రాజకీయాల్లో నాయకులు ముందుంటారు. కార్యకర్తలను వారే నడిపిస్తారు. ఇది ఎక్కడైనా జరిగేదే. అయితే .. వైసీపీలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. నాయకుడిగా జగన్ సేఫ్ జోన్ చూసుకుంటున్నా రు. కార్యకర్తలు మాత్రం బలయ్యే పరిస్థితి ఏర్పడింది. గతంలోనూ.. ఇప్పుడు కూడా.. కార్యకర్తలు, చోటా నాయకులు కేసుల్లో చిక్కుకుంటున్నారు. పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. జైళ్లకు వెళ్తున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులోనూ ఇప్పటికీ 30 మంది వైసీపీ కార్యకర్తల్లో జైళ్లలోనే మగ్గుతున్నారు.
కీలక నాయకులు మాత్రం సేఫ్గా బయటకు వచ్చారు. బెయిల్ తెచ్చుకున్నారు. మరి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల పరిస్థితి ఏంటనేది మాత్రం జగన్ ఏమాత్రం ఆలోచించడం లేదు. ఇక, ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే.. శనివారం(ఈ రోజు) రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు వైసీపీ పిలుపునిచ్చింది. జగన్ తిరుమల పర్యటనకు వెళ్తున్నారని(దీనిని రద్దు చేసుకున్నారు) ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు చేసి నిరసన వ్యక్తం చేయాలని పార్టీ పేర్కొంది.
దీంతో కార్యకర్తలు, చోటా నాయకులు నిరసన కార్యక్రమాల కోసం రెడీ అయ్యారు. అయితే.. ఎక్కడికక్కడ పోలీసులు మాత్రం ఈ కార్యక్రమాలు అనుమతులు లేవని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఈ వ్యవహారం వివాదానికి దారితీస్తోంది. పోలీసుల ఆంక్షలను కాదని బయటకు వస్తే.. కార్యకర్తలపై కేసు లు పెట్టేందుకు పోలీసులు రెడీ అయ్యారు. ఇదే జరిగితే.. కార్యకర్తలు బలి అవుతారు. ఇంత జరుగుతున్నా.. జగన్ మాత్రం తన సేఫ్టీ తాను చూసుకుంటున్నారు.
నిజానికి కార్యకర్తలకు అండగా ఉండాల్సిన జగన్.. తాడేపల్లిలో కూర్చుని ప్రెస్ మీట్లకే పరిమితం అవుతు న్నారు. పైగా శనివారం రాష్ట్రంలో నిరసనలు చేయాలని చెప్పిన జగన్.. మరోవైపు ఆయన మాత్రం బెంగళూరుకు వెళ్లిపోతున్నారు. ఈ పరిణామాలతో వైసీపీ కార్యకర్తలు లబోదిబోమంటున్నారు. తమను అరెస్టు చేసినా, కేసులు నమోదు చేసినా ఎవరు ఆదుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on September 28, 2024 10:46 am
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అని చెప్పుకోదగ్గ సినిమాల్లో తొలిప్రేమ స్థానం చాలా ప్రత్యేకం. అప్పట్లో…
తమిళనాడు ఎన్నికల తేదీ వచ్చేయడంతో కోలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్ల ప్రకటనలు ఊపందుకోబోతున్నాయి. స్థానిక రాజకీయా పార్టీల ప్రాబల్యం తీవ్రంగా…
ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ…
ఇంట్లో బైక్ను స్టార్ట్లో ఉంచడంతో వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన…
క్రీడల నేపథ్యంలో సినిమాలు తీయడం తెలుగులో అయితే ఎంతో కొంత రిస్కుతో కూడుకున్నదే. జెర్సీకి ఎంత గొప్ప పేరు వచ్చినా…
కొన్ని వారాల క్రితం జరిగిన కల్ట్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఒక పెద్ద…