వైసీపీ అధినేత జగన్కు నమ్మిన బంట్లు చాలా మందే ఉన్నారు. అయితే.. ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్కరు ఉన్నారు. రాజకీయంగా కొందరు ఉంటే.. ఆధ్యాత్మికంగా కొందరు ఉన్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. కొందరు జగన్కు దన్నుగా ఉంటే.. ఆయన అధికారంలోకి వచ్చాక మరికొందరు ఉన్నారు. ఉదాహరణకు తిరుమలను తీసుకుంటే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రమణ దీక్షితులు జగన్కు మద్దతుగా వ్యవహరించారు. అదేవిధంగా విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర కూడా జగన్కు దన్నుగా నిలిచారు.
చిత్రం ఏంటంటే.. స్వరూపానందేంద్ర.. ఏకంగా విశాఖలో జగన్ సీఎం కావాలని కోరుతూ యాగాలు, యజ్క్షాలు చేశారు. ఇక, రమణ దీక్షితులు.. టీటీడీ నుంచి బయటకు వచ్చేసినా(2018-19 మధ్య అప్పటి బాబు ప్రభుత్వం పక్కన పెట్టింది) ఇంట్లోనే ఉండి.. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేస్తూ.. జగన్ సీఎం కావాలని కోరుకున్నారు. కట్ చేస్తే.. జగన్ సీఎం అయ్యాక.. రమణ దీక్షితులు పక్కకు వెళ్లిపోయినా.. స్వరూపానంద కొనసాగుతున్నారు. ఇక, జగన్ సీఎం అయ్యాక.. ధర్మారెడ్డి టీటీడీ ఈవో పోస్టులో కి వచ్చారు.
ఆయనే అన్నీ అయి.. జగన్ను చూసుకున్నారు. తిరుమలను ఏకఛత్రాధిపత్యంగా ఏలారన్న విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఇక, స్వరూపానంద అయితే.. జగన్ హయాంలో తిరుగులేని ధర్మ ప్రభువుగా వినుతికెక్కారు. ఒకానొక సందర్భంలో ఆయన కర్ణాటకలో మాట్లాడుతూ.. (కన్నడం) ఏపీలో ఉన్నది మా ప్రభుత్వమే అనేశారు. ఇలా జగన్తో ఇద్దరూ ఆధ్యాత్మికంగా నమ్మిన బంట్లుగా మారిపోయారు. అయితే.. ఇక్కడ విశేషం ఏంటంటే.. జగన్ అధికారం కోల్పోయిన తర్వాత.. ఇద్దరూ దూరమయ్యారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదమైనప్పుడు.. కూటమి పార్టీలు జగన్, వైసీపీని ఏకేస్తుంటే.. ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. మరి దీనికి కారణం ఏంటి? దీనిపైనే ఇప్పుడు చర్చ సాగుతోంది. ధర్మారెడ్డి.. కూటమికి అనుకూలంగా మారిపోయి.. మాజీ వైసీపీ నేతతో చేతులు కలిపారన్నది ప్రస్తుతం తెరమీదికి వచ్చిన అంశం. దీంతో కూటమి కూడా ఆయనను టార్గెట్ చేయడం మానేసింది.
ఇక, ఎన్నికలకు ముందు వరకు స్వరూపానందేంద్రను టార్గెట్ చేసిన టీడీపీ నేతలు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. దీనికి కారణం.. ఆయన టీడీపీలోని ఇద్దరు కీలక నేతలతో చేతులు కలిపారు. వీరిద్దరూ విశాఖకు చెందిన వారే. పైగా వారు చెబితే చంద్రబాబు కాదనలేరట. దీంతో స్వరూపానందేంద్ర కూడా ప్లేట్ ఫిరాయించేసి.. తనకు జగన్ హయాంలో కేటాయించిన భూములను పరిరక్షించుకునే పనిలో పడ్డారట. ఇదీ సంగతి!!
This post was last modified on October 13, 2024 6:43 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…