Political News

జ‌గ‌న్‌కు న‌మ్మిన‌బంట్లు ఏమైపోయారు…

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు న‌మ్మిన బంట్లు చాలా మందే ఉన్నారు. అయితే.. ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క‌రు ఉన్నారు. రాజ‌కీయంగా కొంద‌రు ఉంటే.. ఆధ్యాత్మికంగా కొంద‌రు ఉన్నారు. ఆయ‌న ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. కొంద‌రు జ‌గ‌న్‌కు ద‌న్నుగా ఉంటే.. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చాక మ‌రికొంద‌రు ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు తిరుమ‌ల‌ను తీసుకుంటే.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ర‌మ‌ణ దీక్షితులు జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రించారు. అదేవిధంగా విశాఖ శార‌దా పీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర కూడా జ‌గ‌న్‌కు ద‌న్నుగా నిలిచారు.

చిత్రం ఏంటంటే.. స్వ‌రూపానందేంద్ర‌.. ఏకంగా విశాఖ‌లో జ‌గ‌న్ సీఎం కావాల‌ని కోరుతూ యాగాలు, య‌జ్క్షాలు చేశారు. ఇక‌, ర‌మ‌ణ దీక్షితులు.. టీటీడీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసినా(2018-19 మ‌ధ్య అప్ప‌టి బాబు ప్ర‌భుత్వం ప‌క్క‌న పెట్టింది) ఇంట్లోనే ఉండి.. శ్రీవారికి ప్ర‌త్యేక పూజ‌లు చేస్తూ.. జ‌గ‌న్ సీఎం కావాల‌ని కోరుకున్నారు. క‌ట్ చేస్తే.. జ‌గ‌న్ సీఎం అయ్యాక‌.. ర‌మ‌ణ దీక్షితులు ప‌క్క‌కు వెళ్లిపోయినా.. స్వ‌రూపానంద కొన‌సాగుతున్నారు. ఇక‌, జ‌గ‌న్ సీఎం అయ్యాక‌.. ధ‌ర్మారెడ్డి టీటీడీ ఈవో పోస్టులో కి వ‌చ్చారు.

ఆయ‌నే అన్నీ అయి.. జ‌గ‌న్‌ను చూసుకున్నారు. తిరుమ‌ల‌ను ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా ఏలార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన్నారు. ఇక‌, స్వ‌రూపానంద అయితే.. జ‌గ‌న్ హ‌యాంలో తిరుగులేని ధ‌ర్మ ప్ర‌భువుగా వినుతికెక్కారు. ఒకానొక సంద‌ర్భంలో ఆయ‌న క‌ర్ణాట‌క‌లో మాట్లాడుతూ.. (క‌న్న‌డం) ఏపీలో ఉన్న‌ది మా ప్ర‌భుత్వ‌మే అనేశారు. ఇలా జ‌గ‌న్‌తో ఇద్ద‌రూ ఆధ్యాత్మికంగా న‌మ్మిన బంట్లుగా మారిపోయారు. అయితే.. ఇక్క‌డ విశేషం ఏంటంటే.. జ‌గ‌న్ అధికారం కోల్పోయిన త‌ర్వాత‌.. ఇద్ద‌రూ దూర‌మ‌య్యారు.

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం వివాద‌మైన‌ప్పుడు.. కూట‌మి పార్టీలు జ‌గ‌న్‌, వైసీపీని ఏకేస్తుంటే.. ఇద్ద‌రూ మౌనంగా ఉండిపోయారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? దీనిపైనే ఇప్పుడు చ‌ర్చ సాగుతోంది. ధ‌ర్మారెడ్డి.. కూట‌మికి అనుకూలంగా మారిపోయి.. మాజీ వైసీపీ నేతతో చేతులు క‌లిపార‌న్న‌ది ప్ర‌స్తుతం తెర‌మీదికి వ‌చ్చిన అంశం. దీంతో కూట‌మి కూడా ఆయ‌న‌ను టార్గెట్ చేయ‌డం మానేసింది.

ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు స్వ‌రూపానందేంద్ర‌ను టార్గెట్ చేసిన టీడీపీ  నేత‌లు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. దీనికి కార‌ణం.. ఆయన టీడీపీలోని ఇద్ద‌రు కీల‌క నేత‌లతో చేతులు క‌లిపారు. వీరిద్ద‌రూ విశాఖ‌కు చెందిన వారే. పైగా వారు చెబితే చంద్ర‌బాబు కాద‌న‌లేర‌ట‌. దీంతో స్వ‌రూపానందేంద్ర కూడా ప్లేట్ ఫిరాయించేసి.. త‌న‌కు జ‌గ‌న్ హ‌యాంలో కేటాయించిన భూముల‌ను ప‌రిర‌క్షించుకునే ప‌నిలో ప‌డ్డార‌ట‌. ఇదీ సంగ‌తి!!

This post was last modified on October 13, 2024 6:43 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

3 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

23 minutes ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

2 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

4 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

6 hours ago