Political News

జ‌గ‌న్‌కు న‌మ్మిన‌బంట్లు ఏమైపోయారు…

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు న‌మ్మిన బంట్లు చాలా మందే ఉన్నారు. అయితే.. ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క‌రు ఉన్నారు. రాజ‌కీయంగా కొంద‌రు ఉంటే.. ఆధ్యాత్మికంగా కొంద‌రు ఉన్నారు. ఆయ‌న ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. కొంద‌రు జ‌గ‌న్‌కు ద‌న్నుగా ఉంటే.. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చాక మ‌రికొంద‌రు ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు తిరుమ‌ల‌ను తీసుకుంటే.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ర‌మ‌ణ దీక్షితులు జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రించారు. అదేవిధంగా విశాఖ శార‌దా పీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర కూడా జ‌గ‌న్‌కు ద‌న్నుగా నిలిచారు.

చిత్రం ఏంటంటే.. స్వ‌రూపానందేంద్ర‌.. ఏకంగా విశాఖ‌లో జ‌గ‌న్ సీఎం కావాల‌ని కోరుతూ యాగాలు, య‌జ్క్షాలు చేశారు. ఇక‌, ర‌మ‌ణ దీక్షితులు.. టీటీడీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసినా(2018-19 మ‌ధ్య అప్ప‌టి బాబు ప్ర‌భుత్వం ప‌క్క‌న పెట్టింది) ఇంట్లోనే ఉండి.. శ్రీవారికి ప్ర‌త్యేక పూజ‌లు చేస్తూ.. జ‌గ‌న్ సీఎం కావాల‌ని కోరుకున్నారు. క‌ట్ చేస్తే.. జ‌గ‌న్ సీఎం అయ్యాక‌.. ర‌మ‌ణ దీక్షితులు ప‌క్క‌కు వెళ్లిపోయినా.. స్వ‌రూపానంద కొన‌సాగుతున్నారు. ఇక‌, జ‌గ‌న్ సీఎం అయ్యాక‌.. ధ‌ర్మారెడ్డి టీటీడీ ఈవో పోస్టులో కి వ‌చ్చారు.

ఆయ‌నే అన్నీ అయి.. జ‌గ‌న్‌ను చూసుకున్నారు. తిరుమ‌ల‌ను ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా ఏలార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన్నారు. ఇక‌, స్వ‌రూపానంద అయితే.. జ‌గ‌న్ హ‌యాంలో తిరుగులేని ధ‌ర్మ ప్ర‌భువుగా వినుతికెక్కారు. ఒకానొక సంద‌ర్భంలో ఆయ‌న క‌ర్ణాట‌క‌లో మాట్లాడుతూ.. (క‌న్న‌డం) ఏపీలో ఉన్న‌ది మా ప్ర‌భుత్వ‌మే అనేశారు. ఇలా జ‌గ‌న్‌తో ఇద్ద‌రూ ఆధ్యాత్మికంగా న‌మ్మిన బంట్లుగా మారిపోయారు. అయితే.. ఇక్క‌డ విశేషం ఏంటంటే.. జ‌గ‌న్ అధికారం కోల్పోయిన త‌ర్వాత‌.. ఇద్ద‌రూ దూర‌మ‌య్యారు.

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం వివాద‌మైన‌ప్పుడు.. కూట‌మి పార్టీలు జ‌గ‌న్‌, వైసీపీని ఏకేస్తుంటే.. ఇద్ద‌రూ మౌనంగా ఉండిపోయారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? దీనిపైనే ఇప్పుడు చ‌ర్చ సాగుతోంది. ధ‌ర్మారెడ్డి.. కూట‌మికి అనుకూలంగా మారిపోయి.. మాజీ వైసీపీ నేతతో చేతులు క‌లిపార‌న్న‌ది ప్ర‌స్తుతం తెర‌మీదికి వ‌చ్చిన అంశం. దీంతో కూట‌మి కూడా ఆయ‌న‌ను టార్గెట్ చేయ‌డం మానేసింది.

ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు స్వ‌రూపానందేంద్ర‌ను టార్గెట్ చేసిన టీడీపీ  నేత‌లు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. దీనికి కార‌ణం.. ఆయన టీడీపీలోని ఇద్ద‌రు కీల‌క నేత‌లతో చేతులు క‌లిపారు. వీరిద్ద‌రూ విశాఖ‌కు చెందిన వారే. పైగా వారు చెబితే చంద్ర‌బాబు కాద‌న‌లేర‌ట‌. దీంతో స్వ‌రూపానందేంద్ర కూడా ప్లేట్ ఫిరాయించేసి.. త‌న‌కు జ‌గ‌న్ హ‌యాంలో కేటాయించిన భూముల‌ను ప‌రిర‌క్షించుకునే ప‌నిలో ప‌డ్డార‌ట‌. ఇదీ సంగ‌తి!!

This post was last modified on October 13, 2024 6:43 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

54 minutes ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

2 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

3 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

4 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

5 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

6 hours ago