Political News

జ‌గ‌న్‌కు న‌మ్మిన‌బంట్లు ఏమైపోయారు…

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు న‌మ్మిన బంట్లు చాలా మందే ఉన్నారు. అయితే.. ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క‌రు ఉన్నారు. రాజ‌కీయంగా కొంద‌రు ఉంటే.. ఆధ్యాత్మికంగా కొంద‌రు ఉన్నారు. ఆయ‌న ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. కొంద‌రు జ‌గ‌న్‌కు ద‌న్నుగా ఉంటే.. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చాక మ‌రికొంద‌రు ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు తిరుమ‌ల‌ను తీసుకుంటే.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ర‌మ‌ణ దీక్షితులు జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రించారు. అదేవిధంగా విశాఖ శార‌దా పీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర కూడా జ‌గ‌న్‌కు ద‌న్నుగా నిలిచారు.

చిత్రం ఏంటంటే.. స్వ‌రూపానందేంద్ర‌.. ఏకంగా విశాఖ‌లో జ‌గ‌న్ సీఎం కావాల‌ని కోరుతూ యాగాలు, య‌జ్క్షాలు చేశారు. ఇక‌, ర‌మ‌ణ దీక్షితులు.. టీటీడీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసినా(2018-19 మ‌ధ్య అప్ప‌టి బాబు ప్ర‌భుత్వం ప‌క్క‌న పెట్టింది) ఇంట్లోనే ఉండి.. శ్రీవారికి ప్ర‌త్యేక పూజ‌లు చేస్తూ.. జ‌గ‌న్ సీఎం కావాల‌ని కోరుకున్నారు. క‌ట్ చేస్తే.. జ‌గ‌న్ సీఎం అయ్యాక‌.. ర‌మ‌ణ దీక్షితులు ప‌క్క‌కు వెళ్లిపోయినా.. స్వ‌రూపానంద కొన‌సాగుతున్నారు. ఇక‌, జ‌గ‌న్ సీఎం అయ్యాక‌.. ధ‌ర్మారెడ్డి టీటీడీ ఈవో పోస్టులో కి వ‌చ్చారు.

ఆయ‌నే అన్నీ అయి.. జ‌గ‌న్‌ను చూసుకున్నారు. తిరుమ‌ల‌ను ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా ఏలార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన్నారు. ఇక‌, స్వ‌రూపానంద అయితే.. జ‌గ‌న్ హ‌యాంలో తిరుగులేని ధ‌ర్మ ప్ర‌భువుగా వినుతికెక్కారు. ఒకానొక సంద‌ర్భంలో ఆయ‌న క‌ర్ణాట‌క‌లో మాట్లాడుతూ.. (క‌న్న‌డం) ఏపీలో ఉన్న‌ది మా ప్ర‌భుత్వ‌మే అనేశారు. ఇలా జ‌గ‌న్‌తో ఇద్ద‌రూ ఆధ్యాత్మికంగా న‌మ్మిన బంట్లుగా మారిపోయారు. అయితే.. ఇక్క‌డ విశేషం ఏంటంటే.. జ‌గ‌న్ అధికారం కోల్పోయిన త‌ర్వాత‌.. ఇద్ద‌రూ దూర‌మ‌య్యారు.

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం వివాద‌మైన‌ప్పుడు.. కూట‌మి పార్టీలు జ‌గ‌న్‌, వైసీపీని ఏకేస్తుంటే.. ఇద్ద‌రూ మౌనంగా ఉండిపోయారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? దీనిపైనే ఇప్పుడు చ‌ర్చ సాగుతోంది. ధ‌ర్మారెడ్డి.. కూట‌మికి అనుకూలంగా మారిపోయి.. మాజీ వైసీపీ నేతతో చేతులు క‌లిపార‌న్న‌ది ప్ర‌స్తుతం తెర‌మీదికి వ‌చ్చిన అంశం. దీంతో కూట‌మి కూడా ఆయ‌న‌ను టార్గెట్ చేయ‌డం మానేసింది.

ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు స్వ‌రూపానందేంద్ర‌ను టార్గెట్ చేసిన టీడీపీ  నేత‌లు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. దీనికి కార‌ణం.. ఆయన టీడీపీలోని ఇద్ద‌రు కీల‌క నేత‌లతో చేతులు క‌లిపారు. వీరిద్ద‌రూ విశాఖ‌కు చెందిన వారే. పైగా వారు చెబితే చంద్ర‌బాబు కాద‌న‌లేర‌ట‌. దీంతో స్వ‌రూపానందేంద్ర కూడా ప్లేట్ ఫిరాయించేసి.. త‌న‌కు జ‌గ‌న్ హ‌యాంలో కేటాయించిన భూముల‌ను ప‌రిర‌క్షించుకునే ప‌నిలో ప‌డ్డార‌ట‌. ఇదీ సంగ‌తి!!

This post was last modified on October 13, 2024 6:43 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

సంజయ్ దత్ ను కొట్టేసిన యానిమాల్ విలన్

ఒకప్పుడు స్టార్ హీరోలుగా వెలుగొందిన వారు ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్లుగా విలన్స్ గా మారుతున్న విషయం తెలిసిందే. సపోర్టింగ్…

3 hours ago

స్పిరిట్.. మెగా పేరెందుకొచ్చిందంటే..

పాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్ ప్రభాస్ ఎన్ని సినిమాలు లైన్ లో పెట్టినా కూడా అందరి ఫోకస్ ఎక్కువగా…

3 hours ago

డిజిటల్ చెల్లింపులకు ఆర్బీఐ బూస్ట్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిజిటల్ పేమెంట్స్ వినియోగదారులకు మరో పెద్ద సౌలభ్యం కల్పించింది. యూపీఐ లావాదేవీలను మరింత…

3 hours ago

అజ‌య్ జ‌డేజా.. ఇక మ‌హారాజు.. నిజం!!

అజ‌య్ జ‌డేజా. భార‌త క్రికెట్ దిగ్గ‌జంగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఆయన మ‌హారాజు కానున్నారు. నిజ‌మే..…

4 hours ago

వ్యాపారానికి దూరంగా కూట‌మి ప్ర‌భుత్వం.. మంచిదేనా?

ప్ర‌భుత్వం అంటే.. ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం కోస‌మే ఏర్ప‌డుతుంద‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే.. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం సేవ చేస్తూనే..…

5 hours ago

వీరమల్లు క్రిష్.. అనుష్క తరువాత ఎవరితో?

టాలీవుడ్ లో సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకులతో క్రిష్ ఒకరు. అతనికి ఎంత…

6 hours ago