ఏపీ సీఎం చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రశంసలు లభించాయి. “ఏపీలో మీ పాలన బాగుం ది. అందరినీ కలుపుకొని పోతున్నారు. ఇది మంచి ప్రభుత్వం నినాదం కూడా బాగుంది” అని చంద్రబా బుతో ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా హైదరాబాద్లో సీఎం చంద్రబాబును చిరు కలుసుకున్నారు. దసరా పండుగ సందర్భంగా ఇరువురు శుభాకాంక్షలు తెలిపుకొన్నారు. ఈ సందర్భంగా చిరుకు ఇష్టమైన అరకు కాఫీని చంద్రబాబు ప్రత్యేకంగా తయారు చేయించి ఇచ్చారు.
అనంతరం.. విజయవాడ వరద బాధితులకు సాయంగా చిరంజీవి కుటుంబం తరఫున ప్రకటించిన కోటి రూపాయల విరాళానికి సంబంధించిన చెక్కును చంద్రబాబుకు ఆయన అందించారు. ఈ సొమ్మును గత నెలలోనే ఇవ్వాలని భావించాలని.. అయితే, అనివార్య కారణాలతో కుదరలేదని చిరు చెప్పారు. తాను కూడా ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో పర్యటించాల్సి వచ్చిందని.. రాష్ట్రంలో అన్ని విధాలా వ్యవస్థలు ధ్వంసమయ్యాయని, వాటిని గాడిలో పెడుతున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముఖ్య సంస్థలు వస్తున్నాయి, 2047 విజన్ లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. యువతకు చాలా చేయాల్సి ఉందని.. వారికి ఉద్యోగంతోపాటు.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని భావించే వారిని ప్రోత్సహించాల్సి ఉందని చంద్రబాబు చెప్పారు. దీనికి తనవంతు సాయం అందిస్తానని చిరంజీవి చెప్పారు.
కాగా, తెలంగాణ, ఏపీలలో సెప్టెంబరు తొలివారంలో వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో టాలీవుడ్ ప్రముఖులు రెండు రాష్ట్రాలకు ఆపన్న హస్తం అందించారు. ఈ క్రమంలోనే చిరంజీవి ఏపీకి కోటి రూపాయలు, తెలంగాణకు కోటి రూపాయల సాయం ప్రకటించారు. ఈ నగదుకు సంబంధించిన చెక్కును ఆయన దసరా సందర్భంగా హైదరాబాద్లో ఉన్న చంద్రబాబుకు అందించారు. ఈ పర్యటనలో చిరు కుమార్తె కూడా పాల్గొన్నారు.
This post was last modified on October 13, 2024 4:12 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…