Political News

జ‌గ‌న్ సేఫ్‌.. కార్య‌క‌ర్త‌లే బ‌లి!

రాజ‌కీయాల్లో నాయ‌కులు ముందుంటారు. కార్య‌క‌ర్త‌ల‌ను వారే న‌డిపిస్తారు. ఇది ఎక్క‌డైనా జ‌రిగేదే. అయితే .. వైసీపీలో మాత్రం దీనికి భిన్న‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. నాయ‌కుడిగా జ‌గ‌న్ సేఫ్ జోన్ చూసుకుంటున్నా రు. కార్య‌క‌ర్త‌లు మాత్రం బ‌ల‌య్యే ప‌రిస్థితి ఏర్ప‌డింది. గ‌తంలోనూ.. ఇప్పుడు కూడా.. కార్య‌క‌ర్త‌లు, చోటా నాయ‌కులు కేసుల్లో చిక్కుకుంటున్నారు. పోలీసు స్టేష‌న్ల చుట్టూ తిరుగుతున్నారు. జైళ్ల‌కు వెళ్తున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులోనూ ఇప్ప‌టికీ 30 మంది వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లో జైళ్ల‌లోనే మ‌గ్గుతున్నారు.

కీల‌క నాయ‌కులు మాత్రం సేఫ్‌గా బ‌య‌ట‌కు వ‌చ్చారు. బెయిల్ తెచ్చుకున్నారు. మ‌రి పార్టీ కోసం ప‌నిచేసిన కార్య‌క‌ర్త‌ల ప‌రిస్థితి ఏంటనేది మాత్రం జ‌గ‌న్ ఏమాత్రం ఆలోచించ‌డం లేదు. ఇక‌, ప్ర‌స్తుత ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. శ‌నివారం(ఈ రోజు) రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌ల‌కు వైసీపీ పిలుపునిచ్చింది. జ‌గ‌న్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నార‌ని(దీనిని ర‌ద్దు చేసుకున్నారు) ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యాల్లో పూజ‌లు చేసి నిర‌స‌న వ్య‌క్తం చేయాల‌ని పార్టీ పేర్కొంది.

దీంతో కార్య‌క‌ర్త‌లు, చోటా నాయ‌కులు నిర‌స‌న కార్య‌క్ర‌మాల కోసం రెడీ అయ్యారు. అయితే.. ఎక్క‌డిక‌క్క‌డ పోలీసులు మాత్రం ఈ కార్య‌క్ర‌మాలు అనుమ‌తులు లేవ‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో రాజకీయంగా ఈ వ్య‌వ‌హారం వివాదానికి దారితీస్తోంది. పోలీసుల ఆంక్ష‌ల‌ను కాద‌ని బ‌య‌ట‌కు వ‌స్తే.. కార్య‌క‌ర్త‌ల‌పై కేసు లు పెట్టేందుకు పోలీసులు రెడీ అయ్యారు. ఇదే జ‌రిగితే.. కార్య‌క‌ర్త‌లు బ‌లి అవుతారు. ఇంత జ‌రుగుతున్నా.. జ‌గ‌న్ మాత్రం త‌న సేఫ్‌టీ తాను చూసుకుంటున్నారు.

నిజానికి కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా ఉండాల్సిన జ‌గ‌న్‌.. తాడేప‌ల్లిలో కూర్చుని ప్రెస్ మీట్ల‌కే ప‌రిమితం అవుతు న్నారు. పైగా శ‌నివారం రాష్ట్రంలో నిర‌స‌న‌లు చేయాల‌ని చెప్పిన జ‌గ‌న్‌.. మ‌రోవైపు ఆయ‌న మాత్రం బెంగళూరుకు వెళ్లిపోతున్నారు. ఈ ప‌రిణామాల‌తో వైసీపీ కార్య‌క‌ర్త‌లు ల‌బోదిబోమంటున్నారు. త‌మ‌ను అరెస్టు చేసినా, కేసులు న‌మోదు చేసినా ఎవరు ఆదుకుంటార‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

This post was last modified on September 28, 2024 10:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

33 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

1 hour ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago