Political News

వైసీపీలో ఆ ఇద్ద‌రే క‌నిపిస్తున్నారు… రీజ‌నేంటి..!

విప‌క్షం వైసీపీపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు.. కీల‌క వ‌ర‌ద‌ల స‌మ‌యంలో త‌మ‌ను తాము డిఫెన్స్ చేసుకునేం దుకు.. వైసీపీ త‌ర‌ఫున కేవ‌లం ఇద్ద‌రంటే ఇద్ద‌రు నాయ‌కులు మాత్ర‌మే మాట్లాడుతున్నారు. వారిద్ద‌రూ మాజీ మంత్రులే. ఒక‌రు పేర్ని నాని, మ‌రొకరు అంబ‌టి రాంబాబు. వీరిద్ద‌రు మిన‌హా మిగిలిన వారు ఎవ‌రూ కూడా మీడియా ముందుకు రావ‌డం లేదు. డిఫెన్స్ కూడా చేసుకోవ‌డం లేదు. ఎవ‌రికి వారు మౌనంగానే ఉండిపోతున్నారు. మ‌రి దీని వెనుక రీజనేంటి? అనేది ఆస‌క్తిగా మారింది.

వాస్త‌వానికి వైసీపీకి విజ‌య‌వాడ‌లోనే ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు, మ‌ల్లాది విష్ణు వంటివారు ఉన్నారు. కీల‌క‌మైన వ‌ర‌ద‌ల స‌మ‌యంలో వారు మాట్లాడొచ్చు. కానీ, వారిద్ద‌రూ ఎక్క‌డా క‌నిపించ డం లేదు. ఇక‌, మిగిలిన నాయ‌కులు రోజా, కొడాలి నాని.. వంటివారు కూడా మౌనంగానే ఉండిపోతున్నారు. పోనీ. ప‌రిస్థితి ప్ర‌శాంతంగా ఉందా? అంటే.. అదీ లేదు. అధికార పార్టీ నుంచి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ స‌మ‌యంలో వారు ఏం చేస్తున్నార‌నేది ప్ర‌శ్న‌.

తాజాగా వైసీపీ అంత‌ర్గ‌త స‌మాచారం ప్ర‌కారం.. మాజీ సీఎం జ‌గ‌న్ అంద‌రికీ ఫ్రీహ్యాండ్ ఇచ్చార‌ని తెలిసింది. అంటే అంద‌రూ మీడియా ముందుకు వ‌చ్చి ప్ర‌స్తుత ప‌రిస్థితిపై వ్యాఖ్యానించాల‌ని.. పార్టీకి ఎదుర వుతున్న ఇబ్బందులు త‌గ్గించాల‌ని కూడా పేర్కొన్నార‌ట‌. కానీ, కేవ‌లం అంబ‌టి, నానిలు మాత్ర‌మే మీడియా ముందుకు వ‌స్తున్నారు. మిగిలిన వారు మాత్రం త‌మ‌పై ఉన్న కేసులు.. లేదా.. నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన కూట‌మి కేడ‌ర్ కార‌ణం.. వెన‌క్కి త‌గ్గుతున్నార‌ని తెలుస్తోంది.

అంటే ఒక ర‌కంగా నాయ‌కులు భ‌య‌ప‌డుతున్నార‌నేది వాస్త‌వం. ఇప్ప‌టికే త‌మ‌పై కేసులు ఉన్న నేప థ్యంలో తాము ఇప్పుడు నోరు తెరిస్తే.. ఏదో ఒక కేసు పెట్టి ఇబ్బందులు పెట్టే అవ‌కాశం ఉంటుంద‌ని ఒక‌వైపు ఆలోచ‌న‌గా ఉంటే.. మ‌రోవైపు నాయ‌కుల‌కు ఏం జ‌రిగినా.. పార్టీ అధిష్టానం సైలెంట్‌గా ఉంటున్న విష‌యాన్ని కూడా నాయ‌కులు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో త‌మ‌కెందుకు బుర‌ద అంటించుకోవ‌డం అనే ధోర‌ణిలోనే నాయ‌కులు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ కార‌ణంగానే వైసీపీలో జోష్ క‌నిపించ‌డం లేద‌ని తెలుస్తోంది.

This post was last modified on September 10, 2024 5:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘భర్త’ మహా ‘రాజు’లకు భలే వరం దొరికింది

ఇప్పటిదాకా ప్యాన్ ఇండియా మూవీస్ కే ఎక్కువ పరిమితమైన టికెట్ రేట్ల పెంపు మెల్లగా మీడియం బడ్జెట్ సినిమాలకు వచ్చేస్తోంది.…

3 minutes ago

ప‌వ‌న్ క‌ల్యాణ్ గారూ… మీరే దిక్కు!

ఆదీవాసీ స‌మాజానికి ఐకాన్‌గా క‌నిపిస్తున్న ఏకైక నాయ‌కుడు, జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఆదివాసీలు(గిరిజ‌నులు) నివ‌సిస్తున్న గ్రామాలు,…

18 minutes ago

టికెట్ రేట్లతో మంత్రికి సంబంధం లేదట

తెలంగాణలో పెద్ద సినిమాలకు టికెట్ల ధరలు పెంచడం, ప్రీమియర్ షోలు వేయడం గురించి ఏడాది కిందట్నుంచి పెద్ద చర్చే జరుగుతోంది.…

48 minutes ago

ఫేక్ రేటింగులకు ప్రసాద్ గారి బ్రేకులు

చాలా కాలంగా నిర్మాతలను వేధిస్తున్న సమస్య బుక్ మై షో రేటింగ్స్, రివ్యూస్. టికెట్లు కొన్నా కొనకపోయినా ఇవి ఇచ్చే…

51 minutes ago

పెద్ద ప్రభాస్ రిటర్న్స్… టికెట్ ధరలు నార్మల్

నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…

3 hours ago

శ్రీలీల కోరుకున్న బ్రేక్ దొరికిందా

సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…

4 hours ago