తెలంగాణ మంత్రి, సీనియర్ నాయకురాలు కొండా సురేఖ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. గత నాలుగు రోజులుగా ఆమె వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ ఎంపీ రఘునందనరావుతో కలిసి పాల్గొన్న కార్యక్రమంలో తీసిన ఫొటోను మార్ఫింగ్ చేసి.. తనను మానసికంగా బాధించారని చెప్పిన సురేఖ.. అంతో ఇంతో సింపతీ సంపాయించుకున్నారు. ఇదేసమ యంలో ఆమె మాజీ మంత్రి కేటీఆర్ను కేంద్రంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. అయితే.. ఇంతలోనే ఆమె నోరు జారి నానా మాటలు అనేశారు. ఇవే ఇప్పుడు సురేఖకు ప్రాణ సంకటంగా మారాయి.
అక్కినేని నాగార్జున కోడలు(మాజీ) సమంతను కేటీఆర్ పిలిచారంటూ.. పెద్ద బాంబు పేల్చారు సురేఖ. ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలంటే అలా చేయాలని షరతు పెట్టారని అన్నారు. దీనికి సమంత అంగీకరించలేదన్నారు. అంతేకాదు.. ఇదే ఆమెతో నాగ చైతన్య విడాకులు తీసుకునేందుకు కారణమైందని కూడా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడితో కూడా ఆగకుండా ఫోన్లను ట్యాప్ చేసి కేటీఆర్ వికృతానందం పొందారని సురేఖ వ్యాఖ్యానించారు. అయితే.. ఈ వ్యాఖ్యలు రాజకీయంగానే కాకుండా.. సామాజిక పరంగా కూడా తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఇప్పటికే అక్కినేని నాగార్జున రియాక్ట్ అయ్యారు.
తమను రాజకీయాల్లోకి లాగొద్దని నాగార్జున వార్నింగ్ ఇచ్చారు. ఇక, ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ ఏకంగా మరో సంచలన ప్రకటన చేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తనకు బహిరంగం గా క్షమాపణ చెప్పాలన్నారు. 24 గంటల్లో ఆమె మీడియా ముందుకు వచ్చి తనకు క్షమాపణలు చెప్పకపోతే.. క్రిమినల్ కేసు పెడతానని కేటీఆర్ హెచ్చరించారు. తన గౌరవానికి భంగం కలిగించాలన్న లక్ష్యంతోనే సురేఖ తనపై అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు కేటీఆర్ .. సురేఖకు లీగల్ నోటీసులు పంపించారు. 24 గంటల్లోగా కొండా సురేఖ క్షమాపణ చెప్పకపోతే.. పరువు నష్టం దావా వేస్తానని తేల్చి చెప్పారు.
This post was last modified on October 3, 2024 10:03 am
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…