సీఎం చంద్రబాబు.. ఏపీ బీజేపీ చీఫ్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి వరసకు మరిది అవుతారన్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు వరకు కూడా ఎడమొహం పెడమొహంగా ఉన్న ఈ ఇద్దరు నాయకులు కూడా.. పొత్తులు కుదిరిన తర్వాత నుంచి గెలిచిన తర్వాత నుంచి సహకారం ప్రారంభించారు. గతంలో ఏనాడూ బహిరంగ వేదికలపై పురందేశ్వరి మాట కూడా పలకని చంద్రబాబు ఇటీవల కాలంలో అనేక సార్లు ఆమెతో చర్చలు చేశారు. బహిరంగ వేదికలపైనా మాట్లాడారు.
పురందేశ్వరి గారు.. అంటూ పలు సందర్భాల్లో చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక, పురందేశ్వరి కూడా.. టీడీపీ విషయంలో చాలా వరకు పొత్తు ధర్మంతో వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తిరుమల శ్రీవారి లడ్డూ విషయంపై ఆమె స్పందించారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆమె దాదాపు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఇలా దేవుడిని రాజకీయాలకు ఆపాదిస్తారా? అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
ఏ ఆధారాలతో లడ్డూ కల్తీ అయిందని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో వైరల్ అయ్యాయి. వీటిపై స్పందించేందుకు టీడీపీ నేతలు ఎవరూ ముందుకు రాలేదు. ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అని వారు వెనక్కి తగ్గారు. పార్టీ అధిష్టానం కూడా.. ఈ విషయంపై ఆచి తూచి మాట్లాడా లని నిర్ణయించింది. ఇలాంటి కీలక సమయంలో అనూహ్యంగా పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఆమె పరోక్షంగా తప్పుబట్టారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ని ఉద్దేశించి ఇలా వ్యాఖ్యలు చేయొచ్చా? అని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలలో తప్పేముందన్నారు. తనకు అందిన రిపోర్టులను బట్టి చంద్రబాబు మాట్లాడారని, ముఖ్య మంత్రి కాకపోతే.. ఇంత కీలక విషయంపై ఎవరు మాట్లాడతారని కూడా పురందేశ్వరి ప్రశ్నించారు. మొత్తానికి మరిదిని ఆమె వెనుకేసుకువచ్చారు.
This post was last modified on October 2, 2024 4:21 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…