కరోనా కేసులు, మరణాల లెక్కల్ని చాలా తేలిగ్గా తీసుకునే పరిస్థితికి వచ్చేశాం. ఒకప్పుడు ఎక్కడో వీధి చివర ఒక కరోనా కేసు ఉందంటేనే వణికిపోయేవాళ్లం. కానీ ఇప్పుడు ఎదురింట్లో కరోనా పేషెంట్ ఉన్నా మామూలుగానే ఉంటున్నాం. మన ఇంట్లో వాళ్లకు కరోనా వస్తే తప్ప భయపడట్లేదు. బయట ఎలా పడితే అలా స్వేచ్ఛగా తిరిగేస్తున్నాం. అన్ని పనులూ యధావిధిగా చేసుకుపోతున్నాం.
ఐతే జనాలు లైట్ తీసుకుని ఉండొచ్చు కానీ.. దేశంలో కరోనా విలయం మాత్రం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇండియాలో కరోనా మహమ్మారి ఒక దిగ్భ్రాంతికర మైలురాయిని అందుకుంది. మన దేశంలో ఇప్పటిదాకా కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య లక్షకు చేరుకుంది. శుక్రవారం లేట్ నైట్ ఈ లక్షవ కరోనా మరణం నమోదైంది ఇండియా.
ప్రపంచవ్యాప్తంగా లక్ష కరోనా మరణాల మార్కును అందుకున్న మూడో దేశం ఇండియా. అమెరికాలో ఈ మహమ్మారి వల్ల ఇప్పటిదాకా 2.08 లక్షల మంది చనిపోగా.. బ్రెజిల్లో కరోనా మరణాల సంఖ్య 1.45 లక్షలుగా ఉంది. శుక్రవారం కూడా ఇండియాలో వెయ్యి మందికి పైగానే చనిపోయారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 64 లక్షల దాకా ఉండగా.. శుక్రవారం 81 వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి.
మొత్తం లక్ష మరణాల్లో మూడో వంతుకు పైగా, అంటే 37 వేల పైచిలుకు చనిపోయింది ఒక్క మహారాష్ట్రలోనే. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా 7 లక్షల కేసులు నమోదవగా.. 5870 మంది దాకా మరణించారు. తెలంగాణలో కేసుల సంఖ్య 2 లక్షలకు చేరువలో ఉండగా.. మరణాల సంఖ్య 1,145. ఇండియాలో ఇప్పటిదాకా 53.5 లక్షల మంది కరోనా నుంచి కోలుకోగా.. 9 లక్షల దాకా యాక్టివ్ కేసులున్నాయి. ఒక దశలో రోజువారీ కేసులు లక్ష మార్కుకు చేరువగా వెళ్లగా.. ఆ తర్వాత కొంచెం తగ్గి 80 వేలకు అటు ఇటుగా కేసులు నమోదవుతున్నాయి.
This post was last modified on October 3, 2020 12:27 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…