తెలంగాణలో ఆక్రమణలను తొలగించడంతోపాటు మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అనేక విమర్శలు, వివాదాలు ఎదురైనా లెక్కచేయకుండా ముందుకు సాగుతున్నారు. హైడ్రాను తీసుకువచ్చి.. దాని ద్వారా కథ నడిపిస్తున్నారు. చెరువులు, కుంటల ఆక్రమణలను తొలగిస్తు న్నారు. అయితే.. ఈ వ్యవహారం.. పైకి బాగానే ఉన్నా.. పర్యావరణ ప్రేమికులు మెచ్చుకుంటున్నా.. కీలకమైన పేదలు, మధ్యతరగతి వర్గాల్లో మాత్రం కొంత వ్యతిరేకత పెల్లుబుకుతోంది.
ఈ విషయం జాతీయ మీడియా సహా స్థానిక మీడియాలోనూ ప్రధానంగా వస్తోంది. ముఖ్యంగా దుర్గం చెరువు, ఇతర పేదలు ఉండే బస్తీల్లో హైడ్రా కూల్చివేతలు ఆయా వర్గాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ పరిణామం.. ఓటు బ్యాంకు రాజకీయాల దిశగా అడుగులు వేస్తోంది. పేదల పక్షపాతిగా కేసీఆర్ను ప్రొజెక్టు చేసేందుకు బీఆర్ ఎస్ ప్రయత్నిస్తుండడం.. తాము మాత్రమే పేదల గురించిఆలోచించామని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్రావులు ప్రకటించడం తెలిసిందే. ఈ పరిణామాలతో సహజం గానే పేదల ఓటు బ్యాంకు కాంగ్రెస్కు దూరమవుతుందని వీహెచ్ సహా కొందరు సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కూల్చివేతలను సమర్థిస్తూనే, చెరువులు, కుంటలు బాగుండాలని కోరుకుంటూనే పేదలకు, మధ్యతరగతి వారికి ఇబ్బంది లేని విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కానీ, హైడ్రా ఇప్పటికే చేయాల్సింది చేసింది. దీంతో కాంగ్రెస్ పాలన అంటే కూల్చివేతలు అనే టాక్ ప్రబలి పోయింది. ఆదిలో బాగానే ఉన్నా.. ఇప్పుడు ఎవరిని కదిలించినా హైడ్రా అంటే కూల్చివేతలకు మారు పేరుగా మారిపోయింది. ఈ వ్యవహారాన్నినిశితంగా గమనిస్తున్న పార్టీ అధిష్టానం.. అసలు ఏం జరుగుతోందన్న విషయాన్ని ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు.
స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు జరుగుతుండడం.. మరోవైపు హైడ్రా దూకుడు, మూసీ నది ప్రక్షాళన వంటి అంశాలపై ఆయన అధిష్టానానికి వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఓటుబ్యాంకు కు వచ్చిన నష్టం లేదని.. అయితే.. కొంత ప్రభావం చూపించినా.. తట్టుకుని నిలబడతామన్న ధీమా ఆయన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ.. అధిష్టానం మాత్రం ఆదిలోనే హంస పాదు మాదిరిగా ఉన్న వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నట్టు జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. దీంతో కొంత సంయమనం పాటించేలా రేవంత్కు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది.
హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్ పరిచయం చేసిన కల్ట్ సిరీస్ గా 'ఈవిల్ డెడ్' సినిమాకున్న ఆదరణ…
కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…
నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…
పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…
పూరి జగన్నాథ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అదో రకమైన స్పెషల్ క్రేజ్ ఉండేది. స్టార్ హీరోతో చేసినా, కొత్తవాళ్లతో తీసినా…