Political News

చంద్ర‌బాబు… ఎక్క‌డ త‌గ్గాలో కాదు నెగ్గాలో తెలిసినోడు!

ఎక్క‌డ త‌గ్గాలో కాదు.. ఎక్క‌డ నెగ్గాలో కూడా తెలిసిన నాయ‌కుడు చంద్ర‌బాబు!. ఈ విష‌యంలో ఆయ‌న‌కు తిరుగులేద‌ని మ‌రోసారి నిరూపించారు. రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ముఖ్యంగా అధికారంలో ఉన్న‌వారు.. తాము తీసుకున్న నిర్ణ‌యాల‌కే క‌ట్టుబ‌డ‌తారు. తాముప‌ట్టిన కుందేలుకు మూడేకాళ్ల‌ని మంకు ప‌డ‌తారు కూడా! ఉదాహ‌ర‌ణ‌కు వేలాది మంది రైతులు గ‌గ్గోలు పెట్టినా.. అమ‌రావ‌తిని కొన‌సాగించేది లేద‌ని గ‌త సీఎం జ‌గ‌న్ మంకుప‌ట్టు ప‌ట్టారు. ఫ‌లితంగా ప్ర‌జ‌ల మ‌న‌సులు ఆయ‌న చూర‌గొన‌లేక పోయారు.

కానీ, బాబు దీనికి భిన్నంగా ఆలోచ‌న చేశారు. తాజాగా విజ‌య‌వాడ, బాప‌ట్ల‌, గుంటూరు, ఏలేరు కార‌ణంగా మునిగిన కాకినాడ గ్రామాల్లో బాధితుల‌ను ఆదుకునేందుకు చాలా ఉదారంగా ఆలోచించారు. ముందు ఆయ‌న చెప్పిన దానికంటే కూడా త‌ర్వాత‌.. అది కూడా ఖ‌చ్చితంగా మీడియాతో మాట్లాడుతున్న స‌మ‌యంలోనే అనేక నిర్ణ‌యాలు మ‌ర్చుకుని.. బాధితులకు ఊర‌టనిచ్చే నిర్ణ‌యాలు తీసుకున్నారు. ముందుగా బాదితుల‌కు అంటే.. పూర్తిగా ఇల్లు మునిగిన వారికి రూ.25 వేలు మాత్ర‌మే ఇవ్వాల‌ని అనుకున్నారు. కానీ, అనేక చోట్ల పాక్షికంగా మునిగిన‌ప్ప‌టి న‌ష్టం మాత్రం భారీగా క‌నిపించింది.

ఈ విష‌యాన్ని మీడియా ప్ర‌తినిధులు సీఎంకు వివ‌రించారు. ఒక‌రిద్ద‌రు త‌మ ఫోన్ల‌లోని వీడియోల‌ను కూడా ఆయ‌న‌కు చూపించారు. దీంతో మ‌న‌సు క‌రిగిపోయిన చంద్ర‌బాబు ఇలాంటి వారికి కూడా రూ.25 చొప్పున ప‌రిహారం ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అదేవిధంగా ఫ‌స్ట్ ఫ్లోర్‌లో నివ‌సించేవారికి ఎలాంటి ప‌రిహారం ఉండ‌ద‌ని.. కొన్నాళ్ల కింద‌ట మంత్రి ఒక‌రు ప్ర‌క‌టించారు. దీనిపై అప్ప‌ట్లో చంద్ర‌బాబు ఇవ్వ‌లేమ‌న్నారు. కానీ, వారి వెత‌ల‌ను కూడా తాజాగా ప‌రిశీల‌నకు తీసుకుని ఫ‌స్ట్ ఫ్లోర్‌లో ఉన్న‌వారికి కూడా ప‌రిహారం కింద రూ.10 వేల సాయం ప్ర‌క‌టించారు. ఇక‌, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండి ఇబ్బందులు ప‌డిన వారికి తొలినాళ్ల‌లో రూ.10 వేలు ప్ర‌క‌టించారు. కానీ,ఇప్పుడు ఈ సాయాన్ని రూ.25 వేల‌కు పెంచారు.

అన్నిటికంటే గొప్ప విష‌యం ఏంటంటే. రైతుల‌ను ఆదుకున్న తీరు. ఏలేరులో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా చంద్ర‌బాబు వ‌ర‌దల కార‌ణంగా న‌ష్ట‌పోయిన‌ రైతుల‌కు హెక్టారుకు రూ.10 చొప్పున సాయం చేస్తామ‌న్నారు. కానీ, తాజాగా మాత్రం ఆయ‌న పాతిక వేలు ప్ర‌క‌టించారు. అప్ప‌ట్లో కౌలు రైతుల విష‌యాన్ని త‌ర్వాత చూస్తామ‌న్న ఆయ‌న ఇప్పుడు వారికే ప‌రిహారం ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అంతేకాదు.. ప‌శువుల విష‌యంలోనూ భారీ ప‌రిహారం ప్ర‌క‌టించారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు విష‌యంలో బాధితుల‌కు ఉన్న అనుమానాలు తీరిపోయి.. హ‌ర్షం వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on September 20, 2024 3:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

3 hours ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

7 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

9 hours ago

దురంధర్ VS విశ్వరూపం – ఎందుకీ రచ్చ?

ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…

9 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

11 hours ago

టార్గెట్ వైసీపీ… బాబు-ప‌వ‌న్ రచిస్తున్న వ్యూహం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు సుమారు గంట‌కుపైగా చ‌ర్చ‌లు జ‌రిపారు. బుధ‌వారం ఉద‌యం ఉండ‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి నివాసానికి…

11 hours ago