వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే, జంతువుల కొవ్వు కలపలేదని సీబీఐ చెబుతోందని వైసీపీ నేతలు వాదిస్తుండగా…కెమికల్స్ తో పాటు జంతువుల కొవ్వు కలిసిందని చార్జిషీట్ లోని 35వ పేజీలో స్పష్టం ఉందని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే అది మహాపాపం అంటూ జగన్ ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైసీపీ నేతలు తొలగిస్తున్నారు.
ఈ క్రమంలోనే కూటమి నేతలు అపచారానికి పాల్పడ్డారని, అందు కోసం రాష్ట్రంలోని పలు ఆలయాల్లో పాప ప్రక్షాళన పూజలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలోనే గుంటూరులోని గోరంట్లలో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబును టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఆ తర్వాత రాడ్లు, కర్రలతో రాంబాబుపై దాడికి ప్రయత్నించారు. అంబటి ఆ ఫ్లెక్సీ ఎలా చించుతాడో చూస్తాం అంటూ…అంబటి కాన్వాయ్ కు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై అంబటి ఫైర్ అయ్యారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. ఆ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో అంబటి దూషించారు.
రమ్మను చంద్రబాబును చూసుకుందాం…అంటూ రాయడానికి వీలు లేని భాషతో బూతులతో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి అన్న గౌరవం లేకుండా…వాడు వీడు అంటూ బూతుపురాణం చదివారు అంబటి. దీంతో, అంబటిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబుకు అంబటి క్షమాపణలు చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
This post was last modified on January 31, 2026 1:32 pm
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…