సీఎం చంద్రబాబు పదే పదే తాము ప్రజా సేవకులమని చెబుతుంటారు. తమకు అధికారం ఇచ్చినా.. ఆ అధికారాన్ని ప్రజల సేవ కోసం వినియోగిస్తామని ఆయన అంటూ ఉంటారు. అలానే ఆయన కూడా వ్యవహరిస్తున్నారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో మోకాల్లోతు నీటిలోకి దిగి.. చంద్రబాబు బాధితులను పరామర్శించారు. దీంతో తమకు వచ్చిన గంభీరమైన ఆవేదనను కూడా బాధితులు దిగమింగుకుని కనిపించారు. ఇక, మంత్రులు మొత్తంగా చంద్రబాబు పిలుపుతో సేవలకు రంగంలోకి దిగారు.
అయితే.. ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే.. ముగ్గురు మంత్రులు మాత్రమే సేవకులుగా కనిపిస్తే.. మిగిలిన వారు కాలికి నీళ్లు తగలకుండా పనిచేశారు. ఇప్పుడు ఈ జాబితానే చంద్రబాబు రెడీ చేసుకున్నారు. సరే.. ఈ స్టోరీ ఎలా ఉన్నప్పటికీ.. ఆ ముగ్గురు మంత్రుల గురించి.. చంద్రబాబు ప్రస్తావిస్తూ.. పొగడ్తల వర్షం కురిపించారు. వారిలో ముందు వరుసలోఉన్నది నిమ్మల రామానాయుడు. రెండో మంత్రి గొట్టిపాటి రవి, మూడో మంత్రి అనగాని సత్యప్రసాద్. వీరంతా కూడా.. అధికారం చలాయించకుండా.. వరదల సమయంలో నిజమైన ప్రజాసేవకులుగా పనిచేయడం గమనార్హం.
నిమ్మల: బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన తొలి రోజు పర్యటించారు. దీనికి కారణం తెలుసుకున్నారు. ఆ వెంటనే బుడమేరకు పడిన భారీగండిని పూడ్చే పనిని సీఎం ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన చేపట్టారు. ఆర్మీని, జలవనరుల శాఖ అధికారులను కూడా సమన్వయం చేసుకుంటూ.. రేయింబవళ్లు అక్కడే ఉండి.. గండిని పూడ్చారు. ఫలితంగా.. నాలుగు రోజుల పాటు తిప్పలు పెట్టిన వరదలకు బ్రేకు పడింది. ఈయనకు అప్పట్లోనే మంచి ఎలివేషన్ వచ్చింది.
గొట్టిపాటి, అనగాని: ఇద్దరూ కూడా తెనాలి ప్రాంతంలో కృష్ణానది వరద కారణంగా కుడి కరకట్టకు ప్రమాదం పొంచి ఉందని తెలిసి..యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగారు. కరకట్టను పటిష్ఠ పరిచేందుకు రేయింబవళ్లు కష్టపడ్డారు. మంత్రులు ఇద్దరూ అక్కడే తిష్ఠవేసి మరీ కరకట్టను బలోపేతం చేశారు. మొత్తం 35 కిలో మీటర్ల మేరకు కరకట్టను బలోపేతం చేశారు. దీనికిగాను సొంతంగానే సైన్యాన్ని రంగంలోకి దింపారు. 8 జేసీబీలు, 100కు పైగా ట్రాక్టర్లను వినియోగించారు. వీరి ప్రయత్నం సఫలం అయింది. అలా కాకపోయి ఉంటే.. పదుల సంఖ్యలో ప్రజలు నీట మునిగిపోయి ఉండేవారు. వీరిని కృషిని గుర్తించిన చంద్రబాబు తాజాగా ప్రశంసలతో ముంచెత్తారు.
This post was last modified on September 20, 2024 3:45 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…