రాజకీయాల్లో నాయకులు ముందుంటారు. కార్యకర్తలను వారే నడిపిస్తారు. ఇది ఎక్కడైనా జరిగేదే. అయితే .. వైసీపీలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. నాయకుడిగా జగన్ సేఫ్ జోన్ చూసుకుంటున్నా రు. కార్యకర్తలు మాత్రం బలయ్యే పరిస్థితి ఏర్పడింది. గతంలోనూ.. ఇప్పుడు కూడా.. కార్యకర్తలు, చోటా నాయకులు కేసుల్లో చిక్కుకుంటున్నారు. పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. జైళ్లకు వెళ్తున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులోనూ ఇప్పటికీ 30 మంది వైసీపీ కార్యకర్తల్లో జైళ్లలోనే మగ్గుతున్నారు.
కీలక నాయకులు మాత్రం సేఫ్గా బయటకు వచ్చారు. బెయిల్ తెచ్చుకున్నారు. మరి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల పరిస్థితి ఏంటనేది మాత్రం జగన్ ఏమాత్రం ఆలోచించడం లేదు. ఇక, ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే.. శనివారం(ఈ రోజు) రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు వైసీపీ పిలుపునిచ్చింది. జగన్ తిరుమల పర్యటనకు వెళ్తున్నారని(దీనిని రద్దు చేసుకున్నారు) ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు చేసి నిరసన వ్యక్తం చేయాలని పార్టీ పేర్కొంది.
దీంతో కార్యకర్తలు, చోటా నాయకులు నిరసన కార్యక్రమాల కోసం రెడీ అయ్యారు. అయితే.. ఎక్కడికక్కడ పోలీసులు మాత్రం ఈ కార్యక్రమాలు అనుమతులు లేవని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఈ వ్యవహారం వివాదానికి దారితీస్తోంది. పోలీసుల ఆంక్షలను కాదని బయటకు వస్తే.. కార్యకర్తలపై కేసు లు పెట్టేందుకు పోలీసులు రెడీ అయ్యారు. ఇదే జరిగితే.. కార్యకర్తలు బలి అవుతారు. ఇంత జరుగుతున్నా.. జగన్ మాత్రం తన సేఫ్టీ తాను చూసుకుంటున్నారు.
నిజానికి కార్యకర్తలకు అండగా ఉండాల్సిన జగన్.. తాడేపల్లిలో కూర్చుని ప్రెస్ మీట్లకే పరిమితం అవుతు న్నారు. పైగా శనివారం రాష్ట్రంలో నిరసనలు చేయాలని చెప్పిన జగన్.. మరోవైపు ఆయన మాత్రం బెంగళూరుకు వెళ్లిపోతున్నారు. ఈ పరిణామాలతో వైసీపీ కార్యకర్తలు లబోదిబోమంటున్నారు. తమను అరెస్టు చేసినా, కేసులు నమోదు చేసినా ఎవరు ఆదుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on September 28, 2024 10:46 am
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…
అనామకుడైన ఒక కుర్రాడు హీరోగా నటించిన తొలి సినిమాతోనే వంద కోట్ల వసూళ్లు రాబట్టడమే అనూహ్యం. అలాంటిది ఆ హీరో తర్వాతి…