ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఎవరు గెలుస్తారు అనే దాని కంటే కూడా, అసలు భారత్ ఈ మ్యాచ్ టోర్నీలో పాల్గొంటుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. భద్రతా కారణాల వల్ల పాకిస్థాన్లో మ్యాచ్లు ఆడేందుకు భారత్ నిరాకరించడంతో, ఈ పరిణామం ఛాంపియన్స్ ట్రోఫీ జరగడంపై సందిగ్ధతకు దారితీస్తోంది. ట్రోఫీ కోసం భారత్ పాకిస్థాన్ వెళ్లబోదని బీసీసీఐ ఇదివరకే స్పష్టంగా చెప్పింది. అయితే సజావుగా టోర్నమెంట్ సాగేందుకు ఒక మంచి సలహా కూడా ఇచ్చింది.
బీసీసీఐ ప్రతిపాదన ప్రకారం హైబ్రిడ్ మోడల్ విధానంలో తమ మ్యాచ్లను యూఏఈలో నిర్వహించాలని సూచించింది. అయితే ఈ విషయాన్ని ఐసీసీ ఇప్పటికే పీసీబీకి తెలియజేసింది. కానీ, పీసీబీ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఈ వివాదం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ మోడల్ విషయంలో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. మధ్యలో పాకిస్థాన్ ప్రభుత్వం భారత్ కండిషన్ ముందు తగ్గకూడదు అన్నట్లు మొండి పట్టుతో ససేమిరా అంటోంది.
పీసీబీకి తమ దేశంలోనే అన్ని మ్యాచ్లను నిర్వహించాలంటూ కఠినమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ కూడా దేశం వెలుపల ఒక్క మ్యాచ్ కూడా జరగకూడదని నిర్ణయించింది. “మా దేశం నుంచి ఒక్క మ్యాచ్ కూడా తరలించకూడదని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది,” అని పీసీబీ అధికారి వెల్లడించారు.
ఈ వివాదంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ తన యూట్యూబ్ వీడియోలో కూడా హైబ్రిడ్ మోడల్ను అంగీకరించకూడదని పీసీబీపై ప్రభుత్వం కట్టడి చేస్తోందని తెలిపారు. ఒకవేళ పీసీబీ హైబ్రిడ్ మోడల్ను అంగీకరించకపోతే, ఐసీసీ టోర్నమెంట్ను దక్షిణాఫ్రికాకు తరలించే అవకాశం కూడా ఉందని సమాచారం. ఈ పరిస్థితుల్లో ఐసీసీ, భారత్, పాకిస్థాన్ల మధ్య సవాళ్లు కొనసాగుతుండగా, ప్రపంచ క్రికెట్కు ఎదురవుతున్న ఈ సంక్షోభానికి ఎలాంటి పరిష్కారం దొరకుతుందో చూడాలి.
This post was last modified on November 13, 2024 6:18 pm
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…