తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ సీబీఐ నేతృత్వంలో సిట్ వేసింది సుప్రీం కోర్టు. మరోవైపు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న ప్రసాదానికి జరిగిన అపచారంపై వేద పండితులు, అర్చకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే ఇకపై ఏపీలో తిరుమలతోపాటు ఏ ఆలయంలోనూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పింని ప్రభుత్వం…ఆలయాల్లో అర్చకులకు సర్వాధికారాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఇకపై దేవదాయ కమిషనర్ తోపాటు ఏ స్ఠాయి జిల్లా అధికారి కూడా వైదిక విధుల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఇకపై ఆలయాల్లోని యాగాలు, కుంభాభిషేకాలు, పూజలు, తదితర సేవల్లో అధికారుల పాత్ర పరిమితంగానే ఉండనుంది. ఆయా కార్యక్రమాల్లో ఆలయ అర్చకుల పాత్రే సింహభాగం ఉండనుంది. ఆధ్యాత్మిక విధులతోపాటు వైదికపరమైన విషయాల్లో అర్చకులదే తుది నిర్ణయం.
ఆలయాల్లో అవసరమైతే ఈఓలు వైదిక కమిటీలు వేసుకునే వెసులుబాటు ఉంది. ఒకవేళ ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరని పక్షంలో పీఠాధిపతుల సలహాలు తీసుకునే వెసులుబాటు ఉంది. ఆలయాల ఆగమ శాస్త్రాల ప్రకారం వైదిక విధులు నిర్వహించుకునేందుకు అర్చకులకు అవకాశం లభించింది. చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయంతో అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on October 11, 2024 11:57 am
రేపు శ్రీరామనవమి సందర్భంగా ఫస్ట్ షాట్ పేరుతో పెద్ది టీజర్ విడుదల చేయబోతున్నారు. గేమ్ ఛేంజర్ దెబ్బకు తీవ్ర నిరాశలో…
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే ఓ వర్గం అభిమానుల్లో నిరాశ మొదలైంది. ఎక్కువ అంచనాల మధ్య బరిలోకి…
స్టార్ క్యాస్టింగ్ లేకుండా హనుమాన్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం దాని సీక్వెల్ జై హనుమాన్…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన బాల్యం, విద్యాభ్యాసం గురించి శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదికలో…
కేవలం అయిదే రోజుల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదల కానుంది. ఏప్రిల్ 10 రిలీజని వారాల కృత్రమే ప్రకటించినప్పటికీ ప్రమోషన్ల…
ఏపీ వాణిజ్య రాజధాని విశాఖపట్నంలో సెంటు భూమి కూడా అత్యంత విలువైనదే. అలాంటి నగరంలో ఇప్పుడు 15.17 ఎకరాల భూమిపై…