Top Rated

హైదరాబాదోళ్లు అనుభవించాల్సిందే..

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లే పట్టి మళ్లీ ఊపందుకున్నాయి. కొన్ని రోజులుగా సింగిల్ డిజిట్లో కేసులు నమోదవుతుండటం.. ఈ మధ్య ఒక రోజు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం రెండు కేసులే నమోదు కావడంతో హమ్మయ్యా అనుకున్నారంతా. దీంతో త్వరలోనే తెలంగాణ కరోనా ఫ్రీ అవుతుందని ఆశించారు.

కానీ గురువారం మళ్లీ కరోనా తీవ్రత పెరిగింది. ఒకేసారి 22 కేసులు నమోదయ్యాయి. ఈ 22 కేసులూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కావడం గమనార్హం. గత కొన్ని రోజుల కేసులు పరిశీలిస్తే మెజారిటీ హైదరాబాద్ పరిధిలో నమోదైనవే.

ఆ ఏరియా, ఈ ఏరియా అని కాకుండా హైదరాబాద్ అంతటా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం నగరం మొత్తాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించింది. మే 2 తర్వాత సడలింపులు ఉంటాయని ఆశించిన హైదరాబాదీ వాసులకు నిరాశ తప్పదని స్పష్టం అయిపోయింది.

తెలంగాణలో మిగతా ప్రాంతాల్లో పాక్షికంగా లాక్ డౌన్‌ను సడలించడం ఖాయంగా కనిపిస్తోంది. రెడ్‌ జోన్‌గా పేర్కొంటున్న హైదరాబాద్‌లో 3వ తేదీ తర్వాత కూడా కనీసం రెండు వారాల పాటు ఆంక్షలు కొనసాగడం తప్పకపోవచ్చు. ఇక రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కరోనా ప్రభావం ఎలా ఉందని గమనిస్తే. ఇప్పటిదాకా వరంగల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో అసలు కరోనా కేసు అన్నదే లేదు.

ప్రస్తుతం పది జిల్లాల్లో కరోనా యాక్టివ్ కేసులు లేవు. అవి.. సిద్ధి పేట, మహబూబాబాద్, మంచిర్యాల, నారాయణపేట, పెద్దపల్లి, భద్రాద్రి, నాగర్ కర్నూల్, ములుగు, సంగారెడ్డి, జగిత్యాల. గత 15 రోజులులగా కొత్త కరోనా కేసులు లేని జిల్లాలు ఐదు. అవి.. కరీంనగర్, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి. మొత్తంగా పరిస్థితి చూస్తే తెలంగాణలో జిల్లాల పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. హైదరాబాద్ వాసులు మాత్రం ఇంకొన్ని వారాల పాటు లాక్ డౌన్ కష్టాలు అనుభవించక తప్పదన్నది స్పష్టం.

This post was last modified on May 1, 2020 1:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

26 minutes ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

2 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

3 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

4 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

4 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

4 hours ago