Political News

కాంగ్రెస్‌లో ‘హైడ్రా-మూసీ’ వివాదం.. ఢిల్లీకి రేవంత్

తెలంగాణ‌లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డంతోపాటు మూసీ న‌దిని ప్ర‌క్షాళ‌న చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కంక‌ణం క‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే అనేక విమ‌ర్శ‌లు, వివాదాలు ఎదురైనా లెక్క‌చేయ‌కుండా ముందుకు సాగుతున్నారు. హైడ్రాను తీసుకువ‌చ్చి.. దాని ద్వారా క‌థ న‌డిపిస్తున్నారు. చెరువులు, కుంట‌ల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గిస్తు న్నారు. అయితే.. ఈ వ్య‌వ‌హారం.. పైకి బాగానే ఉన్నా.. పర్యావ‌ర‌ణ ప్రేమికులు మెచ్చుకుంటున్నా.. కీల‌క‌మైన పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల్లో మాత్రం కొంత వ్య‌తిరేక‌త పెల్లుబుకుతోంది.

ఈ విష‌యం జాతీయ మీడియా స‌హా స్థానిక మీడియాలోనూ ప్ర‌ధానంగా వ‌స్తోంది. ముఖ్యంగా దుర్గం చెరువు, ఇత‌ర పేద‌లు ఉండే బ‌స్తీల్లో హైడ్రా కూల్చివేత‌లు ఆయా వ‌ర్గాల‌ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ ప‌రిణామం.. ఓటు బ్యాంకు రాజ‌కీయాల దిశ‌గా అడుగులు వేస్తోంది. పేద‌ల ప‌క్షపాతిగా కేసీఆర్‌ను ప్రొజెక్టు చేసేందుకు బీఆర్ ఎస్ ప్ర‌య‌త్నిస్తుండ‌డం.. తాము మాత్ర‌మే పేద‌ల గురించిఆలోచించామ‌ని మాజీ మంత్రులు కేటీఆర్‌, హ‌రీష్‌రావులు ప్ర‌క‌టించ‌డం తెలిసిందే. ఈ ప‌రిణామాలతో స‌హ‌జం గానే పేద‌ల ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు దూర‌మ‌వుతుంద‌ని వీహెచ్ స‌హా కొంద‌రు సీనియ‌ర్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

కూల్చివేత‌ల‌ను స‌మ‌ర్థిస్తూనే, చెరువులు, కుంట‌లు బాగుండాల‌ని కోరుకుంటూనే పేద‌ల‌కు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి ఇబ్బంది లేని విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు కోరుతున్నారు. కానీ, హైడ్రా ఇప్ప‌టికే చేయాల్సింది చేసింది. దీంతో కాంగ్రెస్ పాల‌న అంటే కూల్చివేత‌లు అనే టాక్ ప్ర‌బ‌లి పోయింది. ఆదిలో బాగానే ఉన్నా.. ఇప్పుడు ఎవ‌రిని క‌దిలించినా హైడ్రా అంటే కూల్చివేత‌ల‌కు మారు పేరుగా మారిపోయింది. ఈ వ్య‌వ‌హారాన్నినిశితంగా గ‌మ‌నిస్తున్న పార్టీ అధిష్టానం.. అస‌లు ఏం జరుగుతోంద‌న్న విష‌యాన్ని ఆరా తీస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు.

స్థానిక సంస్థ‌ల‌కు త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డం.. మ‌రోవైపు హైడ్రా దూకుడు, మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న వంటి అంశాల‌పై ఆయ‌న అధిష్టానానికి వివ‌ర‌ణ ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఓటుబ్యాంకు కు వ‌చ్చిన న‌ష్టం లేద‌ని.. అయితే.. కొంత ప్ర‌భావం చూపించినా.. త‌ట్టుకుని నిల‌బ‌డ‌తామ‌న్న ధీమా ఆయ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. అధిష్టానం మాత్రం ఆదిలోనే హంస పాదు మాదిరిగా ఉన్న వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టు జాతీయ మీడియా వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో కొంత సంయ‌మ‌నం పాటించేలా రేవంత్‌కు దిశానిర్దేశం చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.

This post was last modified on October 1, 2024 9:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హైదరాబాద్ ‘హై’ వోల్టేజ్ పెర్ఫార్మెన్స్.. కానీ..

ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్‌లో ఎదురుదెబ్బ తగిలినా, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్‌లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్‌కతాలోని…

4 minutes ago

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

5 hours ago

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

6 hours ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

7 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

8 hours ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

9 hours ago