వైసీపీ అధినేత జగన్కు నమ్మిన బంట్లు చాలా మందే ఉన్నారు. అయితే.. ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్కరు ఉన్నారు. రాజకీయంగా కొందరు ఉంటే.. ఆధ్యాత్మికంగా కొందరు ఉన్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. కొందరు జగన్కు దన్నుగా ఉంటే.. ఆయన అధికారంలోకి వచ్చాక మరికొందరు ఉన్నారు. ఉదాహరణకు తిరుమలను తీసుకుంటే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రమణ దీక్షితులు జగన్కు మద్దతుగా వ్యవహరించారు. అదేవిధంగా విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర కూడా జగన్కు దన్నుగా నిలిచారు.
చిత్రం ఏంటంటే.. స్వరూపానందేంద్ర.. ఏకంగా విశాఖలో జగన్ సీఎం కావాలని కోరుతూ యాగాలు, యజ్క్షాలు చేశారు. ఇక, రమణ దీక్షితులు.. టీటీడీ నుంచి బయటకు వచ్చేసినా(2018-19 మధ్య అప్పటి బాబు ప్రభుత్వం పక్కన పెట్టింది) ఇంట్లోనే ఉండి.. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేస్తూ.. జగన్ సీఎం కావాలని కోరుకున్నారు. కట్ చేస్తే.. జగన్ సీఎం అయ్యాక.. రమణ దీక్షితులు పక్కకు వెళ్లిపోయినా.. స్వరూపానంద కొనసాగుతున్నారు. ఇక, జగన్ సీఎం అయ్యాక.. ధర్మారెడ్డి టీటీడీ ఈవో పోస్టులో కి వచ్చారు.
ఆయనే అన్నీ అయి.. జగన్ను చూసుకున్నారు. తిరుమలను ఏకఛత్రాధిపత్యంగా ఏలారన్న విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఇక, స్వరూపానంద అయితే.. జగన్ హయాంలో తిరుగులేని ధర్మ ప్రభువుగా వినుతికెక్కారు. ఒకానొక సందర్భంలో ఆయన కర్ణాటకలో మాట్లాడుతూ.. (కన్నడం) ఏపీలో ఉన్నది మా ప్రభుత్వమే అనేశారు. ఇలా జగన్తో ఇద్దరూ ఆధ్యాత్మికంగా నమ్మిన బంట్లుగా మారిపోయారు. అయితే.. ఇక్కడ విశేషం ఏంటంటే.. జగన్ అధికారం కోల్పోయిన తర్వాత.. ఇద్దరూ దూరమయ్యారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదమైనప్పుడు.. కూటమి పార్టీలు జగన్, వైసీపీని ఏకేస్తుంటే.. ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. మరి దీనికి కారణం ఏంటి? దీనిపైనే ఇప్పుడు చర్చ సాగుతోంది. ధర్మారెడ్డి.. కూటమికి అనుకూలంగా మారిపోయి.. మాజీ వైసీపీ నేతతో చేతులు కలిపారన్నది ప్రస్తుతం తెరమీదికి వచ్చిన అంశం. దీంతో కూటమి కూడా ఆయనను టార్గెట్ చేయడం మానేసింది.
ఇక, ఎన్నికలకు ముందు వరకు స్వరూపానందేంద్రను టార్గెట్ చేసిన టీడీపీ నేతలు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. దీనికి కారణం.. ఆయన టీడీపీలోని ఇద్దరు కీలక నేతలతో చేతులు కలిపారు. వీరిద్దరూ విశాఖకు చెందిన వారే. పైగా వారు చెబితే చంద్రబాబు కాదనలేరట. దీంతో స్వరూపానందేంద్ర కూడా ప్లేట్ ఫిరాయించేసి.. తనకు జగన్ హయాంలో కేటాయించిన భూములను పరిరక్షించుకునే పనిలో పడ్డారట. ఇదీ సంగతి!!
This post was last modified on October 13, 2024 6:43 pm
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…