పవన్ అభిమానులు భయపడిందే జరిగేట్లుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనకు గండి కొట్టిన బీజేపీ.. తిరుపతి ఉప ఎన్నికలోనూ ఆ పార్టీకి మొండి చేయి చూపించేట్లే ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ ప్రకటించిన ఒక్క రోజుకే ఆయన పార్టీని ఎన్నికల బరి నుంచి ఉపసంహరింపజేయడం, ఆ తర్వాత జనసేనతో తమకు పొత్తు లేదని ఆ పార్టీ నేత మాట్లాడటం పవన్ అభిమానులను ఎంతగా బాధించిందో తెలిసిందే.
ఐతే పెద్దగా బలం లేని జీహెచ్ఎంసీ పరిధిలో జరిగిన ఎన్నికలు కాబట్టి వాళ్లు కొంచెం తేలిగ్గానే తీసుకున్నారు. కానీ బీజేపీతో పోలిస్తే ఎంతో మెరుగైన స్థితిలో ఉన్న తిరుపతిలోనూ ఉప ఎన్నికలో జనసేనకు అవకాశం లేకుండా చేస్తుండటం మాత్రం ఇప్పుడు పవన్ అభిమానులు తట్టుకోలేని విషయమే. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థే పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అత్యుత్సాహంతో ప్రకటన చేయడం ఇప్పుడు వివాదం రేపుతోంది.
కొద్దిరోజుల కిందట ఢిల్లీ వెళ్లిన పవన్కల్యాణ్, నాదెండ్ల మనోహర్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించిన అనంతరం తిరుపతి ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి విషయమై ఇరు పార్టీల తరఫున ఓ కమిటీ వేసి.. కమిటీలో ఏకాభిప్రాయం సాధించి, ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించారు. అభ్యర్థి బీజేపీ నుంచా లేక జనసేన నుంచా అనేది కమిటీ నిర్ణయిస్తుందని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఐతే ఆ కమిటీ ఏం చర్చించిందో, ఏం నిర్ణయించిందో తెలియదు. ఉమ్మడి ప్రకటన అంటూ ఏమీ లేదు.
ఈలోపే తిరుపతిలో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని సోము వీర్రాజు ప్రకటించడం జనసేనను, పవన్ను అవమానించేదే. గత ఏడాది తిరుపతి లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికలో నోటా కంటే తక్కువగా కేవలం 1.23 శాతం (18 వేల లోపే) ఓట్లు సాధించింది బీజేపీ. అక్కడ జనసేన అభ్యర్థి పోటీలో లేరు. మొత్తంగా ఏపీలో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 1 పర్సంట్ కూడా లేదు. జనసేనకు దాదాపు 7 శాతం ఓట్లొచ్చాయి. తిరుపతిలో పవన్కు మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి చోట తమ పార్టీ అభ్యర్థి పోటీలో ఉంటాడని ఏకపక్షంగా ప్రకటన చేయడం పవన్ అభిమానులకు ఒళ్లు మండిస్తోంది.
This post was last modified on December 13, 2020 8:45 pm
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…