లాక్ డౌన్ టైంలో ఉపాధి లేక, ఆదాయం కోల్పోయి అవస్థలు పడుతున్న ఈఎంఐ జీవులకు ఊరటనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మారటోరియం అవకాశాన్ని ఇచ్చినట్లే ఇచ్చి అందులో పెట్టిన మెలిక తీవ్ర నిరాశకు గురి చేసింది. మారటోరియం తీసుకుని వాయిదే వేసుకున్న ఈఎంఐల మొత్తాన్ని అసలులో కలిపి దానికి మళ్లీ వడ్డీ వేయడం వల్ల చివర్లో ఈఎంఐలు మరిన్ని యాడ్ అవుతాయన్న సమాచారం ఎవరికీ రుచించలేదు. కానీ విధి లేక కొందరు మారటోరియం తీసుకున్నారు. కొందరు ఎలాగోలా కష్టపడి ఈఎంఐలు కట్టారు.
ఐతే దీనిపై దాఖలపై పిటిషన్లపై విచారణ జరిపిన కేంద్ర ప్రభుత్వం ఈ మెలికను తప్పుబట్టింది. వడ్డీ మీద మళ్లీ వడ్డీ వేసి ఈఎంఐలు పెంచడాన్ని తప్పుబట్టింది. దీనిపై కొన్ని నెలలుగా విచారణ సాగుతోంది. ఐతే చివరికి రూ.2 కోట్ల లోపు రుణాలకు ఈ వడ్డీ మాఫీ చేయడానికి కేంద్రం అంగీకరించడం తెలిసిన సంగతే.
ఐతే లాక్ డౌన్ టైంలో ఎలాగోలా కష్టపడి ఈఎంఐలు కట్టిన వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తింది. మారటోరియం తీసుకున్న వాళ్లకు మాత్రమే ప్రయోజనం కల్పిస్తే వీరికి అన్యాయం జరిగినట్లే అవుతుంది. ఐతే వారికి కూడా ఉపశమనాన్నందించేలా కేంద్రం ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మారటోరియం కట్టని వాళ్లకు వడ్డీ మాఫీతో ఎంత ఉపశమనం ఇస్తున్నారో అదే స్థాయిలో ఈఎంఐలు కట్టిన వాళ్లకు క్యాష్ బ్యాక్ ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఆ క్యాష్ బ్యాక్ ఎంత వస్తే అంత మొత్తం ఈఎంఐలు కట్టిన రుణ గ్రహీతల ప్రిన్సిపల్ అమౌంట్లో తగ్గిస్తారట.
ఐతే ఈ లెక్కలు కట్టడం కొంచెం కష్టంతో కూడుకున్న పనే. బ్యాంకులు ఇందుకోసం ఒక సాఫ్ట్ వేర్ అందుబాటులోకి తేవాల్సి ఉంటుందట. ఇది సంక్లిష్టమైన ప్రక్రియ అని, ఇదంతా పూర్తవడానికి చాలా సమయం పడుతుందని.. వచ్చే ఏడాది కానీ ఈ క్యాష్ బ్యాక్ రుణ గ్రహీతల లోన్ అకౌంట్లలోకి రావడం కష్టమని అంటున్నారు.
This post was last modified on October 5, 2020 8:35 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…