Political News

వైసీపీకి సెగ‌: కార్యాల‌యాలు క‌నిపించ‌డం లేదు

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీకి మ‌రో స‌మ‌స్య ఎదుర‌వుతోంది. ఒక‌వైపు పార్టీ నుంచి నాయ‌కులు ర‌న్ రాజా ర‌న్ అన్న‌ట్టుగా పొరుగు పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. మ‌రికొంద‌రు మౌనంగా ఉన్నారు. ఇంకొంద‌రు అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే.. పార్టీ అధినేత జ‌గ‌న్ మాత్రం ఇవ‌న్నీ తెలిసి కూడా చాలా నింపాదిగా ఉంటున్నారు. అస‌లు ఏమీ జ‌ర‌గ‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తు న్నారు. ఫీల్ గుడ్ థియ‌రీ నుంచి ఆయ‌న బ‌య‌ట‌కు రాలేదు.

ఇక, ఇప్పుడు మ‌రో కీల‌క‌మైన వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది. పార్టీ ఓట‌మి పాలైన నాలుగు మాసాల్లోనే కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ కార్యాల‌యాల‌ను ఎత్తేస్తున్నారు. ఇలా ఎత్తేస్తున్న వారిలో మెజారిటీ నాయ‌కు లు రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వారే ఉండ‌డం మ‌రింత ఆశ్చ‌ర్యంగా ఉంది. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ప‌రిధిలో.. వైసీపీ నాయ‌కుడు పూనూరు గౌతం రెడ్డి.. త‌న సొంత ఇంటినే పార్టీ కార్యాల‌యంగా మార్చుకు న్నారు. 2014 నుంచి ఆయ‌న ఇక్క‌డే పార్టీ ఆఫీస్ నిర్వ‌హిస్తున్నారు.

కానీ, పార్టీ ఓట‌మి త‌ర్వాత‌.. త‌న ఇంటి నుంచి కార్యాల‌యాన్ని తీసేసి.. ఇంటిని అద్దెకు ఇచ్చేసుకున్నారు. దీంతో పార్టీ కార్యాల‌యం ద‌గ్గ‌ర ఉండాల్సిన పెద్ద ఎత్తున బోర్డులు, జ‌గ‌న్ బొమ్మ‌లు అన్నీ మాయ‌మై పోయాయి. ఇక, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో నాలుగు కార్యాల‌యాలు ఉంటే.. దీనిని ఒక కార్యాల‌యానికి కుదించారు. మిగిలిన మూడు చోట్ల రెంటు క‌ట్టాల్సి ఉంటుంద‌న్న కార‌ణంగా ఎత్తేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, కీల‌క‌మైన చిత్తూరుజిల్లాలోని కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న పార్టీ కార్యాల‌యం ఎప్పుడో ఎత్తేశారు.

అక్క‌డ ఇప్పుడు రోజువారి హోట‌ల్ నిర్వ‌హిస్తున్నారు. గుంటూరు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న నాలుగు పార్టీ కార్యాల‌యాల‌ను గ‌త వారం తీసేశారు. ఇక్క‌డ నుంచి పోటీ చేసిన రోశ‌య్య‌.. ఇటీవ‌ల జ‌న‌సేన‌లో చేరిపోవ‌డంతో పార్టీ కార్యాల‌యాల‌ను తీసేశారు. ఇక‌, తాజాగా మురుగుడు లావ‌ణ్య‌ను ప‌క్క‌న పెట్ట‌డంతో మంగ‌ళ‌గిరి మెయిన్ రోడ్డులో ఉన్న వైసీపీ కార్యాల‌యానికి తాళాలు వేశారు. అనంతపురంలోనూ ఇలాంటి ప‌రిస్థితే క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 15, 2024 3:20 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

చంద్ర‌బాబు నిర్ణ‌యమే.. తెలంగాణ‌కు ఊపిరా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రం చేసిన ప్ర‌తిపాద‌న తీవ్ర సంక‌ట స్థితిలోకి నెట్టేసింది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. కేంద్ర…

4 hours ago

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

6 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

13 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

14 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

14 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

16 hours ago