Political News

కాంగ్రెస్‌లో ‘హైడ్రా-మూసీ’ వివాదం.. ఢిల్లీకి రేవంత్

తెలంగాణ‌లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డంతోపాటు మూసీ న‌దిని ప్ర‌క్షాళ‌న చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కంక‌ణం క‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే అనేక విమ‌ర్శ‌లు, వివాదాలు ఎదురైనా లెక్క‌చేయ‌కుండా ముందుకు సాగుతున్నారు. హైడ్రాను తీసుకువ‌చ్చి.. దాని ద్వారా క‌థ న‌డిపిస్తున్నారు. చెరువులు, కుంట‌ల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గిస్తు న్నారు. అయితే.. ఈ వ్య‌వ‌హారం.. పైకి బాగానే ఉన్నా.. పర్యావ‌ర‌ణ ప్రేమికులు మెచ్చుకుంటున్నా.. కీల‌క‌మైన పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల్లో మాత్రం కొంత వ్య‌తిరేక‌త పెల్లుబుకుతోంది.

ఈ విష‌యం జాతీయ మీడియా స‌హా స్థానిక మీడియాలోనూ ప్ర‌ధానంగా వ‌స్తోంది. ముఖ్యంగా దుర్గం చెరువు, ఇత‌ర పేద‌లు ఉండే బ‌స్తీల్లో హైడ్రా కూల్చివేత‌లు ఆయా వ‌ర్గాల‌ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ ప‌రిణామం.. ఓటు బ్యాంకు రాజ‌కీయాల దిశ‌గా అడుగులు వేస్తోంది. పేద‌ల ప‌క్షపాతిగా కేసీఆర్‌ను ప్రొజెక్టు చేసేందుకు బీఆర్ ఎస్ ప్ర‌య‌త్నిస్తుండ‌డం.. తాము మాత్ర‌మే పేద‌ల గురించిఆలోచించామ‌ని మాజీ మంత్రులు కేటీఆర్‌, హ‌రీష్‌రావులు ప్ర‌క‌టించ‌డం తెలిసిందే. ఈ ప‌రిణామాలతో స‌హ‌జం గానే పేద‌ల ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు దూర‌మ‌వుతుంద‌ని వీహెచ్ స‌హా కొంద‌రు సీనియ‌ర్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

కూల్చివేత‌ల‌ను స‌మ‌ర్థిస్తూనే, చెరువులు, కుంట‌లు బాగుండాల‌ని కోరుకుంటూనే పేద‌ల‌కు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి ఇబ్బంది లేని విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు కోరుతున్నారు. కానీ, హైడ్రా ఇప్ప‌టికే చేయాల్సింది చేసింది. దీంతో కాంగ్రెస్ పాల‌న అంటే కూల్చివేత‌లు అనే టాక్ ప్ర‌బ‌లి పోయింది. ఆదిలో బాగానే ఉన్నా.. ఇప్పుడు ఎవ‌రిని క‌దిలించినా హైడ్రా అంటే కూల్చివేత‌ల‌కు మారు పేరుగా మారిపోయింది. ఈ వ్య‌వ‌హారాన్నినిశితంగా గ‌మ‌నిస్తున్న పార్టీ అధిష్టానం.. అస‌లు ఏం జరుగుతోంద‌న్న విష‌యాన్ని ఆరా తీస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు.

స్థానిక సంస్థ‌ల‌కు త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డం.. మ‌రోవైపు హైడ్రా దూకుడు, మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న వంటి అంశాల‌పై ఆయ‌న అధిష్టానానికి వివ‌ర‌ణ ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఓటుబ్యాంకు కు వ‌చ్చిన న‌ష్టం లేద‌ని.. అయితే.. కొంత ప్ర‌భావం చూపించినా.. త‌ట్టుకుని నిల‌బ‌డ‌తామ‌న్న ధీమా ఆయ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. అధిష్టానం మాత్రం ఆదిలోనే హంస పాదు మాదిరిగా ఉన్న వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టు జాతీయ మీడియా వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో కొంత సంయ‌మ‌నం పాటించేలా రేవంత్‌కు దిశానిర్దేశం చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.

This post was last modified on October 1, 2024 9:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

53 minutes ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

1 hour ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

2 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

3 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

4 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

5 hours ago