ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో కూడా తెలిసిన నాయకుడు చంద్రబాబు!. ఈ విషయంలో ఆయనకు తిరుగులేదని మరోసారి నిరూపించారు. రాజకీయాల్లో ఉన్నవారు.. ముఖ్యంగా అధికారంలో ఉన్నవారు.. తాము తీసుకున్న నిర్ణయాలకే కట్టుబడతారు. తాముపట్టిన కుందేలుకు మూడేకాళ్లని మంకు పడతారు కూడా! ఉదాహరణకు వేలాది మంది రైతులు గగ్గోలు పెట్టినా.. అమరావతిని కొనసాగించేది లేదని గత సీఎం జగన్ మంకుపట్టు పట్టారు. ఫలితంగా ప్రజల మనసులు ఆయన చూరగొనలేక పోయారు.
కానీ, బాబు దీనికి భిన్నంగా ఆలోచన చేశారు. తాజాగా విజయవాడ, బాపట్ల, గుంటూరు, ఏలేరు కారణంగా మునిగిన కాకినాడ గ్రామాల్లో బాధితులను ఆదుకునేందుకు చాలా ఉదారంగా ఆలోచించారు. ముందు ఆయన చెప్పిన దానికంటే కూడా తర్వాత.. అది కూడా ఖచ్చితంగా మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే అనేక నిర్ణయాలు మర్చుకుని.. బాధితులకు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా బాదితులకు అంటే.. పూర్తిగా ఇల్లు మునిగిన వారికి రూ.25 వేలు మాత్రమే ఇవ్వాలని అనుకున్నారు. కానీ, అనేక చోట్ల పాక్షికంగా మునిగినప్పటి నష్టం మాత్రం భారీగా కనిపించింది.
ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు సీఎంకు వివరించారు. ఒకరిద్దరు తమ ఫోన్లలోని వీడియోలను కూడా ఆయనకు చూపించారు. దీంతో మనసు కరిగిపోయిన చంద్రబాబు ఇలాంటి వారికి కూడా రూ.25 చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో నివసించేవారికి ఎలాంటి పరిహారం ఉండదని.. కొన్నాళ్ల కిందట మంత్రి ఒకరు ప్రకటించారు. దీనిపై అప్పట్లో చంద్రబాబు ఇవ్వలేమన్నారు. కానీ, వారి వెతలను కూడా తాజాగా పరిశీలనకు తీసుకుని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవారికి కూడా పరిహారం కింద రూ.10 వేల సాయం ప్రకటించారు. ఇక, గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి ఇబ్బందులు పడిన వారికి తొలినాళ్లలో రూ.10 వేలు ప్రకటించారు. కానీ,ఇప్పుడు ఈ సాయాన్ని రూ.25 వేలకు పెంచారు.
అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే. రైతులను ఆదుకున్న తీరు. ఏలేరులో పర్యటించిన సందర్భంగా చంద్రబాబు వరదల కారణంగా నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.10 చొప్పున సాయం చేస్తామన్నారు. కానీ, తాజాగా మాత్రం ఆయన పాతిక వేలు ప్రకటించారు. అప్పట్లో కౌలు రైతుల విషయాన్ని తర్వాత చూస్తామన్న ఆయన ఇప్పుడు వారికే పరిహారం ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు.. పశువుల విషయంలోనూ భారీ పరిహారం ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు చంద్రబాబు విషయంలో బాధితులకు ఉన్న అనుమానాలు తీరిపోయి.. హర్షం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
This post was last modified on September 20, 2024 3:45 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…