ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఎవరు గెలుస్తారు అనే దాని కంటే కూడా, అసలు భారత్ ఈ మ్యాచ్ టోర్నీలో పాల్గొంటుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. భద్రతా కారణాల వల్ల పాకిస్థాన్లో మ్యాచ్లు ఆడేందుకు భారత్ నిరాకరించడంతో, ఈ పరిణామం ఛాంపియన్స్ ట్రోఫీ జరగడంపై సందిగ్ధతకు దారితీస్తోంది. ట్రోఫీ కోసం భారత్ పాకిస్థాన్ వెళ్లబోదని బీసీసీఐ ఇదివరకే స్పష్టంగా చెప్పింది. అయితే సజావుగా టోర్నమెంట్ సాగేందుకు ఒక మంచి సలహా కూడా ఇచ్చింది.
బీసీసీఐ ప్రతిపాదన ప్రకారం హైబ్రిడ్ మోడల్ విధానంలో తమ మ్యాచ్లను యూఏఈలో నిర్వహించాలని సూచించింది. అయితే ఈ విషయాన్ని ఐసీసీ ఇప్పటికే పీసీబీకి తెలియజేసింది. కానీ, పీసీబీ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఈ వివాదం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ మోడల్ విషయంలో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. మధ్యలో పాకిస్థాన్ ప్రభుత్వం భారత్ కండిషన్ ముందు తగ్గకూడదు అన్నట్లు మొండి పట్టుతో ససేమిరా అంటోంది.
పీసీబీకి తమ దేశంలోనే అన్ని మ్యాచ్లను నిర్వహించాలంటూ కఠినమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ కూడా దేశం వెలుపల ఒక్క మ్యాచ్ కూడా జరగకూడదని నిర్ణయించింది. “మా దేశం నుంచి ఒక్క మ్యాచ్ కూడా తరలించకూడదని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది,” అని పీసీబీ అధికారి వెల్లడించారు.
ఈ వివాదంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ తన యూట్యూబ్ వీడియోలో కూడా హైబ్రిడ్ మోడల్ను అంగీకరించకూడదని పీసీబీపై ప్రభుత్వం కట్టడి చేస్తోందని తెలిపారు. ఒకవేళ పీసీబీ హైబ్రిడ్ మోడల్ను అంగీకరించకపోతే, ఐసీసీ టోర్నమెంట్ను దక్షిణాఫ్రికాకు తరలించే అవకాశం కూడా ఉందని సమాచారం. ఈ పరిస్థితుల్లో ఐసీసీ, భారత్, పాకిస్థాన్ల మధ్య సవాళ్లు కొనసాగుతుండగా, ప్రపంచ క్రికెట్కు ఎదురవుతున్న ఈ సంక్షోభానికి ఎలాంటి పరిష్కారం దొరకుతుందో చూడాలి.
This post was last modified on November 13, 2024 6:18 pm
బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…
బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…
ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…
కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…