ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఎవరు గెలుస్తారు అనే దాని కంటే కూడా, అసలు భారత్ ఈ మ్యాచ్ టోర్నీలో పాల్గొంటుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. భద్రతా కారణాల వల్ల పాకిస్థాన్లో మ్యాచ్లు ఆడేందుకు భారత్ నిరాకరించడంతో, ఈ పరిణామం ఛాంపియన్స్ ట్రోఫీ జరగడంపై సందిగ్ధతకు దారితీస్తోంది. ట్రోఫీ కోసం భారత్ పాకిస్థాన్ వెళ్లబోదని బీసీసీఐ ఇదివరకే స్పష్టంగా చెప్పింది. అయితే సజావుగా టోర్నమెంట్ సాగేందుకు ఒక మంచి సలహా కూడా ఇచ్చింది.
బీసీసీఐ ప్రతిపాదన ప్రకారం హైబ్రిడ్ మోడల్ విధానంలో తమ మ్యాచ్లను యూఏఈలో నిర్వహించాలని సూచించింది. అయితే ఈ విషయాన్ని ఐసీసీ ఇప్పటికే పీసీబీకి తెలియజేసింది. కానీ, పీసీబీ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఈ వివాదం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ మోడల్ విషయంలో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. మధ్యలో పాకిస్థాన్ ప్రభుత్వం భారత్ కండిషన్ ముందు తగ్గకూడదు అన్నట్లు మొండి పట్టుతో ససేమిరా అంటోంది.
పీసీబీకి తమ దేశంలోనే అన్ని మ్యాచ్లను నిర్వహించాలంటూ కఠినమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ కూడా దేశం వెలుపల ఒక్క మ్యాచ్ కూడా జరగకూడదని నిర్ణయించింది. “మా దేశం నుంచి ఒక్క మ్యాచ్ కూడా తరలించకూడదని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది,” అని పీసీబీ అధికారి వెల్లడించారు.
ఈ వివాదంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ తన యూట్యూబ్ వీడియోలో కూడా హైబ్రిడ్ మోడల్ను అంగీకరించకూడదని పీసీబీపై ప్రభుత్వం కట్టడి చేస్తోందని తెలిపారు. ఒకవేళ పీసీబీ హైబ్రిడ్ మోడల్ను అంగీకరించకపోతే, ఐసీసీ టోర్నమెంట్ను దక్షిణాఫ్రికాకు తరలించే అవకాశం కూడా ఉందని సమాచారం. ఈ పరిస్థితుల్లో ఐసీసీ, భారత్, పాకిస్థాన్ల మధ్య సవాళ్లు కొనసాగుతుండగా, ప్రపంచ క్రికెట్కు ఎదురవుతున్న ఈ సంక్షోభానికి ఎలాంటి పరిష్కారం దొరకుతుందో చూడాలి.
This post was last modified on November 13, 2024 6:18 pm
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…