కేవీపీ రామచంద్రరావు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని దాదాపు ఈయనే నడిపించారన్న వాదన కూడా వినిపించింది. అయితే.. తాజాగా మరోసారి ఆయన తెరమీదికి వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు నేతృత్వంలో సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయాలకు కేవీపీ రామచంద్రరావు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ముఖ్యంగా అన్ని వైపుల నుంచి హైడ్రాపై వ్యతిరేకత రావడం, సామాన్యుల నుంచి ఆగ్రహం కూడా వ్యక్తమవడం.. మరోవైపు హైకోర్టు కూడా హైడ్రాపై సీరియస్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.
ఇలాంటి సమయంలో కేవీపీ అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. “నేను కాంగ్రెస్వాడినే. మీకన్నా సీనియర్ నే అయినా.. నాకు ఎలాంటి మినహాయింపులు అవసరం లేదు. నా భవనాలు కూడా బఫర్ జోన్లో ఉన్నాయని మీరు భావిస్తే.. అధికారులు నిర్ణయిస్తే.. వాటిని కూడా కూల్చేయండి. మీకు నా సంపూర్ణ సహకారం ఉంటుంది” అని కేవీపీ తేల్చి చెప్పారు. అంతేకాదు.. సామాన్యులను ఇబ్బంది పెట్టవద్దని ఆయన సూచించారు. సామాన్యులు రూపాయి రూపాయి పోగు చేసుకుని నిర్మించుకున్న గూడుకు ప్రభుత్వమే భద్రత కల్పించాలని సూచించారు.
ఈ విషయంలో తప్ప.. తన విషయంలో ఎలాంటి మినహాయింపులు అవసరం లేదని కేవీపీ తేల్చి చెప్పారు. తన మిత్రులు, శ్రేయోభిలాషులు కూడా.. హైడ్రాను స్వాగతిస్తున్నట్టు కేవీపీ తెలిపారు. హైడ్రా రెండో దశ ఆక్రమణల కూల్చి వేతలను కూడా ప్రారంభించాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. మూసీ నదిని సుందరంగా తీర్చిదిద్దాలన్న మీ(రేవంత్) సంకల్పం గొప్పదని కేవీపీ పేర్కొన్నారు. దీనికి తమ వైపు నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తుందన్నారు. హైడ్రాపైనా.. మీపైనా కొందరు నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తున్నారని కేవీపీ మండిపడ్డారు.
ఇలాంటి వాటిని, ఇలా విమర్శలు చేసేవారిని అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మీరు(రేవంత్) ఎంచుకున్న అభివృద్ధి దిశగా అడుగులు వడివడిగా వేయాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు కేవీపీ పేర్కొన్నారు. మూసీ నది సుందరీకరణ విషయంలో ప్రతిపక్షాలది మొసలి కన్నీరేనని విమర్శించారు. ఈ విషయం సామాన్య ప్రజలకు కూడా తెలుసునని.. అందుకే సర్కారుపై వ్యతిరేకత రాలేదని వ్యాఖ్యానించారు. “ఒక మంచి పనిచేస్తుంటే.. సైంధవులు కొందరు అడ్డు పడతారు. ఇప్పుడు మీరు కూడా అలానే ఎదుర్కొంటున్నారు. కాబట్టి మీరు చేపట్టిన పనిలో ముందుకుసాగండి. విజయం కాంగ్రెస్కే దక్కుతుంది” అని కేవీపీ పేర్కొన్నారు.
This post was last modified on October 4, 2024 10:41 pm
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…