భారీ వర్షాలు, వరదల వల్ల విజయవాడ నగరం కొద్ది రోజుల క్రితం చిగురుటాకులా వణికి పోయిన సంగతి తెలిసిందే. వరదలకు తోడు బుడమేరు వాగు పొంగడంతో బెజవాడ వాసులు బెంబేలెత్తిపోయారు. అయితే, అంత కష్టంలో ఉన్న తన ప్రజలను కాపాడుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగడం, ఏడు పదుల వయసులోనూ వరద నీటిలో దిగి బాధితులకు నేనున్నాను అని భరోసానివ్వడంతో వారంతా ధైర్యంతో ఆ విపత్తును ఎదుర్కొన్నారు. పది రోజుల పాటు కలెక్టరేట్ లోనే మకాం వేసిన చంద్రబాబు ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో బాధితులకు సాయమందించారు.
ఈ క్రమంలోనే వరదల నుంచే కాదు..వరద బాధితులకు వరద మిగిల్చిన ఆర్థిక ముప్పు నుంచి కూడా వారిని చంద్రబాబు బయటపడేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా వరద బాధితులకు పరిహారాన్ని యుద్ధ ప్రాతిపదికన నేడు చంద్రబాబు విడుదల చేశారు. ఈ రోజు వరద బాధితుల ఖాతాల్లోకే నేరుగా సాయం నగదును ప్రభుత్వం జమ చేసింది. వరద బాధితులకు నష్టపరిహారం పంపిణీ కార్యక్రమంలోనే సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొన్నారు. కొందరు బాధితులకు స్వయంగా చెక్కులు అందజేశారు.
సీఎం రిలీఫ్ ఫండ్ కు 400 కోట్ల రూపాయలు రావడం ఒక చరిత్ర అని చంద్రబాబు అన్నారు. వరద సహాయక కార్యక్రమాల్లో అధికారులు, మంత్రులు ఒక స్పిరిట్తో పనిచేశారని కొనియాడారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయని, ఆఖరు బాధితుడికి కూడా సాయం అందలన్నదే తమ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. వరద విపత్తు నుంచి చాలా త్వరగా బయటపడ్డామని, తనతోపాటు నిర్విరామంగా 11 రోజుల పాటు ఉద్యోగులంతా పని చేశారని చంద్రబాబు ప్రశంసించారు. ఇక, వరద బాధితులకు విరాళాలు ఇచ్చేందుకు సినీ, వ్యాపార ప్రముఖులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, తన పిలుపు మేరకు వారంతా బ్రహ్మాండంగా స్పందించారని చెప్పారు. వరదలతో నష్టపోయిన వాహనాలకు బీమా చెల్లింపులు కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలోని ప్రజలకు సాయం అందనుంది. వరదల్లో గ్రౌండ్ ఫ్లోర్ మునిగినవారికి రూ. 25వేలు, ఫస్ట్ ఫ్లోర్…ఆపై అంతస్తుల్లో ఉండేవారికి రూ. 10 వేలు, షాపులు ధ్వంసమైనవారికి రూ. 25 వేలు, హెక్టారు పంటకు రూ. 25 వేలు చొప్పున పరిహారం అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మందికి ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ పంపిణీ చేయనుంది. విజయవాడ పరిధిలోనే బాధితులు సుమారు లక్షన్నర మంది ఉన్నారు. బాధితులకు ఆర్థిక సాయం కింద సుమారు రూ. 600 కోట్లను ప్రభుత్వం పంపిణి చేయనుంది.
This post was last modified on September 25, 2024 2:30 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…