Political News

ప్రభుత్వ మద్యం షాపులు రద్దుకు ఆర్డినెన్స్

వైసీపీ హయాంలో మద్యపాన నిషేధం అంటూ నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు విక్రయించారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతల నుంచి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అదీగాక, వైసీపీ నేతలకు చెందిన మద్యం కంపెనీల నుంచి నాసిరకం మద్యాన్ని…ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరఫరా చేశారని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. అంతేకాదు, మద్యం అమ్మకాలకు చెందిన లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని, మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులను అనుమతించలేదని ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఆబ్కారీ శాఖను ప్రక్షాళన చేస్తానని చెప్పిన సీఎం చంద్రబాబు ఆ దిశగా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం షాపులు రద్దు చేస్తూ ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దాంతోపాటు, ఏపీలో ఇకపై రిటైల్ మద్యం షాపులకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది. రాష్ట్రంలో ఉన్న 3,736 మద్యం షాపులకు టెండర్లు పిలిచేందుకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అందులో 340 మద్యం షాపులను కల్లు గీత కార్మికులకు కేటాయించనుంది.

దసరా పండుగకు ముందే కొత్త మద్యం పాలసీ ప్రకారం రిటైల్ షాపులు ఓపెన్ అయ్యేలా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అక్టోబర్ 4, 5 తేదీల నాటికి కొత్త మద్యం విధానం అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. ఒక్కో టెండర్ దరఖాస్తు రుసుము రెండు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. లాటరీ విధానంలో షాపులు దక్కని వారికి ఆ రుసుము తిరిగి చెల్లించరు.

కొత్త పాలసీ అమల్లోకి వచ్చిన వెంటనే క్వార్టర్ మద్యం రూ. 99కే అందనుంది. దాంతోపాటు, నాణ్యమైన అన్ని మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచనున్నారు. తిరుపతి మినహా రాష్ట్రంలోని 12 ప్రాంతాల్లో ప్రీమియర్‌ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. టెండర్ దక్కించుకున్న వారి లైసెన్స్ రెండేళ్లపాటు అమల్లో ఉంటుంది. కొత్త పాలసీలో భాగంగా మద్యం దుకాణాలకు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి ఉంటుంది. జనాభా ఆధారంగా మద్యం దుకాణాల సంఖ్యను నిర్ణయించారు.

This post was last modified on September 27, 2024 9:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేమలు బ్యూటీకి సీనియర్ స్టార్ల ఛాన్సులు

గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…

5 hours ago

సునీతా విలియమ్స్ భారత పర్యటన.. ఎప్పుడంటే?

అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్‌కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…

6 hours ago

IPL 2025: 13 ఏళ్ల కుర్రాడి ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు?

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అడుగుపెడుతున్న…

6 hours ago

DSP విలువ తెలిసినట్టు ఉందే

సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…

7 hours ago

ఆదివారం రిలీజ్ ఎందుకు భాయ్

సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…

7 hours ago

క్షేమంగా తిరిగొచ్చిన సునీత… అమెరికా, భారత్ లో సంబరాలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…

8 hours ago