Political News

కాంగ్రెస్‌లో ‘హైడ్రా-మూసీ’ వివాదం.. ఢిల్లీకి రేవంత్

తెలంగాణ‌లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డంతోపాటు మూసీ న‌దిని ప్ర‌క్షాళ‌న చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కంక‌ణం క‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే అనేక విమ‌ర్శ‌లు, వివాదాలు ఎదురైనా లెక్క‌చేయ‌కుండా ముందుకు సాగుతున్నారు. హైడ్రాను తీసుకువ‌చ్చి.. దాని ద్వారా క‌థ న‌డిపిస్తున్నారు. చెరువులు, కుంట‌ల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గిస్తు న్నారు. అయితే.. ఈ వ్య‌వ‌హారం.. పైకి బాగానే ఉన్నా.. పర్యావ‌ర‌ణ ప్రేమికులు మెచ్చుకుంటున్నా.. కీల‌క‌మైన పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల్లో మాత్రం కొంత వ్య‌తిరేక‌త పెల్లుబుకుతోంది.

ఈ విష‌యం జాతీయ మీడియా స‌హా స్థానిక మీడియాలోనూ ప్ర‌ధానంగా వ‌స్తోంది. ముఖ్యంగా దుర్గం చెరువు, ఇత‌ర పేద‌లు ఉండే బ‌స్తీల్లో హైడ్రా కూల్చివేత‌లు ఆయా వ‌ర్గాల‌ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ ప‌రిణామం.. ఓటు బ్యాంకు రాజ‌కీయాల దిశ‌గా అడుగులు వేస్తోంది. పేద‌ల ప‌క్షపాతిగా కేసీఆర్‌ను ప్రొజెక్టు చేసేందుకు బీఆర్ ఎస్ ప్ర‌య‌త్నిస్తుండ‌డం.. తాము మాత్ర‌మే పేద‌ల గురించిఆలోచించామ‌ని మాజీ మంత్రులు కేటీఆర్‌, హ‌రీష్‌రావులు ప్ర‌క‌టించ‌డం తెలిసిందే. ఈ ప‌రిణామాలతో స‌హ‌జం గానే పేద‌ల ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు దూర‌మ‌వుతుంద‌ని వీహెచ్ స‌హా కొంద‌రు సీనియ‌ర్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

కూల్చివేత‌ల‌ను స‌మ‌ర్థిస్తూనే, చెరువులు, కుంట‌లు బాగుండాల‌ని కోరుకుంటూనే పేద‌ల‌కు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి ఇబ్బంది లేని విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు కోరుతున్నారు. కానీ, హైడ్రా ఇప్ప‌టికే చేయాల్సింది చేసింది. దీంతో కాంగ్రెస్ పాల‌న అంటే కూల్చివేత‌లు అనే టాక్ ప్ర‌బ‌లి పోయింది. ఆదిలో బాగానే ఉన్నా.. ఇప్పుడు ఎవ‌రిని క‌దిలించినా హైడ్రా అంటే కూల్చివేత‌ల‌కు మారు పేరుగా మారిపోయింది. ఈ వ్య‌వ‌హారాన్నినిశితంగా గ‌మ‌నిస్తున్న పార్టీ అధిష్టానం.. అస‌లు ఏం జరుగుతోంద‌న్న విష‌యాన్ని ఆరా తీస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు.

స్థానిక సంస్థ‌ల‌కు త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డం.. మ‌రోవైపు హైడ్రా దూకుడు, మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న వంటి అంశాల‌పై ఆయ‌న అధిష్టానానికి వివ‌ర‌ణ ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఓటుబ్యాంకు కు వ‌చ్చిన న‌ష్టం లేద‌ని.. అయితే.. కొంత ప్ర‌భావం చూపించినా.. త‌ట్టుకుని నిల‌బ‌డ‌తామ‌న్న ధీమా ఆయ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. అధిష్టానం మాత్రం ఆదిలోనే హంస పాదు మాదిరిగా ఉన్న వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టు జాతీయ మీడియా వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో కొంత సంయ‌మ‌నం పాటించేలా రేవంత్‌కు దిశానిర్దేశం చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.

This post was last modified on October 1, 2024 9:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినీ పితామహుడుగా జూనియర్ ఎన్టీఆర్ ?

ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా, దేవర 2లకు కమిట్ మెంట్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత…

14 minutes ago

రోహిత్ శర్మ… ఒక్క ఫోటోతో పొలిటికల్ అలజడి!

ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలవడం…

43 minutes ago

గోవింద‌ప్ప‌కు జైలు.. ఇక నోరు విప్పడమే తరువాయి

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన లిక్క‌ర్ స్కాంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నిందితుడు(ఏ-33)కి విజ‌య‌వాడ‌లోని ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్…

46 minutes ago

పాక్ కు మద్దతు ఇచ్చిన దేశాలకు ఊహించని నష్టాలు

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశవ్యాప్తంగా దేశభక్తి జ్వాలలు మిన్నంటుతున్నాయి. పాక్‌కు మద్దతు పలికిన…

1 hour ago

ఉన్నది ఇద్దరే!.. ప్రాధాన్యం ఎనలేనిదే!

నిజమే.. ఏపీలోని కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి లోక్ సభలో ఉన్నది ఇద్దరంటే ఇద్దరు సభ్యులు మాత్రమే.…

1 hour ago

నాని ప్లస్ అనిరుధ్ – అదిరిపోయే రేటు

న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ సెట్లో ఇంకా హీరో అడుగు పెట్టకుండానే…

2 hours ago