Political News

వైసీపీకి సెగ‌: కార్యాల‌యాలు క‌నిపించ‌డం లేదు

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీకి మ‌రో స‌మ‌స్య ఎదుర‌వుతోంది. ఒక‌వైపు పార్టీ నుంచి నాయ‌కులు ర‌న్ రాజా ర‌న్ అన్న‌ట్టుగా పొరుగు పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. మ‌రికొంద‌రు మౌనంగా ఉన్నారు. ఇంకొంద‌రు అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే.. పార్టీ అధినేత జ‌గ‌న్ మాత్రం ఇవ‌న్నీ తెలిసి కూడా చాలా నింపాదిగా ఉంటున్నారు. అస‌లు ఏమీ జ‌ర‌గ‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తు న్నారు. ఫీల్ గుడ్ థియ‌రీ నుంచి ఆయ‌న బ‌య‌ట‌కు రాలేదు.

ఇక, ఇప్పుడు మ‌రో కీల‌క‌మైన వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది. పార్టీ ఓట‌మి పాలైన నాలుగు మాసాల్లోనే కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ కార్యాల‌యాల‌ను ఎత్తేస్తున్నారు. ఇలా ఎత్తేస్తున్న వారిలో మెజారిటీ నాయ‌కు లు రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వారే ఉండ‌డం మ‌రింత ఆశ్చ‌ర్యంగా ఉంది. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ప‌రిధిలో.. వైసీపీ నాయ‌కుడు పూనూరు గౌతం రెడ్డి.. త‌న సొంత ఇంటినే పార్టీ కార్యాల‌యంగా మార్చుకు న్నారు. 2014 నుంచి ఆయ‌న ఇక్క‌డే పార్టీ ఆఫీస్ నిర్వ‌హిస్తున్నారు.

కానీ, పార్టీ ఓట‌మి త‌ర్వాత‌.. త‌న ఇంటి నుంచి కార్యాల‌యాన్ని తీసేసి.. ఇంటిని అద్దెకు ఇచ్చేసుకున్నారు. దీంతో పార్టీ కార్యాల‌యం ద‌గ్గ‌ర ఉండాల్సిన పెద్ద ఎత్తున బోర్డులు, జ‌గ‌న్ బొమ్మ‌లు అన్నీ మాయ‌మై పోయాయి. ఇక, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో నాలుగు కార్యాల‌యాలు ఉంటే.. దీనిని ఒక కార్యాల‌యానికి కుదించారు. మిగిలిన మూడు చోట్ల రెంటు క‌ట్టాల్సి ఉంటుంద‌న్న కార‌ణంగా ఎత్తేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, కీల‌క‌మైన చిత్తూరుజిల్లాలోని కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న పార్టీ కార్యాల‌యం ఎప్పుడో ఎత్తేశారు.

అక్క‌డ ఇప్పుడు రోజువారి హోట‌ల్ నిర్వ‌హిస్తున్నారు. గుంటూరు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న నాలుగు పార్టీ కార్యాల‌యాల‌ను గ‌త వారం తీసేశారు. ఇక్క‌డ నుంచి పోటీ చేసిన రోశ‌య్య‌.. ఇటీవ‌ల జ‌న‌సేన‌లో చేరిపోవ‌డంతో పార్టీ కార్యాల‌యాల‌ను తీసేశారు. ఇక‌, తాజాగా మురుగుడు లావ‌ణ్య‌ను ప‌క్క‌న పెట్ట‌డంతో మంగ‌ళ‌గిరి మెయిన్ రోడ్డులో ఉన్న వైసీపీ కార్యాల‌యానికి తాళాలు వేశారు. అనంతపురంలోనూ ఇలాంటి ప‌రిస్థితే క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 15, 2024 3:20 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

2 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

4 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

7 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

8 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

9 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

9 hours ago