పీరియాడిక్ కథలో అల్లు అర్జున్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా శుక్రవారం నాడు విడుదలైన సంగతి తెలిసిందే. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ‘పుష్ప’ సినిమా సెకండ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ జరగనుంది. వీలైనంత త్వరగా పార్ట్ 2ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

నిజానికి పార్ట్ 2 కంటే ముందుగా బన్నీ మరో సినిమా చేయాలనుకున్నారు. కానీ లుక్ ని మార్చుకోవాల్సి వస్తుందని.. ఆ ఆలోచన పక్కన పెట్టేశారు. అయితే ఈ సినిమాను పూర్తి చేసిన తరువాత బన్నీ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇదొక పీరియాడిక డ్రామా అని తెలుస్తోంది. ఇండియాకు స్వాతంత్య్రం రాకముందు కాలానికి చెందిన కథ ఇది. ఈ కాన్సెప్ట్ బన్నీకి బాగా నచ్చిందట. ఇప్పటికే బోయపాటి స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

‘పుష్ప’ పార్ట్ 2 షూటింగ్ పూర్తయిన వెంటనే.. బన్నీ గ్యాప్ తీసుకోకుండా బోయపాటి సినిమాను మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమా అని సమాచారం. గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది.