని అసలులో కలిపి దానికి మళ్లీ వడ్డీ వేయడం వల్ల చివర్లో ఈఎంఐలు మరిన్ని యాడ్ అవుతాయన్న సమాచారం ఎవరికీ రుచించలేదు. కానీ విధి లేక కొందరు మారటోరియం తీసుకున్నారు. కొందరు ఎలాగోలా కష్టపడి ఈఎంఐలు కట్టారు.
ఐతే దీనిపై దాఖలపై పిటిషన్లపై విచారణ జరిపిన కేంద్ర ప్రభుత్వం ఈ మెలికను తప్పుబట్టింది. వడ్డీ మీద మళ్లీ వడ్డీ వేసి ఈఎంఐలు పెంచడాన్ని తప్పుబట్టింది. దీనిపై కొన్ని నెలలుగా విచారణ సాగుతోంది. ఐతే చివరికి రూ.2 కోట్ల లోపు రుణాలకు ఈ వడ్డీ మాఫీ చేయడానికి కేంద్రం అంగీకరించడం తెలిసిన సంగతే.
ఐతే లాక్ డౌన్ టైంలో ఎలాగోలా కష్టపడి ఈఎంఐలు కట్టిన వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తింది. మారటోరియం తీసుకున్న వాళ్లకు మాత్రమే ప్రయోజనం కల్పిస్తే వీరికి అన్యాయం జరిగినట్లే అవుతుంది. ఐతే వారికి కూడా ఉపశమనాన్నందించేలా కేంద్రం ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మారటోరియం కట్టని వాళ్లకు వడ్డీ మాఫీతో ఎంత ఉపశమనం ఇస్తున్నారో అదే స్థాయిలో ఈఎంఐలు కట్టిన వాళ్లకు క్యాష్ బ్యాక్ ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఆ క్యాష్ బ్యాక్ ఎంత వస్తే అంత మొత్తం ఈఎంఐలు కట్టిన రుణ గ్రహీతల ప్రిన్సిపల్ అమౌంట్లో తగ్గిస్తారట.
ఐతే ఈ లెక్కలు కట్టడం కొంచెం కష్టంతో కూడుకున్న పనే. బ్యాంకులు ఇందుకోసం ఒక సాఫ్ట్ వేర్ అందుబాటులోకి తేవాల్సి ఉంటుందట. ఇది సంక్లిష్టమైన ప్రక్రియ అని, ఇదంతా పూర్తవడానికి చాలా సమయం పడుతుందని.. వచ్చే ఏడాది కానీ ఈ క్యాష్ బ్యాక్ రుణ గ్రహీతల లోన్ అకౌంట్లలోకి రావడం కష్టమని అంటున్నారు.
This post was last modified on October 5, 2020 8:35 pm
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…
త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…