ఏపీ సీఎం చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రశంసలు లభించాయి. “ఏపీలో మీ పాలన బాగుం ది. అందరినీ కలుపుకొని పోతున్నారు. ఇది మంచి ప్రభుత్వం నినాదం కూడా బాగుంది” అని చంద్రబా బుతో ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా హైదరాబాద్లో సీఎం చంద్రబాబును చిరు కలుసుకున్నారు. దసరా పండుగ సందర్భంగా ఇరువురు శుభాకాంక్షలు తెలిపుకొన్నారు. ఈ సందర్భంగా చిరుకు ఇష్టమైన అరకు కాఫీని చంద్రబాబు ప్రత్యేకంగా తయారు చేయించి ఇచ్చారు.
అనంతరం.. విజయవాడ వరద బాధితులకు సాయంగా చిరంజీవి కుటుంబం తరఫున ప్రకటించిన కోటి రూపాయల విరాళానికి సంబంధించిన చెక్కును చంద్రబాబుకు ఆయన అందించారు. ఈ సొమ్మును గత నెలలోనే ఇవ్వాలని భావించాలని.. అయితే, అనివార్య కారణాలతో కుదరలేదని చిరు చెప్పారు. తాను కూడా ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో పర్యటించాల్సి వచ్చిందని.. రాష్ట్రంలో అన్ని విధాలా వ్యవస్థలు ధ్వంసమయ్యాయని, వాటిని గాడిలో పెడుతున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముఖ్య సంస్థలు వస్తున్నాయి, 2047 విజన్ లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. యువతకు చాలా చేయాల్సి ఉందని.. వారికి ఉద్యోగంతోపాటు.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని భావించే వారిని ప్రోత్సహించాల్సి ఉందని చంద్రబాబు చెప్పారు. దీనికి తనవంతు సాయం అందిస్తానని చిరంజీవి చెప్పారు.
కాగా, తెలంగాణ, ఏపీలలో సెప్టెంబరు తొలివారంలో వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో టాలీవుడ్ ప్రముఖులు రెండు రాష్ట్రాలకు ఆపన్న హస్తం అందించారు. ఈ క్రమంలోనే చిరంజీవి ఏపీకి కోటి రూపాయలు, తెలంగాణకు కోటి రూపాయల సాయం ప్రకటించారు. ఈ నగదుకు సంబంధించిన చెక్కును ఆయన దసరా సందర్భంగా హైదరాబాద్లో ఉన్న చంద్రబాబుకు అందించారు. ఈ పర్యటనలో చిరు కుమార్తె కూడా పాల్గొన్నారు.
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…
మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…