Political News

జ‌గ‌న్‌కు న‌మ్మిన‌బంట్లు ఏమైపోయారు…

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు న‌మ్మిన బంట్లు చాలా మందే ఉన్నారు. అయితే.. ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క‌రు ఉన్నారు. రాజ‌కీయంగా కొంద‌రు ఉంటే.. ఆధ్యాత్మికంగా కొంద‌రు ఉన్నారు. ఆయ‌న ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. కొంద‌రు జ‌గ‌న్‌కు ద‌న్నుగా ఉంటే.. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చాక మ‌రికొంద‌రు ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు తిరుమ‌ల‌ను తీసుకుంటే.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ర‌మ‌ణ దీక్షితులు జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రించారు. అదేవిధంగా విశాఖ శార‌దా పీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర కూడా జ‌గ‌న్‌కు ద‌న్నుగా నిలిచారు.

చిత్రం ఏంటంటే.. స్వ‌రూపానందేంద్ర‌.. ఏకంగా విశాఖ‌లో జ‌గ‌న్ సీఎం కావాల‌ని కోరుతూ యాగాలు, య‌జ్క్షాలు చేశారు. ఇక‌, ర‌మ‌ణ దీక్షితులు.. టీటీడీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసినా(2018-19 మ‌ధ్య అప్ప‌టి బాబు ప్ర‌భుత్వం ప‌క్క‌న పెట్టింది) ఇంట్లోనే ఉండి.. శ్రీవారికి ప్ర‌త్యేక పూజ‌లు చేస్తూ.. జ‌గ‌న్ సీఎం కావాల‌ని కోరుకున్నారు. క‌ట్ చేస్తే.. జ‌గ‌న్ సీఎం అయ్యాక‌.. ర‌మ‌ణ దీక్షితులు ప‌క్క‌కు వెళ్లిపోయినా.. స్వ‌రూపానంద కొన‌సాగుతున్నారు. ఇక‌, జ‌గ‌న్ సీఎం అయ్యాక‌.. ధ‌ర్మారెడ్డి టీటీడీ ఈవో పోస్టులో కి వ‌చ్చారు.

ఆయ‌నే అన్నీ అయి.. జ‌గ‌న్‌ను చూసుకున్నారు. తిరుమ‌ల‌ను ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా ఏలార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన్నారు. ఇక‌, స్వ‌రూపానంద అయితే.. జ‌గ‌న్ హ‌యాంలో తిరుగులేని ధ‌ర్మ ప్ర‌భువుగా వినుతికెక్కారు. ఒకానొక సంద‌ర్భంలో ఆయ‌న క‌ర్ణాట‌క‌లో మాట్లాడుతూ.. (క‌న్న‌డం) ఏపీలో ఉన్న‌ది మా ప్ర‌భుత్వ‌మే అనేశారు. ఇలా జ‌గ‌న్‌తో ఇద్ద‌రూ ఆధ్యాత్మికంగా న‌మ్మిన బంట్లుగా మారిపోయారు. అయితే.. ఇక్క‌డ విశేషం ఏంటంటే.. జ‌గ‌న్ అధికారం కోల్పోయిన త‌ర్వాత‌.. ఇద్ద‌రూ దూర‌మ‌య్యారు.

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం వివాద‌మైన‌ప్పుడు.. కూట‌మి పార్టీలు జ‌గ‌న్‌, వైసీపీని ఏకేస్తుంటే.. ఇద్ద‌రూ మౌనంగా ఉండిపోయారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? దీనిపైనే ఇప్పుడు చ‌ర్చ సాగుతోంది. ధ‌ర్మారెడ్డి.. కూట‌మికి అనుకూలంగా మారిపోయి.. మాజీ వైసీపీ నేతతో చేతులు క‌లిపార‌న్న‌ది ప్ర‌స్తుతం తెర‌మీదికి వ‌చ్చిన అంశం. దీంతో కూట‌మి కూడా ఆయ‌న‌ను టార్గెట్ చేయ‌డం మానేసింది.

ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు స్వ‌రూపానందేంద్ర‌ను టార్గెట్ చేసిన టీడీపీ  నేత‌లు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. దీనికి కార‌ణం.. ఆయన టీడీపీలోని ఇద్ద‌రు కీల‌క నేత‌లతో చేతులు క‌లిపారు. వీరిద్ద‌రూ విశాఖ‌కు చెందిన వారే. పైగా వారు చెబితే చంద్ర‌బాబు కాద‌న‌లేర‌ట‌. దీంతో స్వ‌రూపానందేంద్ర కూడా ప్లేట్ ఫిరాయించేసి.. త‌న‌కు జ‌గ‌న్ హ‌యాంలో కేటాయించిన భూముల‌ను ప‌రిర‌క్షించుకునే ప‌నిలో ప‌డ్డార‌ట‌. ఇదీ సంగ‌తి!!

This post was last modified on October 13, 2024 6:43 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

2 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

4 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

6 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

6 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

8 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

8 hours ago