Political News

జ‌గ‌న్ ‘వెక్కిరింపు’ రాజ‌కీయాలు!

ఏలేరు రిజ‌ర్వాయ‌ర్ కు పోటెత్తిన వ‌ర‌ద‌ల కార‌ణంగా.. కాకినాడ జిల్లా ప‌రిధిలోని 62 గ్రామాలు నీట మునిగాయి. వీటి లో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురంలోని కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇక్క‌డ ప‌ర్య‌టించారు. ఆయా గ్రామాల ప్ర‌జ‌ల‌ను క‌లుసుకున్నారు. అయితే.. ఆయ‌న ఉత్త‌చేతుల‌తో వ‌చ్చి.. త‌మ‌ను ప‌ల‌కిస్తున్నార‌ని కొంద‌రు నిల‌దీశారు. మ‌రికొంద‌రు సెల్ఫీలు దిగేందుకు ముందుకు వ‌చ్చారు. ఎక్కువ మంది సాయం అంద‌డం లేద‌ని ఫిర్యాదు చేశారు.

ఈ ప‌ర్య‌ట‌న‌లో గ‌త ఎన్నిక‌ల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయిన వంగా గీత‌, మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు కూడా ఉన్నారు. స్థానిక నాయ‌కులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స్థానిక ర‌మ‌ణ‌క్క పేట‌లో జ‌గ‌న్ మాట్లాడుతూ.. చంద్ర‌బాబు స‌ర్కారు తీరుపై ‘వెక్కిరింపు’ రాజ‌కీయాలు చేశారు. “నీకు ప‌దైదు వేలు.. నీకు ప‌దైదు వేలు..” అంటూ ఆయ‌న చిత్రంగా మాట్లాడుతూ.. వెక్కించారు. ఎన్నిక‌ల‌కు ముందు ‘త‌ల్లికి వంద‌నం’ పేరుతో చంద్ర‌బాబు సూప‌ర్ సిక్స్‌లో ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించారు.

దీని ప్ర‌కారం.. ప్ర‌తి కుటుంబంలో ఎంత మంది పిల్ల‌లు స్కూళ్ల‌కు వెళ్తున్నా.. వారికి రూ.15000 చొప్పున బ్యాంకులో వేస్తామ‌న్నారు. అయితే.. అధికారంలోకి వ‌చ్చి మూడు మాసాలైనా ఇంకా ఈ నిధులు ఇవ్వ‌డం లేద‌ని.. జ‌గ‌న్ ప‌లు సంద‌ర్భాల్లో ఆరోపిస్తూ వ‌చ్చారు. అయితే.. తాజాగా దీనిని వెక్కిరిస్తూ.. రాజ‌కీయాలు చేయ‌డం గ‌మ‌నార్హం. “రా..రా.. రా.. రా.. నీకు ప‌దైదు వేలు.. నువ్రా.. నువ్రా.. నీకు ప‌దైదు వేలు” అంటూ..జ‌గ‌న్ వెక్కిరిస్తూ వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్ల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది.

ఇదిలావుంటే.. చంద్ర‌బాబు వైఫ‌ల్యంతోనే బుడ‌మేరు కార‌ణంగా విజ‌య‌వాడ శివారు ప్రాంతాలు నీట మునిగాయ‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఇక్క‌డ ఏలేరు జ‌లాశ‌యానికి కూడా చంద్ర‌బాబు నిర్వాకంతోనే వ‌ర‌ద‌లు వ‌చ్చాయ‌ని విమర్శించారు. ఫ్ల‌డ్ మేనేజ్ మెంట్‌లో చంద్ర‌బాబు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని.. పైనుంచి వ‌ర‌ద‌లు వ‌స్తున్నాయ‌ని తెలిసినా ఏలేరు రిజ‌ర్వాయ‌ర్‌ను ఖాళీ చేయ‌కుండా అలానే ఉంచార‌ని.. ఈ కార‌ణంగానే పిఠాపురం.. స‌హా ప‌లు గ్రామాలునీట మునిగాయ‌ని చెప్పారు.

This post was last modified on September 13, 2024 10:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

3 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

5 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

8 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

9 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

10 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

10 hours ago