Political News

కోదండం మాష్టారికి కాంగ్రెస్ మద్దతు.. గేమ్ ప్లాన్ ఏమిటి?

తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించటమే కాదు.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించిన టీజేఎస్ పార్టీ వ్యవస్థాపకుడు కోదండం మాష్టారు తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవాలని భావించటం తెలిసిందే. ఇందులో భాగంగా చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అన్ని పార్టీలతోనూ.. ప్రజాసంఘాల మద్దతును కోరుతున్న సంగతి తెలిసిందే.

చివరకు జాతీయ స్థాయిలో తాను వ్యతిరేకించే బీజేపీ మద్దతును కూడా ఆయన కోరటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఓవైపు బీజేపీ మద్దతును కోరిన కోదండం మాష్టారు.. మరోవైపు కాంగ్రెస్ మద్దతు కూడా కోరటం గమనార్హం.

నల్గొండ.. వరంగల్.. ఖమ్మం జిల్లాలకు కలిపి నిర్వహించే పట్టభద్రుల ఎన్నికల్లో బరిలోకి దిగాలని బలంగా భావిస్తున్న కోదండం మాష్టారు.. భారీ ఎత్తున గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. మాములు ఎన్నికల్లో తన సత్తా చాటే టీఆర్ఎస్.. ఎమ్మెల్సీ ఎన్నికలు.. అందునా పట్టభద్రుల ఎన్నికల్లో మాత్రం తన బలాన్ని ప్రదర్శించలేదన్న విమర్శ ఉంది. అందుకు తగ్గట్లే గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉండటాన్ని మర్చిపోకూడదు.

దీన్నో అవకాశంగా తీసుకొని.. చట్టసభల్లోకి తాను ఎంట్రీ ఇవ్వాలని కోదండం మాష్టారు భావిస్తున్నట్లు చెబుతున్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఉద్యమకాలంలో కీలకంగా వ్యవహరించిన వారంతా ఇప్పుడు టీఆర్ఎస్ కు దూరమైనట్లుగా కోదండం మాష్టారు భావిస్తున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరిపై విద్యార్థులు.. నిరుద్యోగులు.. ఉన్నత విద్యావంతులు గుర్రుగా ఉన్నట్లు భావిస్తున్నారు. వీరంతా తన గెలుపుకు సాయంగా నిలుస్తారన్నది ఆయన అంచనా.

ఇదిలా ఉంటే.. తాజాగా కాంగ్రెస్ మద్దతు కోరిన నేపథ్యంలో.. కోదండం మాష్టారికి ఆ పార్టీ అండగా నిలుస్తుందా? అన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే జాతీయ స్థాయిలో తమ ప్రత్యర్థి అయిన బీజేపీ మద్దతును కోదండం మాష్టారు కోరటంతో ఆ పార్టీ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. బీజేపీ మద్దతు లేకుండా తమ మద్దతుతో కోదండం మాష్టారు బరిలోకి నిలిస్తే మద్దతు ఇవ్వాలన్నట్లుగా సమాచారం.

అయితే.. అందుకు కాంగ్రెస్ లో ఎస్ అనే వారితో పాటు.. నో చెబుతున్న వారు లేకపోలేరని చెబుతున్నారు. కోదండం మాష్టారి మీద ఉన్న అభిమానంతో ఆయన పోటీ చేస్తున్న స్థానం నుంచి తాము బరిలోకి దిగకుండా సహకారం తీసుకొని.. మిగిలిన ఎన్నికల్లో ఆయన పార్టీ మద్దతు కోరితే బాగుంటుందన్న మాట కొందరు ప్రతిపాదించగా.. మరికొందరు నేతలు తప్పు పట్టినట్లుగా తెలుస్తోంది.

2018లో జరిగిన ఎన్నికల్లో కోదండం మాష్టారి టీజేఎస్ ఎలాంటి ప్రభావం చూపించని నేపథ్యంలో.. ఆ పార్టీ కారణంగా తమకు ఎలాంటి ప్రయోజనం లభించదని.. అలాంటప్పుడు ఆయనకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏమిటన్న చర్చ కూడా కాంగ్రెస్ లో నడుస్తోంది. అయితే.. మాష్టారి ప్రతిపాదనను..కాంగ్రెస్ అధిష్ఠానం ముందు పెడదామని.. అక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే.. దాన్ని ఫాలో అవుదామన్న మాటకు కాంగ్రెస్ నేతలు ఓకే అన్నట్లుగా తెలుస్తోంది. మరి.. కోదండం మాష్టారికి కాంగ్రెస్ మద్దతు ఉంటుందా? లేదా? అన్నది అధినాయకత్వం తేల్చాల్సి ఉంటుంది.

Satya

Recent Posts

ఒక నయనతార.. ఒక త్రిష.. ఒక నివేథా

కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…

1 hour ago

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

3 hours ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

4 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

4 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

4 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

5 hours ago