ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన రష్యా కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించిన మరో ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రయోగ ఫలితాల్ని పరిమిత స్థాయిలో పూర్తి చేసి.. తన వ్యాక్సిన్ గురించి ప్రపంచానికి గొప్పలు చెబుతున్న రష్యా.. తాజాగా తన వ్యాక్సిన్ (స్పుత్నిక్)ను మాస్కో మహానగరంలోని సాధారణ ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. ఈ వ్యాక్సిన్ కోసం భారత్ ను రష్యా కోరుతున్న రెండు కోరికలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తాము తయారు చేసిన వ్యాక్సిన్ ప్రొడక్షన్ తో పాటు.. మూడో దశ ట్రయల్స్ ను భారత్ లో చేపడతామని ఆ దేశం భారత సర్కారును కోరుతోంది. మూడో దశ ప్రయోగాలు చాలా పరిమితంగా చేసిన నేపథ్యంలో.. ఆ వ్యాక్సిన్ ఎలా పని చేస్తుందన్న క్లినికల్ టెస్టులు భారత్ లో నిర్వహించాలని రష్యా భావిస్తోంది.
దీంతో.. క్లీనికల్ పరీక్షలు భారత్ లో చేసేందుకు వీలుగా కేంద్రాన్ని కోరింది రష్యా. ఆ దేశ విన్నపాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ చురుగ్గా పరిశీలిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకునే వీలుంది.
అంతేకాదు.. తాము రూపొందించిన వ్యాక్సిన్ తయారీని సైతం భారత్ లోనే చేపట్టాలని రష్యా భావిస్తోంది. రష్యా ప్రయత్నాలకు సానుకూలంగా దేశీయ ఫార్మా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. వ్యాక్సిన్ ప్రొడక్షన్ లో భారత్ కున్న అవకాశాలు ఏ స్థాయి అన్న విషయం రష్యా తాజా రిక్వెస్టును చూస్తే ఇట్టే అర్థమైపోతుందని చెప్పాలి.
This post was last modified on September 9, 2020 10:15 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…