తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ సీబీఐ నేతృత్వంలో సిట్ వేసింది సుప్రీం కోర్టు. మరోవైపు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న ప్రసాదానికి జరిగిన అపచారంపై వేద పండితులు, అర్చకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే ఇకపై ఏపీలో తిరుమలతోపాటు ఏ ఆలయంలోనూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పింని ప్రభుత్వం…ఆలయాల్లో అర్చకులకు సర్వాధికారాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఇకపై దేవదాయ కమిషనర్ తోపాటు ఏ స్ఠాయి జిల్లా అధికారి కూడా వైదిక విధుల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఇకపై ఆలయాల్లోని యాగాలు, కుంభాభిషేకాలు, పూజలు, తదితర సేవల్లో అధికారుల పాత్ర పరిమితంగానే ఉండనుంది. ఆయా కార్యక్రమాల్లో ఆలయ అర్చకుల పాత్రే సింహభాగం ఉండనుంది. ఆధ్యాత్మిక విధులతోపాటు వైదికపరమైన విషయాల్లో అర్చకులదే తుది నిర్ణయం.
ఆలయాల్లో అవసరమైతే ఈఓలు వైదిక కమిటీలు వేసుకునే వెసులుబాటు ఉంది. ఒకవేళ ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరని పక్షంలో పీఠాధిపతుల సలహాలు తీసుకునే వెసులుబాటు ఉంది. ఆలయాల ఆగమ శాస్త్రాల ప్రకారం వైదిక విధులు నిర్వహించుకునేందుకు అర్చకులకు అవకాశం లభించింది. చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయంతో అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on October 11, 2024 11:57 am
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…