Political News

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే, జంతువుల కొవ్వు కలపలేదని సీబీఐ చెబుతోందని వైసీపీ నేతలు వాదిస్తుండగా…కెమికల్స్ తో పాటు జంతువుల కొవ్వు కలిసిందని చార్జిషీట్ లోని 35వ పేజీలో స్పష్టం ఉందని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే అది మహాపాపం అంటూ జగన్ ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైసీపీ నేతలు తొలగిస్తున్నారు.

ఈ క్రమంలోనే కూటమి నేతలు అపచారానికి పాల్పడ్డారని, అందు కోసం రాష్ట్రంలోని పలు ఆలయాల్లో పాప ప్రక్షాళన పూజలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలోనే గుంటూరులోని గోరంట్లలో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబును టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

ఆ తర్వాత రాడ్లు, కర్రలతో రాంబాబుపై దాడికి ప్రయత్నించారు. అంబటి ఆ ఫ్లెక్సీ ఎలా చించుతాడో చూస్తాం అంటూ…అంబటి కాన్వాయ్ కు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై అంబటి ఫైర్ అయ్యారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. ఆ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో అంబటి దూషించారు.

రమ్మను చంద్రబాబును చూసుకుందాం…అంటూ రాయడానికి వీలు లేని భాషతో బూతులతో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి అన్న గౌరవం లేకుండా…వాడు వీడు అంటూ బూతుపురాణం చదివారు అంబటి. దీంతో, అంబటిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబుకు అంబటి క్షమాపణలు చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

This post was last modified on January 31, 2026 1:32 pm

Share

Recent Posts

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

1 hour ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

2 hours ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

2 hours ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

5 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

6 hours ago

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

14 hours ago