తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్కు భారీ సెగ తగిలింది. కేటీఆర్ గో బ్యాక్ నినాదాలతో ఆయన ఉలిక్కి పడ్డారు. శనివారం రాత్రి మృతి చెందిన ఢిల్లీ విశ్వ విద్యాలయం మాజీ ప్రొఫెసర్ జీ. ఎన్. సాయిబాబా భౌతిక దేహాన్ని హైదరాబాద్లోని మౌలాలీలో ఉన్న ఆయన నివాసంలో ఉంచారు. అభిమానులు, ఆయన పూర్వ విద్యార్థుల సందర్శన కోసం ఏర్పాట్లు చేశారు.
ఈ సమయంలో ప్రొఫెసర్ సాయిబాబా పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు కేటీఆర్ ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. అయితే… అప్పటికే భారీ సంఖ్యలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన పూర్వవిద్యార్థులు కేటీఆర్ను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు.
ఈ సందర్బంగా పలువురు విద్యార్థులు `కేటీఆర్ గో బ్యాక్` అంటూ.. నినాదాలతో హోరెత్తించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు కూడా బత్తరపోయారు. వారు తేరుకునేలోగానే విద్యార్థుల సంఖ్య, నినాదాల మోత మరింత పెరిగిపోయింది. దీంతో తెచ్చిన పూల దండలను సాయిబాబా పార్థివ దేహంపై ఉంచి.. నివాళులర్పించిన కేటీఆర్ ఆ వెంటనే అక్కడ నుంచి వెనుదిరిగారు. వాస్తవానికి ఆయన సాయిబాబా కుటుంబాన్ని పరామర్శించాలని భావించారు. కానీ, విద్యార్థుల ఆందోళనతో అసంపూర్తిగానే కేటీఆర్ కార్యక్రమాన్ని ముగించారు.
This post was last modified on October 15, 2024 11:19 am
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…
స్టార్ హీరోల కుటుంబాల నుంచి అబ్బాయిలు హీరోలుగా మారడం మామూలే. అమ్మాయిలు మాత్రం హీరోయిన్లు కావడం అరుదు. ఐతే సినీ…
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…