Trends

భారత్ వెళ్లదు, పాక్ కాంప్రమైజ్ కాదు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఎవరు గెలుస్తారు అనే దాని కంటే కూడా, అసలు భారత్ ఈ మ్యాచ్ టోర్నీలో పాల్గొంటుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. భద్రతా కారణాల వల్ల పాకిస్థాన్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌ నిరాకరించడంతో, ఈ పరిణామం ఛాంపియన్స్ ట్రోఫీ జరగడంపై సందిగ్ధతకు దారితీస్తోంది. ట్రోఫీ కోసం భారత్ పాకిస్థాన్‌ వెళ్లబోదని బీసీసీఐ ఇదివరకే స్పష్టంగా చెప్పింది. అయితే సజావుగా టోర్నమెంట్ సాగేందుకు ఒక మంచి సలహా కూడా ఇచ్చింది.

బీసీసీఐ ప్రతిపాదన ప్రకారం హైబ్రిడ్ మోడల్ విధానంలో తమ మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని సూచించింది. అయితే ఈ విషయాన్ని ఐసీసీ ఇప్పటికే పీసీబీకి తెలియజేసింది. కానీ, పీసీబీ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఈ వివాదం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ మోడల్ విషయంలో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. మధ్యలో పాకిస్థాన్ ప్రభుత్వం భారత్ కండిషన్ ముందు తగ్గకూడదు అన్నట్లు మొండి పట్టుతో ససేమిరా అంటోంది.

పీసీబీకి తమ దేశంలోనే అన్ని మ్యాచ్‌లను నిర్వహించాలంటూ కఠినమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ కూడా దేశం వెలుపల ఒక్క మ్యాచ్ కూడా జరగకూడదని నిర్ణయించింది. “మా దేశం నుంచి ఒక్క మ్యాచ్‌ కూడా తరలించకూడదని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది,” అని పీసీబీ అధికారి వెల్లడించారు.

ఈ వివాదంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ తన యూట్యూబ్ వీడియోలో కూడా హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించకూడదని పీసీబీపై ప్రభుత్వం కట్టడి చేస్తోందని తెలిపారు. ఒకవేళ పీసీబీ హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించకపోతే, ఐసీసీ టోర్నమెంట్‌ను దక్షిణాఫ్రికాకు తరలించే అవకాశం కూడా ఉందని సమాచారం. ఈ పరిస్థితుల్లో ఐసీసీ, భారత్, పాకిస్థాన్‌ల మధ్య సవాళ్లు కొనసాగుతుండగా, ప్రపంచ క్రికెట్‌కు ఎదురవుతున్న ఈ సంక్షోభానికి ఎలాంటి పరిష్కారం దొరకుతుందో చూడాలి.

Satya

Recent Posts

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

58 minutes ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

2 hours ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

3 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

5 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

5 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

7 hours ago