Trends

మారిటోరియం ‘వడ్డీంపు’.పై..కేంద్రం గుడ్ న్యూస్

కరోనా మహమ్మారితో విధించిన లాక్ డౌన్ వల్ల దేశ ఆర్థిక రంగం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎందరో ఉద్యోగాలు కోల్పోయి…మరెన్నో వ్యాపారాలు దివాలా తీసి….చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఈఎంఐలు చెల్లిస్తున్న వారికి 6 నెలలపాటు మారిటోరియం విధించేలా వెసులుబాటు కల్పించింది ఆర్‌బీఐ.

అయితే మారిటోరియం వ్యవధిలో నిలిచిపోయిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేస్తామని బ్యాంకులు ప్రకటించడంతో ప్రజల నడ్డి విరిగినంత పనైంది. కరోనా కాలంలో కరువు తాండిస్తున్న సమయంలో అసలు కట్టేందుకే దిక్కుతోచకుంటే….బ్యాంకులు వడ్డీపై వడ్డీ వసూలు సరైంది కాదని సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై గతంలో విచారణ జరిపిన సుప్రీం….రుణగ్రహీతలపై వడ్డీ భారం పడకుండాచర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, ఆర్‌బీఐలను ఆదేశించింది.

ఈ నేపథ్యంలో మారిటోరియంపై వడ్డీ విషయంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మారిటోరియంపై వడ్డీని మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని సుప్రీంకు కేంద్రం తెలిపింది. మార్చి, ఆగస్టు మధ్యకాలంలో వాయిదాలు చెల్లించిన వారికి కూడా వడ్డీ మాఫీ వర్తిస్తుందని కేంద్రం చెప్పింది. వడ్డీపై వడ్డీని మాఫీ చేయడం వల్ల ప్రజలపై పడే భారాన్ని భరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని సుప్రీంకోర్టుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అఫిడవిట్ సమర్పించింది.

రూ.2 కోట్ల వరకు ఎంఎస్ఎంఈ, వ్యక్తిగత రుణాలు, విద్య, గృహ, వినియోగదారుల రుణాలు, క్రెడిట్ కార్డ్ బకాయిలు, ఆటో రుణాలు వంటి అన్నింటిపై వడ్డీపై వడ్డీ మాఫీ అవుతుందనిక కేంద్రం స్పష్టం చేసింది. కేంద్తం తాజా నిర్ణయంతో రుణగ్రహీతలకు ఉపశమనం కలిగిందని చెప్పవచ్చు.

This post was last modified on October 3, 2020 12:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బ‌డ్జెట్ విష‌యంలో జ‌గ‌న్ మౌనం.. రీజ‌నేంటి..!

తాజాగా కేంద్రం ప్ర‌వేశ పెట్టిన వార్షిక బ‌డ్జెట్‌ పై అన్ని వ‌ర్గాలు స్పందించాయి. రాజ‌కీయ వ‌ర్గాల నుంచి పారిశ్రామిక వ‌ర్గాల…

3 minutes ago

బన్నీ ఆబ్సెంట్ – ఒక ప్లస్సు ఒక మైనస్సు

నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తండేల్ రాజ్ ని పుష్పరాజ్ కలుసుకోవడాన్ని చూసి ఆనందిద్దామని ఎదురు చూసిన…

7 minutes ago

చంద్రబాబు భూమికే ఎసరు పెట్టేశారే!

వైసీపీ పాలనలో ఏపీలో భూముల అన్యాక్రాంతం యథేచ్చగా సాగిందన్న ఆరోపణలు ఒకింత గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి…

2 hours ago

ఈ చిన్ని పండు వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?

పియర్ పండు, లేదా బేరిపండు, రుచిలో మధురమైనది మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ పండు…

4 hours ago

స‌ల‌హాదారులు వ‌చ్చేస్తున్నారు.. బాబు తాంబూలం వారికే.. !

రాష్ట్రంలోని కూట‌మి స‌ర్కారు ఇప్ప‌టి వ‌ర‌కు నామినేటెడ్ ప‌ద‌వుల‌ను మాత్ర‌మే భ‌ర్తీ చేస్తోంది. అయితే.. ఈ క్ర‌మంలో సీఎం విచ‌క్ష‌ణ…

8 hours ago

విజ‌య వార‌ధి రెడ్డి.. విజ‌య‌మ్మ ఎంట్రీ..?

"రాజకీయాలు కుళ్లిపోయాయి. ఆయ‌న మా తండ్రి అని చెప్పుకొనేందుకు సిగ్గుప‌డుతున్నా" ఓ 15 ఏళ్ల కింద‌ట క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన రాజ‌కీయం…

9 hours ago