Top Rated

ప‌వ‌న్ అభిమానుల ఒళ్లు మండించేసిన బీజేపీ

ప‌వ‌న్ అభిమానులు భ‌య‌ప‌డిందే జ‌రిగేట్లుంది. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు గండి కొట్టిన బీజేపీ.. తిరుప‌తి ఉప ఎన్నిక‌లోనూ ఆ పార్టీకి మొండి చేయి చూపించేట్లే ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించిన ఒక్క రోజుకే ఆయ‌న పార్టీని ఎన్నిక‌ల బ‌రి నుంచి ఉప‌సంహ‌రింప‌జేయ‌డం, ఆ త‌ర్వాత జ‌న‌సేన‌తో త‌మ‌కు పొత్తు లేద‌ని ఆ పార్టీ నేత మాట్లాడ‌టం ప‌వ‌న్ అభిమానుల‌ను ఎంత‌గా బాధించిందో తెలిసిందే.

ఐతే పెద్ద‌గా బ‌లం లేని జీహెచ్ఎంసీ ప‌రిధిలో జ‌రిగిన ఎన్నిక‌లు కాబ‌ట్టి వాళ్లు కొంచెం తేలిగ్గానే తీసుకున్నారు. కానీ బీజేపీతో పోలిస్తే ఎంతో మెరుగైన స్థితిలో ఉన్న తిరుప‌తిలోనూ ఉప ఎన్నిక‌లో జ‌న‌సేన‌కు అవ‌కాశం లేకుండా చేస్తుండ‌టం మాత్రం ఇప్పుడు ప‌వ‌న్ అభిమానులు త‌ట్టుకోలేని విష‌య‌మే. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థే పోటీ చేస్తార‌ని ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు అత్యుత్సాహంతో ప్ర‌క‌ట‌న చేయ‌డం ఇప్పుడు వివాదం రేపుతోంది.

కొద్దిరోజుల కిందట ఢిల్లీ వెళ్లిన పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చ‌ర్చించిన అనంత‌రం తిరుపతి ఎన్నికలో పోటీ చేసే అభ్య‌ర్థి విష‌య‌మై ఇరు పార్టీల త‌ర‌ఫున‌ ఓ కమిటీ వేసి.. కమిటీలో ఏకాభిప్రాయం సాధించి, ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించారు. అభ్యర్థి బీజేపీ నుంచా లేక జనసేన నుంచా అనేది కమిటీ నిర్ణయిస్తుందని ప‌వ‌న్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఐతే ఆ క‌మిటీ ఏం చ‌ర్చించిందో, ఏం నిర్ణ‌యించిందో తెలియ‌దు. ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న అంటూ ఏమీ లేదు.

ఈలోపే తిరుప‌తిలో బీజేపీ అభ్య‌ర్థి పోటీ చేస్తార‌ని సోము వీర్రాజు ప్ర‌క‌టించ‌డం జ‌న‌సేన‌ను, ప‌వ‌న్‌ను అవ‌మానించేదే. గ‌త ఏడాది తిరుప‌తి లోక్‌స‌భ స్థానానికి జ‌రిగిన ఎన్నిక‌లో నోటా కంటే త‌క్కువ‌గా కేవ‌లం 1.23 శాతం (18 వేల లోపే) ఓట్లు సాధించింది బీజేపీ. అక్క‌డ జ‌న‌సేన అభ్య‌ర్థి పోటీలో లేరు. మొత్తంగా ఏపీలో బీజేపీకి వ‌చ్చిన ఓట్ల శాతం 1 ప‌ర్సంట్ కూడా లేదు. జ‌న‌సేన‌కు దాదాపు 7 శాతం ఓట్లొచ్చాయి. తిరుప‌తిలో ప‌వ‌న్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి చోట త‌మ పార్టీ అభ్య‌ర్థి పోటీలో ఉంటాడ‌ని ఏక‌ప‌క్షంగా ప్ర‌క‌ట‌న చేయ‌డం ప‌వ‌న్ అభిమానుల‌కు ఒళ్లు మండిస్తోంది.

This post was last modified on December 13, 2020 8:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

3 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

3 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

4 hours ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

4 hours ago

చావానే టార్గెట్… అంత సీన్ లేదు రాజా

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…

5 hours ago

తరుణ్ క్యాలికులేషన్ ఎక్కడ తప్పుతోంది

పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…

7 hours ago