ఏపీ సీఎం చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రశంసలు లభించాయి. “ఏపీలో మీ పాలన బాగుం ది. అందరినీ కలుపుకొని పోతున్నారు. ఇది మంచి ప్రభుత్వం నినాదం కూడా బాగుంది” అని చంద్రబా బుతో ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా హైదరాబాద్లో సీఎం చంద్రబాబును చిరు కలుసుకున్నారు. దసరా పండుగ సందర్భంగా ఇరువురు శుభాకాంక్షలు తెలిపుకొన్నారు. ఈ సందర్భంగా చిరుకు ఇష్టమైన అరకు కాఫీని చంద్రబాబు ప్రత్యేకంగా తయారు చేయించి ఇచ్చారు.
అనంతరం.. విజయవాడ వరద బాధితులకు సాయంగా చిరంజీవి కుటుంబం తరఫున ప్రకటించిన కోటి రూపాయల విరాళానికి సంబంధించిన చెక్కును చంద్రబాబుకు ఆయన అందించారు. ఈ సొమ్మును గత నెలలోనే ఇవ్వాలని భావించాలని.. అయితే, అనివార్య కారణాలతో కుదరలేదని చిరు చెప్పారు. తాను కూడా ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో పర్యటించాల్సి వచ్చిందని.. రాష్ట్రంలో అన్ని విధాలా వ్యవస్థలు ధ్వంసమయ్యాయని, వాటిని గాడిలో పెడుతున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముఖ్య సంస్థలు వస్తున్నాయి, 2047 విజన్ లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. యువతకు చాలా చేయాల్సి ఉందని.. వారికి ఉద్యోగంతోపాటు.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని భావించే వారిని ప్రోత్సహించాల్సి ఉందని చంద్రబాబు చెప్పారు. దీనికి తనవంతు సాయం అందిస్తానని చిరంజీవి చెప్పారు.
కాగా, తెలంగాణ, ఏపీలలో సెప్టెంబరు తొలివారంలో వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో టాలీవుడ్ ప్రముఖులు రెండు రాష్ట్రాలకు ఆపన్న హస్తం అందించారు. ఈ క్రమంలోనే చిరంజీవి ఏపీకి కోటి రూపాయలు, తెలంగాణకు కోటి రూపాయల సాయం ప్రకటించారు. ఈ నగదుకు సంబంధించిన చెక్కును ఆయన దసరా సందర్భంగా హైదరాబాద్లో ఉన్న చంద్రబాబుకు అందించారు. ఈ పర్యటనలో చిరు కుమార్తె కూడా పాల్గొన్నారు.
This post was last modified on October 13, 2024 4:12 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…