Political News

వరద బాధితుల ఖాతాల్లో పరిహారం జమ: చంద్రబాబు

భారీ వర్షాలు, వ‌ర‌ద‌ల‌ వల్ల విజయవాడ నగరం కొద్ది రోజుల క్రితం చిగురుటాకులా వణికి పోయిన సంగతి తెలిసిందే. వరదలకు తోడు బుడమేరు వాగు పొంగడంతో బెజవాడ వాసులు బెంబేలెత్తిపోయారు. అయితే, అంత కష్టంలో ఉన్న తన ప్రజలను కాపాడుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగడం, ఏడు పదుల వయసులోనూ వరద నీటిలో దిగి బాధితులకు నేనున్నాను అని భరోసానివ్వడంతో వారంతా ధైర్యంతో ఆ విపత్తును ఎదుర్కొన్నారు. పది రోజుల పాటు కలెక్టరేట్ లోనే మకాం వేసిన చంద్రబాబు ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో బాధితులకు సాయమందించారు.

ఈ క్రమంలోనే వరదల నుంచే కాదు..వరద బాధితులకు వరద మిగిల్చిన ఆర్థిక ముప్పు నుంచి కూడా వారిని చంద్రబాబు బయటపడేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా వరద బాధితులకు పరిహారాన్ని యుద్ధ ప్రాతిపదికన నేడు చంద్రబాబు విడుదల చేశారు. ఈ రోజు వరద బాధితుల ఖాతాల్లోకే నేరుగా సాయం నగదును ప్రభుత్వం జమ చేసింది. వరద బాధితులకు న‌ష్ట‌ప‌రిహారం పంపిణీ కార్యక్రమంలోనే సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొన్నారు. కొందరు బాధితులకు స్వయంగా చెక్కులు అందజేశారు.

సీఎం రిలీఫ్ ఫండ్ కు 400 కోట్ల రూపాయలు రావడం ఒక చరిత్ర అని చంద్రబాబు అన్నారు. వరద సహాయక కార్యక్రమాల్లో అధికారులు, మంత్రులు ఒక స్పిరిట్‌తో పనిచేశారని కొనియాడారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయని, ఆఖరు బాధితుడికి కూడా సాయం అందలన్నదే తమ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. వరద విపత్తు నుంచి చాలా త్వరగా బయటపడ్డామని, తనతోపాటు నిర్విరామంగా 11 రోజుల పాటు ఉద్యోగులంతా పని చేశారని చంద్రబాబు ప్రశంసించారు. ఇక, వరద బాధితులకు విరాళాలు ఇచ్చేందుకు సినీ, వ్యాపార ప్రముఖులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, తన పిలుపు మేరకు వారంతా బ్రహ్మాండంగా స్పందించారని చెప్పారు. వరదలతో నష్టపోయిన వాహనాలకు బీమా చెల్లింపులు కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలోని ప్రజలకు సాయం అందనుంది. వరదల్లో గ్రౌండ్ ఫ్లోర్ మునిగినవారికి రూ. 25వేలు, ఫస్ట్ ఫ్లోర్…ఆపై అంతస్తుల్లో ఉండేవారికి రూ. 10 వేలు, షాపులు ధ్వంసమైనవారికి రూ. 25 వేలు, హెక్టారు పంటకు రూ. 25 వేలు చొప్పున పరిహారం అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మందికి ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ పంపిణీ చేయనుంది. విజయవాడ పరిధిలోనే బాధితులు సుమారు లక్షన్నర మంది ఉన్నారు. బాధితులకు ఆర్థిక సాయం కింద సుమారు రూ. 600 కోట్లను ప్రభుత్వం పంపిణి చేయనుంది.

Satya

Recent Posts

ఇంకో మెట్టు ఎక్కేసావయ్య విజయ్

ఎంత సంపాదించినా.. అందులోంచి ఎంతో కొంత లేని వారికి ఇవ్వడంలో ఉండే సంతోషమే వేరు. ఈ ఆనందాన్ని అందరూ అనుభవించరు,…

2 minutes ago

నాగబంధంను వ‌ద్ద‌న్న స్టార్ హీరోలు

స్టార్ హీరో హీరోయిన్లు న‌టించ‌క‌పోయినా.. పేరున్న ద‌ర్శ‌కుడు తీయ‌క‌పోయినా.. స్ట‌న్నింగ్ విజువ‌ల్స్‌తో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించి అంచ‌నాలు పెంచిన‌ సినిమా..…

1 hour ago

దర్శకులారా… చిరు మాట విన్నారా?

తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద కమర్షియల్ హీరోగా ఎదిగిన ఘనత మెగాస్టార్ చిరంజీవి సొంతం. 90వ దశకంలో జగదేక…

2 hours ago

నయనతార దైవమైతే మరి పూజా హెగ్డే ?

దర్శకుడు లారెన్స్ రాఘవేంద్ర హీరోగా ఆయన డైరెక్షన్లోనే రూపొందుతున్న కాంచన 4 షూటింగ్ కీలక దశకు చేరుకుంది. ఇందులో ముఖ్యమైన…

3 hours ago

దంగల్ పోలిక అవసరం లేదేమో పెద్ది

పెద్ది విషయంలో ప్రీ రిలీజ్ నుంచి పోస్ట్ రిలీజ్ దాకా జరుగుతున్న ఒక పొరపాటు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు…

4 hours ago

నాగబంధానికి ఇంత ప్రచారం అవసరమే

జూలై 3 నాగబంధం విడుదల కానుంది. కళ్యాణ్ రామ్ డెవిల్ తీసిన నిర్మాత కం దర్శకుడు అభిషేక్ నామా మీద…

4 hours ago