Political News

వైసీపీలో మార్పులు షురూ.. జ‌గ‌న్ వ్యూహం ఏంటి?

ఎన్నిక‌లకు ముందు వైసీపీ అధినేత‌, అప్ప‌టి సీఎం జ‌గ‌న్ అనేక మార్పులు చేశారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త ఉంద‌ని.. సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను పొరుగు నియోజ‌క‌వ‌ర్గాల‌కు బ‌దిలీ చేశారు. కొంద‌రు ఆప్తుల‌ను మాత్రం వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల్లోనే కొన‌సాగించారు. అయితే.. చిత్రం ఏంటంటే.. ఇలా మార్పులు చేసిన చోటే కాకుండా.. సిట్టింగ్ స్థానాల్లో ఉన్న అభ్య‌ర్థుల‌ను కూడా ప్ర‌జ‌లు ఓడించారు. అంటే.. మార్పులు.. మ‌ర‌క‌లు వేశాయ‌నే చెప్పాలి.

ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌ల త‌ర్వాత‌.. నాలుగు మాసాల‌కు వైసీపీలో మరోసారి మార్పుల‌కు జ‌గ‌న్ శ్రీకారం చుట్టారు. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌లకు ముందు నాయ‌కులు వేర్వేరు నియోజ‌క‌వ‌ర్గాల‌కు వెళ్లిపోయిన ద‌రిమిలా.. ఇప్పుడు తమ త‌మ స్థానాల‌కు పంపించాల‌న్న డిమాండ్లు వ‌స్తున్నాయి. త‌మ పాత నియోజ‌క‌వ‌ర్గాల‌కు వెళ్లి.. రాజ‌కీయాల‌ను సెట్ చేసుకుంటామ‌ని వారు కోరుతున్నారు. కానీ, దీనికి భిన్నంగా మ‌రో వ్యూహంతో జ‌గ‌న్ అడుగులు వేస్తున్నారు.

సామాజిక వ‌ర్గ స‌మీక‌ర‌ణ‌ల ఆధారంగా కాకుండా.. వ్య‌క్తుల ప్రాధాన్యాన్ని అనుస‌రించి జ‌గ‌న్ మార్పుల‌కు శ్రీకారం చుడుతున్నారు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం వెస్ట్‌కు వెళ్లిపోతాన‌ని కొన్నాళ్లుగా చెబుతున్నారు. కానీ, ఆయ‌న‌ను జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గానికి షిఫ్ట్ చేస్తున్నారని తెలిసింది. అదేస‌మ‌యంలో సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణును విజ‌య‌వాడ తూర్పున‌కు బ‌దిలీ చేస్తున్నార‌ట‌.

తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న యువ‌నాయ‌కుడు.. దేవినేని అవినాష్ చౌద‌రిని పెన‌మ‌లూరు నియోజ క‌వ‌ర్గానికి, అక్క‌డి జోగి ర‌మేష్‌ను మైల‌వ‌రానికి పంపిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అదేవిధంగా గుంటూరు జిల్లాకు వ‌చ్చే స‌రికి పెదకూరపాడు నుంచి తాజా ఎన్నికలలో సెట్టింగ్ ఎమ్మెల్యే హోదాలో పోటీ చేసిన నంబూరు శంకరరావును స‌త్తెన‌ప‌ల్లికి బ‌దిలీ చేస్తున్నారు. స‌త్తెన‌ప‌ల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబును గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు.

ఇక‌, చిల‌క‌లూరి పేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన కావ‌టి మనోహర్ నాయుడును పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌లు చూసుకోవాల‌ని చెప్పార‌ట‌. అదేస‌మ‌యంలో అంబటి రాంబాబుకు పొన్నూరు నియోజకవర్గ పార్టీ పగ్గాలు అప్పగించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌, గుంటూరు జిల్లాల‌పై క‌స‌ర‌త్తు చేసిన జ‌గ‌న్‌.. సామాజిక వ‌ర్గాల ఆధారంగా కాకుండా.. నియోజ‌క‌వ‌ర్గాలు, వ్య‌క్తుల ఆధారంగా చ‌ర్య‌లు తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 7, 2024 6:29 pm

Share

Recent Posts

రాకా సెట్లో మంచు లక్ష్మి… వావ్ వావ్ వావ్

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…

36 minutes ago

విశాఖలో విద్యార్థుల లవ్ వార్… హద్దు మీరిపోయారు!

విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…

56 minutes ago

చివరి సినిమా టోటల్ కలెక్షన్లు… ఒక్క రోజులోనే ఔట్

మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…

59 minutes ago

సందీప్ వెర్సస్ దీపిక… మళ్లీ రాజుకుంది

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…

1 hour ago

చిరు భలే బోల్తా కొట్టించాడుగా

ఏదో ఈవెంట్‌కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…

3 hours ago

సాలిడ్ కంటెంట్ పడితే రవితేజ స్టామినా ఇది

టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…

3 hours ago