Political News

జ‌గ‌న్‌కు న‌మ్మిన‌బంట్లు ఏమైపోయారు…

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు న‌మ్మిన బంట్లు చాలా మందే ఉన్నారు. అయితే.. ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క‌రు ఉన్నారు. రాజ‌కీయంగా కొంద‌రు ఉంటే.. ఆధ్యాత్మికంగా కొంద‌రు ఉన్నారు. ఆయ‌న ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. కొంద‌రు జ‌గ‌న్‌కు ద‌న్నుగా ఉంటే.. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చాక మ‌రికొంద‌రు ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు తిరుమ‌ల‌ను తీసుకుంటే.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ర‌మ‌ణ దీక్షితులు జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రించారు. అదేవిధంగా విశాఖ శార‌దా పీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర కూడా జ‌గ‌న్‌కు ద‌న్నుగా నిలిచారు.

చిత్రం ఏంటంటే.. స్వ‌రూపానందేంద్ర‌.. ఏకంగా విశాఖ‌లో జ‌గ‌న్ సీఎం కావాల‌ని కోరుతూ యాగాలు, య‌జ్క్షాలు చేశారు. ఇక‌, ర‌మ‌ణ దీక్షితులు.. టీటీడీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసినా(2018-19 మ‌ధ్య అప్ప‌టి బాబు ప్ర‌భుత్వం ప‌క్క‌న పెట్టింది) ఇంట్లోనే ఉండి.. శ్రీవారికి ప్ర‌త్యేక పూజ‌లు చేస్తూ.. జ‌గ‌న్ సీఎం కావాల‌ని కోరుకున్నారు. క‌ట్ చేస్తే.. జ‌గ‌న్ సీఎం అయ్యాక‌.. ర‌మ‌ణ దీక్షితులు ప‌క్క‌కు వెళ్లిపోయినా.. స్వ‌రూపానంద కొన‌సాగుతున్నారు. ఇక‌, జ‌గ‌న్ సీఎం అయ్యాక‌.. ధ‌ర్మారెడ్డి టీటీడీ ఈవో పోస్టులో కి వ‌చ్చారు.

ఆయ‌నే అన్నీ అయి.. జ‌గ‌న్‌ను చూసుకున్నారు. తిరుమ‌ల‌ను ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా ఏలార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన్నారు. ఇక‌, స్వ‌రూపానంద అయితే.. జ‌గ‌న్ హ‌యాంలో తిరుగులేని ధ‌ర్మ ప్ర‌భువుగా వినుతికెక్కారు. ఒకానొక సంద‌ర్భంలో ఆయ‌న క‌ర్ణాట‌క‌లో మాట్లాడుతూ.. (క‌న్న‌డం) ఏపీలో ఉన్న‌ది మా ప్ర‌భుత్వ‌మే అనేశారు. ఇలా జ‌గ‌న్‌తో ఇద్ద‌రూ ఆధ్యాత్మికంగా న‌మ్మిన బంట్లుగా మారిపోయారు. అయితే.. ఇక్క‌డ విశేషం ఏంటంటే.. జ‌గ‌న్ అధికారం కోల్పోయిన త‌ర్వాత‌.. ఇద్ద‌రూ దూర‌మ‌య్యారు.

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం వివాద‌మైన‌ప్పుడు.. కూట‌మి పార్టీలు జ‌గ‌న్‌, వైసీపీని ఏకేస్తుంటే.. ఇద్ద‌రూ మౌనంగా ఉండిపోయారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? దీనిపైనే ఇప్పుడు చ‌ర్చ సాగుతోంది. ధ‌ర్మారెడ్డి.. కూట‌మికి అనుకూలంగా మారిపోయి.. మాజీ వైసీపీ నేతతో చేతులు క‌లిపార‌న్న‌ది ప్ర‌స్తుతం తెర‌మీదికి వ‌చ్చిన అంశం. దీంతో కూట‌మి కూడా ఆయ‌న‌ను టార్గెట్ చేయ‌డం మానేసింది.

ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు స్వ‌రూపానందేంద్ర‌ను టార్గెట్ చేసిన టీడీపీ  నేత‌లు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. దీనికి కార‌ణం.. ఆయన టీడీపీలోని ఇద్ద‌రు కీల‌క నేత‌లతో చేతులు క‌లిపారు. వీరిద్ద‌రూ విశాఖ‌కు చెందిన వారే. పైగా వారు చెబితే చంద్ర‌బాబు కాద‌న‌లేర‌ట‌. దీంతో స్వ‌రూపానందేంద్ర కూడా ప్లేట్ ఫిరాయించేసి.. త‌న‌కు జ‌గ‌న్ హ‌యాంలో కేటాయించిన భూముల‌ను ప‌రిర‌క్షించుకునే ప‌నిలో ప‌డ్డార‌ట‌. ఇదీ సంగ‌తి!!

This post was last modified on October 13, 2024 6:43 pm

Share

Recent Posts

ఈ బంధాలే టీడీపీ బలం!

భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…

5 hours ago

ఏ పోస్ట్ అయినా పెడతా… ఎలాంటి ఫోటో అయినా దిగుతా

టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…

5 hours ago

హీరో కంటే దర్శకుడికే డ్యామేజ్

ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…

6 hours ago

జ‌గ‌న్‌కు సెగ‌: వైసీపీలో నిర‌స‌న స్వ‌రాలు.. !

వైసీపీలో జ‌గ‌న్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నార‌ని, ఆయ‌న గీసిన గీత దాట‌బోర‌ని చెప్పే వారు క‌నిపిస్తారు. అయితే.. తాజాగా…

7 hours ago

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

12 hours ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

12 hours ago