Political News

‘అప‌విత్ర‌త ఒక్క తిరుమ‌ల‌కే ప‌రిమితం కాలేదు’

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి పూస‌పాటి అశోక్ గ‌జ‌ప‌తి రాజు తాజాగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ హ‌యాంలో ఒక్క తిరుమ‌ల మాత్ర‌మే అప‌విత్రం కాలేద‌ని.. అన్ని ఆల‌యాలు అపవిత్ర‌మ‌య్యాయ‌ని విమ‌ర్శించారు. ఎక్క‌డా ప‌విత్ర‌త అన్నమాటే లేకుండా పోయింద‌న్నారు. ప్ర‌సాదాల నుంచి అన్న సంత‌ర్ప‌ణ‌ల వ‌ర‌కు అన్నీ అప‌విత్రంగానే సాగాయ‌ని చెప్పారు.

విజ‌య‌వాడ‌లో దుర్గ‌మ్మ ఆల‌యానికి చెందిన ర‌థం గుర్రాల బొమ్మ‌ల‌ను అప‌హ‌రించిన‌ప్పుడు వైసీపీ నాయ‌కులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌న్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప్ర‌ముఖ పుణ్య క్షేత్రం రామ‌తీర్థంలో శ్రీరాముని విగ్ర‌హం శిర‌చ్ఛేదం జ‌రిగిన‌ప్పుడు కూడా ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌న్నారు. అన్న‌వరం స‌త్య నారాయ‌ణ స్వామి ఆల‌యంలో ప్ర‌సాదం క‌ల్తీ అయింద‌ని, ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఆల‌యంలోనూ ప‌విత్ర‌త‌, సంప్ర‌దాయం, శాస్త్రాన్ని పాటించలేద‌న్నారు.

“తిరుమ‌ల‌లో కొత్త సంవ‌త్స‌రం వేడుక‌లు నిర్వ‌హించుకున్నారు. కేకులు కోశారు. పుట్టిన రోజు వేడుక‌ల‌ను అమెరిక‌న్ సంప్రదాయంలో చేసుకున్నారు. ఇవ‌న్నీ ప‌విత్ర‌మా?  ఒక్క తిరుమ‌లే కాదు.. రాష్ట్రంలో అన్ని ప్ర‌ధాన ఆల‌యాల‌ను వైసీపీ ప్ర‌భుత్వం, జ‌గ‌న్ పాల‌న భ్ర‌ష్టు ప‌ట్టించింది” అని అశోక్ గ‌జ‌ప‌తిరాజు అన్నారు. చంద్ర‌బాబు మ‌ళ్లీ అధికారం చేప‌ట్ట‌డం.. వెనుక ఆదేవుళ్ల ఆశీస్సులు ఉన్నాయ‌న్నారు.

అదేవిధంగా జ‌గ‌న్ 11 స్థానాల‌కు ప‌రిమితం కావ‌డం వెనుక దేవుళ్ల ఆగ్ర‌హం ఉంద‌ని అశోక్ గ‌జ‌ప‌తిరాజు వ్యాఖ్యానించారు. కాగా.. సోమ‌వారం.. విజ‌య‌నగ‌రం జిల్లాలోనే కాక‌.. ఉత్త‌రాంధ్ర‌లోఘ‌నంగా చేసుకునే సిరిమానోత్సవ వేడుక‌ల‌ను మాజీ మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగానే ఆయ‌న ఆల‌యాల గురించి.. వైసీపీ పాల‌న గురించి వ్యాఖ్యానించారు.

This post was last modified on October 15, 2024 11:25 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

57 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

1 hour ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

2 hours ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

3 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago