వైసీపీ హయాంలో మద్యపాన నిషేధం అంటూ నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు విక్రయించారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతల నుంచి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అదీగాక, వైసీపీ నేతలకు చెందిన మద్యం కంపెనీల నుంచి నాసిరకం మద్యాన్ని…ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరఫరా చేశారని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. అంతేకాదు, మద్యం అమ్మకాలకు చెందిన లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని, మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులను అనుమతించలేదని ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఆబ్కారీ శాఖను ప్రక్షాళన చేస్తానని చెప్పిన సీఎం చంద్రబాబు ఆ దిశగా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం షాపులు రద్దు చేస్తూ ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దాంతోపాటు, ఏపీలో ఇకపై రిటైల్ మద్యం షాపులకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది. రాష్ట్రంలో ఉన్న 3,736 మద్యం షాపులకు టెండర్లు పిలిచేందుకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అందులో 340 మద్యం షాపులను కల్లు గీత కార్మికులకు కేటాయించనుంది.
దసరా పండుగకు ముందే కొత్త మద్యం పాలసీ ప్రకారం రిటైల్ షాపులు ఓపెన్ అయ్యేలా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అక్టోబర్ 4, 5 తేదీల నాటికి కొత్త మద్యం విధానం అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. ఒక్కో టెండర్ దరఖాస్తు రుసుము రెండు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. లాటరీ విధానంలో షాపులు దక్కని వారికి ఆ రుసుము తిరిగి చెల్లించరు.
కొత్త పాలసీ అమల్లోకి వచ్చిన వెంటనే క్వార్టర్ మద్యం రూ. 99కే అందనుంది. దాంతోపాటు, నాణ్యమైన అన్ని మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచనున్నారు. తిరుపతి మినహా రాష్ట్రంలోని 12 ప్రాంతాల్లో ప్రీమియర్ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. టెండర్ దక్కించుకున్న వారి లైసెన్స్ రెండేళ్లపాటు అమల్లో ఉంటుంది. కొత్త పాలసీలో భాగంగా మద్యం దుకాణాలకు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి ఉంటుంది. జనాభా ఆధారంగా మద్యం దుకాణాల సంఖ్యను నిర్ణయించారు.
This post was last modified on September 27, 2024 9:15 am
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…