Top Rated

ప‌వ‌న్ అభిమానుల ఒళ్లు మండించేసిన బీజేపీ

ప‌వ‌న్ అభిమానులు భ‌య‌ప‌డిందే జ‌రిగేట్లుంది. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు గండి కొట్టిన బీజేపీ.. తిరుప‌తి ఉప ఎన్నిక‌లోనూ ఆ పార్టీకి మొండి చేయి చూపించేట్లే ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించిన ఒక్క రోజుకే ఆయ‌న పార్టీని ఎన్నిక‌ల బ‌రి నుంచి ఉప‌సంహ‌రింప‌జేయ‌డం, ఆ త‌ర్వాత జ‌న‌సేన‌తో త‌మ‌కు పొత్తు లేద‌ని ఆ పార్టీ నేత మాట్లాడ‌టం ప‌వ‌న్ అభిమానుల‌ను ఎంత‌గా బాధించిందో తెలిసిందే.

ఐతే పెద్ద‌గా బ‌లం లేని జీహెచ్ఎంసీ ప‌రిధిలో జ‌రిగిన ఎన్నిక‌లు కాబ‌ట్టి వాళ్లు కొంచెం తేలిగ్గానే తీసుకున్నారు. కానీ బీజేపీతో పోలిస్తే ఎంతో మెరుగైన స్థితిలో ఉన్న తిరుప‌తిలోనూ ఉప ఎన్నిక‌లో జ‌న‌సేన‌కు అవ‌కాశం లేకుండా చేస్తుండ‌టం మాత్రం ఇప్పుడు ప‌వ‌న్ అభిమానులు త‌ట్టుకోలేని విష‌య‌మే. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థే పోటీ చేస్తార‌ని ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు అత్యుత్సాహంతో ప్ర‌క‌ట‌న చేయ‌డం ఇప్పుడు వివాదం రేపుతోంది.

కొద్దిరోజుల కిందట ఢిల్లీ వెళ్లిన పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చ‌ర్చించిన అనంత‌రం తిరుపతి ఎన్నికలో పోటీ చేసే అభ్య‌ర్థి విష‌య‌మై ఇరు పార్టీల త‌ర‌ఫున‌ ఓ కమిటీ వేసి.. కమిటీలో ఏకాభిప్రాయం సాధించి, ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించారు. అభ్యర్థి బీజేపీ నుంచా లేక జనసేన నుంచా అనేది కమిటీ నిర్ణయిస్తుందని ప‌వ‌న్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఐతే ఆ క‌మిటీ ఏం చ‌ర్చించిందో, ఏం నిర్ణ‌యించిందో తెలియ‌దు. ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న అంటూ ఏమీ లేదు.

ఈలోపే తిరుప‌తిలో బీజేపీ అభ్య‌ర్థి పోటీ చేస్తార‌ని సోము వీర్రాజు ప్ర‌క‌టించ‌డం జ‌న‌సేన‌ను, ప‌వ‌న్‌ను అవ‌మానించేదే. గ‌త ఏడాది తిరుప‌తి లోక్‌స‌భ స్థానానికి జ‌రిగిన ఎన్నిక‌లో నోటా కంటే త‌క్కువ‌గా కేవ‌లం 1.23 శాతం (18 వేల లోపే) ఓట్లు సాధించింది బీజేపీ. అక్క‌డ జ‌న‌సేన అభ్య‌ర్థి పోటీలో లేరు. మొత్తంగా ఏపీలో బీజేపీకి వ‌చ్చిన ఓట్ల శాతం 1 ప‌ర్సంట్ కూడా లేదు. జ‌న‌సేన‌కు దాదాపు 7 శాతం ఓట్లొచ్చాయి. తిరుప‌తిలో ప‌వ‌న్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి చోట త‌మ పార్టీ అభ్య‌ర్థి పోటీలో ఉంటాడ‌ని ఏక‌ప‌క్షంగా ప్ర‌క‌ట‌న చేయ‌డం ప‌వ‌న్ అభిమానుల‌కు ఒళ్లు మండిస్తోంది.

This post was last modified on December 13, 2020 8:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

5 minutes ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

28 minutes ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

48 minutes ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

1 hour ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

1 hour ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

2 hours ago