తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్కు భారీ సెగ తగిలింది. కేటీఆర్ గో బ్యాక్ నినాదాలతో ఆయన ఉలిక్కి పడ్డారు. శనివారం రాత్రి మృతి చెందిన ఢిల్లీ విశ్వ విద్యాలయం మాజీ ప్రొఫెసర్ జీ. ఎన్. సాయిబాబా భౌతిక దేహాన్ని హైదరాబాద్లోని మౌలాలీలో ఉన్న ఆయన నివాసంలో ఉంచారు. అభిమానులు, ఆయన పూర్వ విద్యార్థుల సందర్శన కోసం ఏర్పాట్లు చేశారు.
ఈ సమయంలో ప్రొఫెసర్ సాయిబాబా పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు కేటీఆర్ ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. అయితే… అప్పటికే భారీ సంఖ్యలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన పూర్వవిద్యార్థులు కేటీఆర్ను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు.
ఈ సందర్బంగా పలువురు విద్యార్థులు `కేటీఆర్ గో బ్యాక్` అంటూ.. నినాదాలతో హోరెత్తించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు కూడా బత్తరపోయారు. వారు తేరుకునేలోగానే విద్యార్థుల సంఖ్య, నినాదాల మోత మరింత పెరిగిపోయింది. దీంతో తెచ్చిన పూల దండలను సాయిబాబా పార్థివ దేహంపై ఉంచి.. నివాళులర్పించిన కేటీఆర్ ఆ వెంటనే అక్కడ నుంచి వెనుదిరిగారు. వాస్తవానికి ఆయన సాయిబాబా కుటుంబాన్ని పరామర్శించాలని భావించారు. కానీ, విద్యార్థుల ఆందోళనతో అసంపూర్తిగానే కేటీఆర్ కార్యక్రమాన్ని ముగించారు.
This post was last modified on October 15, 2024 11:19 am
టాలీవుడ్లో ఒకప్పుడు కథానాయికగా ఒక వెలుగు వెలిగింది ముంబయి భామ రకుల్ ప్రీత్. 2013లో ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ సినిమాతో కథానాయికగా…
గత 36 ఏళ్ళకు న్యూజిలాండ్ భారత్ గడ్డపై ఒక్క టెస్ట్ సీరీస్ లో కూడా విజయం సాధించలేదు. ఇక బుధవారం…
కంగువ ప్రమోషన్లలో భాగంగా నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 ఉంటుందని, గత వారమే దాని…
కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ సిరీస్ తర్వాత కాస్త స్పీడ్ పెంచినట్లు అనిపిస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్…
అప్పు మీద అప్పు తీసుకోవటమే కానీ చేస్తున్నది ఏమీ లేదంటూ రేవంత్ సర్కారు మీద బీఆర్ఎస్ ముఖ్యనేతలు తరచూ విరుచుకుపడుతుండటం…
కొన్ని సినిమాలు థియేటర్లలో ఎంత బ్లాక్ బస్టర్ అయినా ఓటిటిలో వచ్చాక స్పందన వేరుగా ఉంటుంది. నెగటివ్ గా కనిపించినా…