Political News

ఆలయాల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ సీబీఐ నేతృత్వంలో సిట్ వేసింది సుప్రీం కోర్టు. మరోవైపు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న ప్రసాదానికి జరిగిన అపచారంపై వేద పండితులు, అర్చకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలోనే ఇకపై ఏపీలో తిరుమలతోపాటు ఏ ఆలయంలోనూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అర్చ‌కుల‌కు స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌ల్పింని ప్రభుత్వం…ఆల‌యాల్లో అర్చ‌కుల‌కు స‌ర్వాధికారాలు క‌ల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఇక‌పై దేవ‌దాయ క‌మిష‌న‌ర్ తోపాటు ఏ స్ఠాయి జిల్లా అధికారి కూడా వైదిక విధుల్లో జోక్యం చేసుకోవ‌డానికి వీల్లేదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఇకపై ఆలయాల్లోని యాగాలు, కుంభాభిషేకాలు, పూజ‌లు, తదితర సేవ‌ల్లో అధికారుల పాత్ర ప‌రిమితంగానే ఉండ‌నుంది. ఆయా కార్యక్రమాల్లో ఆలయ అర్చకుల పాత్రే సింహభాగం ఉండనుంది. ఆధ్యాత్మిక విధులతోపాటు వైదికపరమైన విషయాల్లో అర్చకులదే తుది నిర్ణ‌యం.

ఆలయాల్లో అవ‌స‌ర‌మైతే ఈఓలు వైదిక క‌మిటీలు వేసుకునే వెసులుబాటు ఉంది. ఒకవేళ ఆధ్యాత్మిక విష‌యాల్లో ఏకాభిప్రాయం కుద‌ర‌ని పక్షంలో పీఠాధిప‌తుల స‌ల‌హాలు తీసుకునే వెసులుబాటు ఉంది. ఆల‌యాల ఆగ‌మ శాస్త్రాల ప్ర‌కారం వైదిక విధులు నిర్వ‌హించుకునేందుకు అర్చ‌కుల‌కు అవకాశం లభించింది. చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయంతో అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on October 11, 2024 11:57 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మెగా ఫ్యామిలీ నుంచి ఇంకో నిర్మాత?

టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…

1 hour ago

ధనుష్‌కు మాత్రం ఎలా సాధ్యం?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…

3 hours ago

ఆవిడ వల్లే ఎన్టీఆర్‌కు భారత రత్న రావట్లేదా?

టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…

5 hours ago

పిఠాపురం ఫ్లెక్సీల రగడ… వర్మదే తప్పన్న బాబు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…

5 hours ago

సినిమా చేయనందుకు హీరో 10 కోట్ల పరిహారం

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…

6 hours ago

IPL: ఛాన్స్ మిస్ చేసుకుంటున్న పెద్ది

ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…

6 hours ago