హరియాణాలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దక్కించుకోవాలి. ఔను. నిజమే బీజేపీ పదేళ్ల పాలనపై విసిగిపోయి ఉన్న ప్రజలు ముందు అలానే అనుకున్నారు. కాంగ్రెస్ నేతలకు పట్టం కడతామని కూడా గ్రామీణ ప్రజలు చెప్పుకొచ్చారు. అందుకే.. మెలితిరిగిన.. కాకలు తీరిన సర్వేరా యుళ్లు కూడా కాంగ్రెస్వైపే హరియాణా మొగ్గు చూపుతోందని లెక్కలు వేశారు. కానీ, ఫలితం చూస్తే.. యూటర్న్ తీసుకుంది. కనీ వినీ ఎరుగని రీతిలో హరియాణాలో బీజేపీ మూడోసారి విజయం దక్కించుకుంది.
మరి దీనికి కారణం ఏంటి? కాంగ్రెస్ చెబుతున్న ఈవీఎంలు కాదు. సైలెంట్గా ఉంటూ.. తెరచాటున చక్రం తిప్పుతున్న బెహన్. ఆమే.. ఒకప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి. ఈమెనే ఉత్తరాది రాష్ట్రాలు ప్రేమగా బెహెన్ అని పిలుచుకుంటాయి. ఆమె.. చేసిన మంత్రాంగంతో కాంగ్రెస్ పూర్తిగా డీలా పడిపోయింది. తాజాగా అందుతున్న లెక్కల ప్రకారం. కీలకమైన బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును బెహెన్ భారీగా చీల్చేశారు.
దీంతో గెలుపు గుర్రం ఎక్కుతుందని అనుకున్న కాంగ్రెస్ పార్టీ అంచనాలకు భిన్నంగా ప్రతిపక్షానికే పరిమితం అయిపోయింది. ఇక్కడ కీలక అంశం ఏంటంటే.. ముందుగా కాంగ్రెస్ బీఎస్పీతో చేతులు కలిపేందుకు ముందుకు వచ్చింది. కానీ, తాము అసలు పోటీలోనే ఉండబోమని మాయావతి మాయ మాటలు చెప్పారు. కానీ.. అప్పటికే ఆమె బీజేపీతో తెరచాటు ఒప్పందం చేసుకున్నారన్నది జాతీయ విశ్లేషకుల లెక్క. ఆమె హయాంలో మధ్యప్రదేశ్లో జరిగిన ఏనుగు విగ్రహాల కుంభకోణం.. కొన్ని దశాబ్దాలుగా పెండింగులోనే ఉంది.
దీంతో ఆమె తరచుగా బీజేపీతో టచ్లోనే ఉంటున్నారు. ఇప్పుడు కూడా హరియాణాలో ఆమె ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత.. పోటీకి రెడీ అయ్యారు. అప్పటి వరకు తమతో కలిసి వస్తారని అనుకున్నా.. ఒంటరి పోరుకు బెహెన్ రెడీ అయ్యారు. అంతేకాదు.. టికెట్లు దక్కని కాంగ్రెస్ నాయకులనే ఆమె టార్గెట్ చేసుకుని బీఎస్పీ తరఫున పోటీకి పెట్టారు. అంతే.. వారి ప్రభావం.. బీఎస్పీపై సానుభూతి మొత్తంగా సర్కారు వ్యతిరేక ఓటు కాస్తా.. చీలిపోయింది. కాంగ్రెస్ పడాల్సిన ప్రతి ఓటూ.. ఏనుగు ఎక్కేసింది. ఫలితంగా కాంగ్రెస్ కుదేలైంది. మొత్తానికి బెహెన్ దెబ్బతో హస్తం.. విలవిల్లాడుతోంది.
This post was last modified on October 13, 2024 12:52 pm
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…