Political News

‘అప‌విత్ర‌త ఒక్క తిరుమ‌ల‌కే ప‌రిమితం కాలేదు’

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి పూస‌పాటి అశోక్ గ‌జ‌ప‌తి రాజు తాజాగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ హ‌యాంలో ఒక్క తిరుమ‌ల మాత్ర‌మే అప‌విత్రం కాలేద‌ని.. అన్ని ఆల‌యాలు అపవిత్ర‌మ‌య్యాయ‌ని విమ‌ర్శించారు. ఎక్క‌డా ప‌విత్ర‌త అన్నమాటే లేకుండా పోయింద‌న్నారు. ప్ర‌సాదాల నుంచి అన్న సంత‌ర్ప‌ణ‌ల వ‌ర‌కు అన్నీ అప‌విత్రంగానే సాగాయ‌ని చెప్పారు.

విజ‌య‌వాడ‌లో దుర్గ‌మ్మ ఆల‌యానికి చెందిన ర‌థం గుర్రాల బొమ్మ‌ల‌ను అప‌హ‌రించిన‌ప్పుడు వైసీపీ నాయ‌కులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌న్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప్ర‌ముఖ పుణ్య క్షేత్రం రామ‌తీర్థంలో శ్రీరాముని విగ్ర‌హం శిర‌చ్ఛేదం జ‌రిగిన‌ప్పుడు కూడా ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌న్నారు. అన్న‌వరం స‌త్య నారాయ‌ణ స్వామి ఆల‌యంలో ప్ర‌సాదం క‌ల్తీ అయింద‌ని, ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఆల‌యంలోనూ ప‌విత్ర‌త‌, సంప్ర‌దాయం, శాస్త్రాన్ని పాటించలేద‌న్నారు.

“తిరుమ‌ల‌లో కొత్త సంవ‌త్స‌రం వేడుక‌లు నిర్వ‌హించుకున్నారు. కేకులు కోశారు. పుట్టిన రోజు వేడుక‌ల‌ను అమెరిక‌న్ సంప్రదాయంలో చేసుకున్నారు. ఇవ‌న్నీ ప‌విత్ర‌మా?  ఒక్క తిరుమ‌లే కాదు.. రాష్ట్రంలో అన్ని ప్ర‌ధాన ఆల‌యాల‌ను వైసీపీ ప్ర‌భుత్వం, జ‌గ‌న్ పాల‌న భ్ర‌ష్టు ప‌ట్టించింది” అని అశోక్ గ‌జ‌ప‌తిరాజు అన్నారు. చంద్ర‌బాబు మ‌ళ్లీ అధికారం చేప‌ట్ట‌డం.. వెనుక ఆదేవుళ్ల ఆశీస్సులు ఉన్నాయ‌న్నారు.

అదేవిధంగా జ‌గ‌న్ 11 స్థానాల‌కు ప‌రిమితం కావ‌డం వెనుక దేవుళ్ల ఆగ్ర‌హం ఉంద‌ని అశోక్ గ‌జ‌ప‌తిరాజు వ్యాఖ్యానించారు. కాగా.. సోమ‌వారం.. విజ‌య‌నగ‌రం జిల్లాలోనే కాక‌.. ఉత్త‌రాంధ్ర‌లోఘ‌నంగా చేసుకునే సిరిమానోత్సవ వేడుక‌ల‌ను మాజీ మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగానే ఆయ‌న ఆల‌యాల గురించి.. వైసీపీ పాల‌న గురించి వ్యాఖ్యానించారు.

This post was last modified on October 15, 2024 11:25 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

3 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

5 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

8 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

9 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

10 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

10 hours ago