Trends

ఇండియాలో కరోనా.. ఒక దిగ్భ్రాంతికర అంకె

కరోనా కేసులు, మరణాల లెక్కల్ని చాలా తేలిగ్గా తీసుకునే పరిస్థితికి వచ్చేశాం. ఒకప్పుడు ఎక్కడో వీధి చివర ఒక కరోనా కేసు ఉందంటేనే వణికిపోయేవాళ్లం. కానీ ఇప్పుడు ఎదురింట్లో కరోనా పేషెంట్ ఉన్నా మామూలుగానే ఉంటున్నాం. మన ఇంట్లో వాళ్లకు కరోనా వస్తే తప్ప భయపడట్లేదు. బయట ఎలా పడితే అలా స్వేచ్ఛగా తిరిగేస్తున్నాం. అన్ని పనులూ యధావిధిగా చేసుకుపోతున్నాం.

ఐతే జనాలు లైట్ తీసుకుని ఉండొచ్చు కానీ.. దేశంలో కరోనా విలయం మాత్రం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇండియాలో కరోనా మహమ్మారి ఒక దిగ్భ్రాంతికర మైలురాయిని అందుకుంది. మన దేశంలో ఇప్పటిదాకా కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య లక్షకు చేరుకుంది. శుక్రవారం లేట్ నైట్ ఈ లక్షవ కరోనా మరణం నమోదైంది ఇండియా.

ప్రపంచవ్యాప్తంగా లక్ష కరోనా మరణాల మార్కును అందుకున్న మూడో దేశం ఇండియా. అమెరికాలో ఈ మహమ్మారి వల్ల ఇప్పటిదాకా 2.08 లక్షల మంది చనిపోగా.. బ్రెజిల్‌లో కరోనా మరణాల సంఖ్య 1.45 లక్షలుగా ఉంది. శుక్రవారం కూడా ఇండియాలో వెయ్యి మందికి పైగానే చనిపోయారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 64 లక్షల దాకా ఉండగా.. శుక్రవారం 81 వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి.

మొత్తం లక్ష మరణాల్లో మూడో వంతుకు పైగా, అంటే 37 వేల పైచిలుకు చనిపోయింది ఒక్క మహారాష్ట్రలోనే. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటిదాకా 7 లక్షల కేసులు నమోదవగా.. 5870 మంది దాకా మరణించారు. తెలంగాణలో కేసుల సంఖ్య 2 లక్షలకు చేరువలో ఉండగా.. మరణాల సంఖ్య 1,145. ఇండియాలో ఇప్పటిదాకా 53.5 లక్షల మంది కరోనా నుంచి కోలుకోగా.. 9 లక్షల దాకా యాక్టివ్ కేసులున్నాయి. ఒక దశలో రోజువారీ కేసులు లక్ష మార్కుకు చేరువగా వెళ్లగా.. ఆ తర్వాత కొంచెం తగ్గి 80 వేలకు అటు ఇటుగా కేసులు నమోదవుతున్నాయి.

This post was last modified on October 3, 2020 12:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బన్నీ – దేవి : ఆరు మెలోడీల లవ్ స్టోరీ

అల్లు అర్జున్‌కు కెరీర్లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా.. ఆర్య. అదో అందమైన ప్రేమకథ. ఈ చిత్రంతోనే అతను స్టార్…

2 minutes ago

ఆయ‌న ‘ఎన్నిక‌ల’ గాంధీ: కేటీఆర్ సెటైర్లు

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన కుల గ‌ణ‌న‌, ఎస్సీ రిజ‌ర్వేషన్ వ‌ర్గీక‌ర‌ణ‌పై బీఆర్ఎస్ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీ మంత్రి…

34 minutes ago

స్టార్ పిల్లలను పట్టించుకోవడం లేదబ్బా

మాములుగా స్టార్ వారసులంటే జనంలో పిచ్చ క్రేజ్ ఉంటుంది. తాము అభిమానించే హీరోల పిల్లలు తెరమీద ఎలా కనిపిస్తారనే ఉత్సహంతో…

37 minutes ago

టీటీడీలో అన్యమత ఉద్యోగుల బదిలీ

జగన్ హయాంలో తిరుపతి, తిరుమల ప్రతిష్ట మసకబారిందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో అవకతవకలు జరిగాయని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన…

38 minutes ago

తండేల్ రేట్ల పెంపుపై హాట్ డిస్కషన్లు

ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది.…

2 hours ago

చంద్రబాబు మార్క్… తెలుగులో తొలి జీవో విడుదల

దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…

2 hours ago